రెండున్నరేళ్ల చిన్నారిపై అత్యాచారం
పాపను ఆడించేందుకు వచ్చాడనుకున్న యువకుడు అఘాయిత్యానికి తెగబడ్డాడు. అభం శుభం తెలియని రెండున్నరేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
మహబూబాబాద్ జిల్లాలో దారుణం
గార్ల, న్యూస్టుడే: పాపను ఆడించేందుకు వచ్చాడనుకున్న యువకుడు అఘాయిత్యానికి తెగబడ్డాడు. అభం శుభం తెలియని రెండున్నరేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణ సంఘటన మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలోని ఓ తండాలో బుధవారం జరిగింది. రోజూ మాదిరి వ్యవసాయ పనులకు వెళ్లిన పాప తల్లిదండ్రులు ఇంటికి తిరిగి వచ్చేంత వరకు చిన్నారి బాధ్యతలను బామ్మకు అప్పగించారు. బామ్మ ఆరుబయట పనులు చేస్తుండగా పాప ఇంట్లో ఆడుకుంటోంది. అదే తండాకు చెందిన అశోక్ (32) ఇంట్లోకి వెళ్లాడు. పాపను ఆడించేందుకు వచ్చాడని బామ్మ భావించగా.. ఆ యువకుడు చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. భయంతో చిన్నారి ఏడుస్తుండడంతో ఇంటి పక్కనే ఉన్న వారంతావచ్చారు. వారిని చూసిన నిందితుడు పారిపోయేందుకు ప్రయత్నించాడు. అతడిని విద్యుత్తు స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేశారు. పోలీసులు ఆ యువకుడిని అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. పాపను వైద్య పరీక్షల నిమిత్తం మహబూబాబాద్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ యువకుడు గతంలో నాలుగేళ్ల పాపపై అత్యాచారయత్నానికి ప్రయత్నించడంతో గ్రామస్థులు పట్టుకొని మందలించారు. అయినా అతని ప్రవర్తనలో మార్పు రాలేదని, ఈ సంఘటన నేపథ్యంలో కఠిన చర్యలు తీసుకోవాలంటూ గ్రామస్థులు డిమాండ్ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొల్లగొడుతున్న సైబర్ ముఠాలు
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి వ్యాపారి(40) వాట్సప్కు స్టాక్మార్కెట్ మెలకువలు నేర్పిస్తామంటూ మెసేజ్ వచ్చింది. ఆయన ఆసక్తి చూపడంతో ‘ఓక్ట్రీ క్యాపిటల్ గ్రూప్’ పేరిట ఉన్న వాట్సప్ గ్రూప్లో చేర్చారు. నిర్వాహకుల మాటలు నమ్మి వారు సూచించిన బ్యాంకు ఖాతాలోకి వ్యాపారి నగదు బదిలీ చేస్తూ వచ్చారు. -
శిర్డీ ఎక్స్ప్రెస్లో భారీ చోరీ
శిర్డీ ఎక్స్ప్రెస్లో గురువారం అర్ధరాత్రి దాటాక దొంగలు విరుచుకుపడ్డారు. ప్రయాణికుల విలువైన వస్తువులు దోచుకొని పారిపోయారు. శుక్రవారం తెల్లవారుజామున గుర్తించిన బాధితులు సికింద్రాబాద్ రైల్వేపోలీసులకు ఫిర్యాదు చేశారు. -
కొడవలితో కొడుకు ఛాతీని గాయపరిచిన తల్లిదండ్రులు
గుడుంబా మత్తులో మానవత్వం మరిచిన ఓ జంట కన్నకొడుకు ఛాతీని కొడవలితో కోసిన ఘటన మంచిర్యాల జిల్లా నెన్నెల మండల కేంద్రంలో గురువారం రాత్రి జరిగింది. -
ప్రతికూల వాతావరణంతో యువ సైనికుడి మృతి
సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలనే ఆ యువకుని తపన ఆదిలోనే ఆవిరైపోయింది. అనారోగ్యం బారినపడటంతో యువసైనికుడు గురువారం రాత్రి మృత్యువాత పడ్డారు. -
గురుకుల విద్యార్థి మృతి
జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ బాలుర గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థి అస్వస్థతకు గురై మృతి చెందాడు. అనంతరం మరో ఇద్దరు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. -
గంజాయి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడి.. సహకరించిన భార్య
న్యాయ విద్య చదువుకొని ఉన్నతంగా జీవించాల్సిన యువ దంపతులు గాడితప్పారు. గంజాయికి బానిసలై.. అడ్డదారులు తొక్కారు. సహచర విద్యార్థి అయిన యువతిని ఆ మత్తు ఊబిలోకి దించారు. -
విద్యార్థి ఉసురు తీసిన నాడు-నేడు పనులు
గత వైకాపా ప్రభుత్వ హయాంలో నాసిరకంగా చేపట్టిన నాడు-నేడు అదనపు తరగతి గదుల నిర్మాణ పనులు ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. లింటెల్, దానిపైన ఉన్న గోడ కూలి మీద పడటంతో ఓ విద్యార్థి మృతి చెందిన ఘటన నెల్లూరులో చోటుచేసుకుంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు