పాముతో ఫొటో సరదా.. కాటేయడంతో యువకుడి మృతి
పాముతో ఫొటో తీసుకోవాలని యత్నించిన యువకుడు దాని కాటుకు గురై మృతిచెందిన ఉదంతమిది... ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం బొద్దికూరపాడుకు చెందిన పోలంరెడ్డి రాఘవరెడ్డి, సరస్వతి దంపతుల కుమారుడు మణికంఠారెడ్డి(23). డిగ్రీ చదివి, కందుకూరులోని ఆర్టీసీ డిపో సమీపంలో లస్సీ దుకాణం నిర్వహిస్తున్నారు.
కందుకూరు పట్టణం, న్యూస్టుడే: పాముతో ఫొటో తీసుకోవాలని యత్నించిన యువకుడు దాని కాటుకు గురై మృతిచెందిన ఉదంతమిది... ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం బొద్దికూరపాడుకు చెందిన పోలంరెడ్డి రాఘవరెడ్డి, సరస్వతి దంపతుల కుమారుడు మణికంఠారెడ్డి(23). డిగ్రీ చదివి, కందుకూరులోని ఆర్టీసీ డిపో సమీపంలో లస్సీ దుకాణం నిర్వహిస్తున్నారు. మంగళవారం రాత్రి వెంకటస్వామి అనే వ్యక్తి పామును ఆడిస్తూ లస్సీ దుకాణం దగ్గరకు వచ్చాడు. పామును మెడలో వేసుకుని ఫొటో తీయించుకోవాలని మణికంఠ సరదా పడ్డారు. పక్కనే మరో దుకాణంలో పనిచేస్తున్న యువకుడిని పిలిచి తన సెల్ఫోన్ను అతనికిచ్చి... ఫొటోలు, వీడియోలు తీయాలని చెప్పి పామును మెడలో వేసుకున్నారు. ఈ క్రమంలో పాము కింద పడింది. దాన్ని పైకి లాగడంతో మణికంఠ చేతిపై కాటేసింది. అతడిని స్థానికులు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రథమ చికిత్స అనంతరం పరిస్థితి విషమంగా ఉందని ఒంగోలులోని రిమ్స్కు పంపారు. అప్పటికే మృతిచెందినట్లు రిమ్స్ వైద్యులు తెలిపారు. బంధువులు మృతదేహాన్ని మంగళవారం అర్ధరాత్రి బొద్దికూరపాడుకు తరలించారు. కందుకూరు ఆసుపత్రిలో చికిత్స పొందే సమయంలో... ఫోన్లో ఉన్న ఫొటోలు చూస్తే తల్లిదండ్రులు మందలిస్తారని వాటిని డిలీట్ చేయించినట్లు తెలిసింది. చేతికి అందొచ్చిన కుమారుడు మృతిచెందడంతో తల్లిదండ్రులు, బంధువులు బోరున విలపించారు. రాఘవరెడ్డి, సరస్వతి దంపతుల చిన్న కుమారుడు ఇంద్రారెడ్డి ఐదేళ్ల కిందట కిడ్నీ సమస్యతో చనిపోయినట్లు బంధువులు తెలిపారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ వెంకట్రావు, పట్టణ ఎస్ఐ కిషోర్బాబు తెలిపారు. పామును ఆడిస్తున్న వెంకటస్వామిపై జంతుహింస చట్టం కింద కేసు నమోదు చేయనున్నట్లు వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మెదక్ జిల్లాలో పెళ్లి బృందం ట్రాక్టర్ బోల్తా: ఇద్దరి మృతి
ట్రాక్టర్ బోల్తాపడి ఇద్దరు మృతి చెందిన ఘటన మెదక్ జిల్లాలో బుధవారం సాయంత్రం చోటు చేసుకుంది. -
జూబ్లీహిల్స్ పోలీసుల అదుపులో హరీశ్రావు మాజీ పీఏ
ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) చెక్కుల కేసులో నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
ఫోన్లో గట్టిగా మాట్లాడొద్దన్నందుకు కుమారుడిని చంపిన తండ్రి
ఫోన్లో గట్టిగా అరుస్తూ మాట్లాడొద్దని చెప్పినందుకు మద్యం మత్తులో ఓ తండ్రి తన కుమారుడిని హత్య చేశాడు. -
వృద్ధురాలిపై చెప్పుతో దాడి
తాము చెప్పిన సంఖ్య కంటే ఎక్కువమంది మహిళలను ఎన్నికల ప్రచారానికి తీసుకొచ్చిందన్న కారణంతో ఓ వృద్ధురాలిపై వైకాపా కదిరి అభ్యర్థి మక్బూల్ అహమ్మద్ సమీప బంధువు పరికి షామీర్బాషా అసభ్య పదజాలంతో దూషిస్తూ చెప్పుతో దాడి చేశాడు. -
ఇసుకాసురుల కాసుల వేటలో.. మరో యువకుడు బలి
వైకాపా నాయకుల అండదండలతో ఇష్టారాజ్యంగా చేపడుతున్న ఇసుక తవ్వకాలతో మరో యువకుడు మృతిచెందారు. -
అనిశాకు చిక్కిన ఎంపీడీవో, సీనియర్ అసిస్టెంట్
లంచం తీసుకున్న కేసులో ఎంపీడీవో, సీనియర్ అసిస్టెంట్లను అరెస్టు చేసినట్లు అవినీతి నిరోధక శాఖ నిజామాబాద్ జిల్లా డీఎస్పీ శేఖర్ తెలిపారు. -
గోవా జైల్లో ఉన్న డ్రగ్ డాన్ ఫైజల్ అరెస్టు
పంజాగుట్ట డ్రగ్స్ కేసులో మరో ప్రధాన నిందితుడిని అరెస్టు చేశారు. గోవా డ్రగ్స్ నెట్వర్క్లో కీలకంగా వ్యవహరించే నైజీరియన్ ఇవాల ఉడోక స్టాన్లీకి సహచరుడు మహ్మద్ ఉస్మాన్ అలియాస్ ఫైజల్(29)ను తాజాగా అదుపులోకి తీసుకున్నారు. -
ఇఫ్తార్ ముగించి ఇంటికొస్తున్న బాలుడి కిడ్నాప్.. దారుణహత్య
మహారాష్ట్రలోని ఠాణె సమీప గోరేగావ్లో డబ్బు కోసం తొమ్మిదేళ్ల బాలుడిని కిడ్నాప్ చేసి, మృతదేహాన్ని గోనెసంచిలో కుక్కిన దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. -
మహిళ ఆత్మహత్య.. పక్కింట్లో మరో మహిళ హత్య!
ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడిన కొద్ది సమయానికే పక్కింటి మహిళ హత్యకు గురవడం జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం కమలాపూర్లో కలకలం సృష్టించింది. -
భారీ రాబడులంటూ కోటికి పైగా కొట్టేశారు.. వెలుగులోకి ఫేక్ స్టాక్ మార్కెట్ స్కామ్!
Scam Alert: స్టాక్ మార్కెట్ పెట్టుబడుల్లో పెద్ద మొత్తంలో స్థిరమైన ఆదాయం అంటూ మోసగాళ్లు కొత్త తరహా మోసానికి పాల్పడిన ఉదంతం ఇదీ..
తాజా వార్తలు (Latest News)
-
Social Look: రాశీఖన్నా ‘గోల్డెన్’ మెరుపులు.. అలా చూడొద్దన్న కేతిక.. టీమ్తో కృతి సనన్
-
దిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్కు దక్కని ఊరట
-
హైకోర్టుల్లోనూ మౌలిక సౌకర్యాల కొరత: సీజేఐ జస్టిస్ చంద్రచూడ్
-
ఒక్క ఓటరు కోసం.. 39 కి.మీ. ట్రెక్కింగ్కు పోలింగ్ సిబ్బంది రెడీ!
-
30 ఏళ్ల క్రితం సచిన్ ఆట మొదలైంది ఈ రోజే..!
-
జనసేన పెండింగ్ స్థానాలపై పవన్ కల్యాణ్ కసరత్తు