పాముతో ఫొటో సరదా.. కాటేయడంతో యువకుడి మృతి
పాముతో ఫొటో తీసుకోవాలని యత్నించిన యువకుడు దాని కాటుకు గురై మృతిచెందిన ఉదంతమిది... ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం బొద్దికూరపాడుకు చెందిన పోలంరెడ్డి రాఘవరెడ్డి, సరస్వతి దంపతుల కుమారుడు మణికంఠారెడ్డి(23). డిగ్రీ చదివి, కందుకూరులోని ఆర్టీసీ డిపో సమీపంలో లస్సీ దుకాణం నిర్వహిస్తున్నారు.
కందుకూరు పట్టణం, న్యూస్టుడే: పాముతో ఫొటో తీసుకోవాలని యత్నించిన యువకుడు దాని కాటుకు గురై మృతిచెందిన ఉదంతమిది... ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం బొద్దికూరపాడుకు చెందిన పోలంరెడ్డి రాఘవరెడ్డి, సరస్వతి దంపతుల కుమారుడు మణికంఠారెడ్డి(23). డిగ్రీ చదివి, కందుకూరులోని ఆర్టీసీ డిపో సమీపంలో లస్సీ దుకాణం నిర్వహిస్తున్నారు. మంగళవారం రాత్రి వెంకటస్వామి అనే వ్యక్తి పామును ఆడిస్తూ లస్సీ దుకాణం దగ్గరకు వచ్చాడు. పామును మెడలో వేసుకుని ఫొటో తీయించుకోవాలని మణికంఠ సరదా పడ్డారు. పక్కనే మరో దుకాణంలో పనిచేస్తున్న యువకుడిని పిలిచి తన సెల్ఫోన్ను అతనికిచ్చి... ఫొటోలు, వీడియోలు తీయాలని చెప్పి పామును మెడలో వేసుకున్నారు. ఈ క్రమంలో పాము కింద పడింది. దాన్ని పైకి లాగడంతో మణికంఠ చేతిపై కాటేసింది. అతడిని స్థానికులు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రథమ చికిత్స అనంతరం పరిస్థితి విషమంగా ఉందని ఒంగోలులోని రిమ్స్కు పంపారు. అప్పటికే మృతిచెందినట్లు రిమ్స్ వైద్యులు తెలిపారు. బంధువులు మృతదేహాన్ని మంగళవారం అర్ధరాత్రి బొద్దికూరపాడుకు తరలించారు. కందుకూరు ఆసుపత్రిలో చికిత్స పొందే సమయంలో... ఫోన్లో ఉన్న ఫొటోలు చూస్తే తల్లిదండ్రులు మందలిస్తారని వాటిని డిలీట్ చేయించినట్లు తెలిసింది. చేతికి అందొచ్చిన కుమారుడు మృతిచెందడంతో తల్లిదండ్రులు, బంధువులు బోరున విలపించారు. రాఘవరెడ్డి, సరస్వతి దంపతుల చిన్న కుమారుడు ఇంద్రారెడ్డి ఐదేళ్ల కిందట కిడ్నీ సమస్యతో చనిపోయినట్లు బంధువులు తెలిపారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ వెంకట్రావు, పట్టణ ఎస్ఐ కిషోర్బాబు తెలిపారు. పామును ఆడిస్తున్న వెంకటస్వామిపై జంతుహింస చట్టం కింద కేసు నమోదు చేయనున్నట్లు వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొల్లగొడుతున్న సైబర్ ముఠాలు
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి వ్యాపారి(40) వాట్సప్కు స్టాక్మార్కెట్ మెలకువలు నేర్పిస్తామంటూ మెసేజ్ వచ్చింది. ఆయన ఆసక్తి చూపడంతో ‘ఓక్ట్రీ క్యాపిటల్ గ్రూప్’ పేరిట ఉన్న వాట్సప్ గ్రూప్లో చేర్చారు. నిర్వాహకుల మాటలు నమ్మి వారు సూచించిన బ్యాంకు ఖాతాలోకి వ్యాపారి నగదు బదిలీ చేస్తూ వచ్చారు. -
శిర్డీ ఎక్స్ప్రెస్లో భారీ చోరీ
శిర్డీ ఎక్స్ప్రెస్లో గురువారం అర్ధరాత్రి దాటాక దొంగలు విరుచుకుపడ్డారు. ప్రయాణికుల విలువైన వస్తువులు దోచుకొని పారిపోయారు. శుక్రవారం తెల్లవారుజామున గుర్తించిన బాధితులు సికింద్రాబాద్ రైల్వేపోలీసులకు ఫిర్యాదు చేశారు. -
కొడవలితో కొడుకు ఛాతీని గాయపరిచిన తల్లిదండ్రులు
గుడుంబా మత్తులో మానవత్వం మరిచిన ఓ జంట కన్నకొడుకు ఛాతీని కొడవలితో కోసిన ఘటన మంచిర్యాల జిల్లా నెన్నెల మండల కేంద్రంలో గురువారం రాత్రి జరిగింది. -
ప్రతికూల వాతావరణంతో యువ సైనికుడి మృతి
సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలనే ఆ యువకుని తపన ఆదిలోనే ఆవిరైపోయింది. అనారోగ్యం బారినపడటంతో యువసైనికుడు గురువారం రాత్రి మృత్యువాత పడ్డారు. -
గురుకుల విద్యార్థి మృతి
జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ బాలుర గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థి అస్వస్థతకు గురై మృతి చెందాడు. అనంతరం మరో ఇద్దరు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. -
గంజాయి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడి.. సహకరించిన భార్య
న్యాయ విద్య చదువుకొని ఉన్నతంగా జీవించాల్సిన యువ దంపతులు గాడితప్పారు. గంజాయికి బానిసలై.. అడ్డదారులు తొక్కారు. సహచర విద్యార్థి అయిన యువతిని ఆ మత్తు ఊబిలోకి దించారు. -
విద్యార్థి ఉసురు తీసిన నాడు-నేడు పనులు
గత వైకాపా ప్రభుత్వ హయాంలో నాసిరకంగా చేపట్టిన నాడు-నేడు అదనపు తరగతి గదుల నిర్మాణ పనులు ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. లింటెల్, దానిపైన ఉన్న గోడ కూలి మీద పడటంతో ఓ విద్యార్థి మృతి చెందిన ఘటన నెల్లూరులో చోటుచేసుకుంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!