Pawan Kalyan: పవన్‌కల్యాణ్‌ పర్యటనలో అపశ్రుతి

ధర్మపురిలో పూజల అనంతరం పవన్‌ కల్యాణ్‌ వాహనశ్రేణి మంగళవారం రాత్రి ఏడో నెంబరు రాష్ట్ర రహదారిపై వెళ్తుండగా.. అపశ్రుతి చోటుచేసుకుంది.

Updated : 25 Jan 2023 07:43 IST

యువకుడి దుర్మరణం, ముగ్గురికి గాయాలు

వెల్గటూరు, న్యూస్‌టుడే: ధర్మపురిలో పూజల అనంతరం పవన్‌ కల్యాణ్‌ వాహనశ్రేణి మంగళవారం రాత్రి ఏడో నెంబరు రాష్ట్ర రహదారిపై వెళ్తుండగా.. అపశ్రుతి చోటుచేసుకుంది. పవన్‌ అభిమానులైన కూస రాజ్‌కుమార్‌ (20), జక్కుల అంజి బైక్‌పై అనుసరించారు. జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం కిషన్‌రావుపేట వద్ద అత్యుత్సాహంతో పవన్‌ వాహన శ్రేణిని అధిగమించబోయి.. ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని, కారును ఢీకొట్టారు. ప్రమాదంలో రాజ్‌కుమార్‌ మృతి చెందాడు. అంజికి, ఎదురుగా ద్విచక్ర వాహనంపై ఉన్న బొలిశెట్టి శ్రీనివాస్‌, నీలం సాగర్‌లకు తీవ్ర గాయాలయ్యాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని