Hyderabad: కుమారుల అనారోగ్యంపై మనస్తాపం.. పిల్లలకు విషమిచ్చి దంపతుల ఆత్మహత్య
ఆ దంపతులకు పిల్లలే ప్రాణం. వాళ్లే ప్రపంచం. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న బిడ్డలు అనారోగ్యంతో బాధపడడాన్ని వారు తట్టుకోలేకపోయారు.
ఈనాడు-హైదరాబాద్, కాప్రా-న్యూస్టుడే: ఆ దంపతులకు పిల్లలే ప్రాణం. వాళ్లే ప్రపంచం. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న బిడ్డలు అనారోగ్యంతో బాధపడడాన్ని వారు తట్టుకోలేకపోయారు. వైద్యం అందించినా పరిస్థితిలో మార్పు రాకపోవడంతో వేదనకు గురయ్యారు. బిడ్డలకు విషమిచ్చి.. తామూ తీసుకున్నారు. హైదరాబాద్ కుషాయిగూడలోని కందిగూడలో చోటుచేసుకున్న ఈ ఘటన తీవ్ర విషాదం నింపింది.
పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్కు చెందిన గాదె సతీశ్(39)కు, సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండలానికి చెందిన వేద(35)తో 2012లో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు నిషికేత్(9), నిహాల్(5) ఉన్నారు. నిషికేత్ నాలుగో తరగతి చదువుతున్నాడు. ఆర్థికంగా ఇబ్బందులు లేవు. నగరంలో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్న సతీశ్.. రెండేళ్లుగా కుటుంబంతో కందిగూడలో నివాసముంటున్నారు. నిహాల్ పుట్టుకతోనే ఆటిజంతో బాధపడుతున్నాడు. కొద్దిరోజుల క్రితం నిషికేత్ కూడా తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. వైద్యులకు చూపించగా.. మెనింజైటిస్ ఉన్నట్లు చెప్పారు. నిషికేత్కు చెవుల నుంచి తరచూ చీము రావడంతో పాటు వినికిడి లోపం ఏర్పడింది. అప్పటినుంచి దంపతులిద్దరూ పిల్లల ఆరోగ్యం గురించి బాధపడేవారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారని భావిస్తున్నారు.
సైనైడ్ తీసుకుని: శనివారం పిల్లలకు, భార్యకు సతీశ్ సైనైడ్ ఇచ్చాడని.. ముగ్గురూ చనిపోయారని ధ్రువీకరించుకున్నాక తానూ తీసుకున్నాడని పోలీసులు తెలిపారు. మధ్యాహ్నం తర్వాత సతీశ్, వేదలకు తెలిసిన వ్యక్తులు ఎన్నిసార్లు ఫోన్ చేసినా తీయలేదు. అనుమానంతో ఇంటికొచ్చి చూడగా.. ఇద్దరు పిల్లలు, వేద పడక గదిలోని మంచంపై విగతజీవులుగా పడిఉన్నారు. సతీశ్ పక్క గదిలో కుప్పకూలిపోయి కనిపించాడు. పోలీసులకు సమాచారం అందించడంతో మృతదేహాల్ని గాంధీ ఆసుపత్రి మార్చురీకి తరలించారు.
‘ప్రశాంతంగా చనిపోనివ్వండి’..
ఆత్మహత్య చేసుకున్న గదిలో లేఖ లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. ‘మా నలుగుర్ని కాపాడాలని ప్రయత్నించొద్దు. ప్రశాంతంగా చనిపోనివ్వండి’’ అని అందులో రాసినట్లు తెలిసింది. దంపతులిద్దరూ అన్యోన్యంగా ఉండేవారని, పిల్లల అనారోగ్యంపైనే మనస్తాపానికి గురయ్యేవారని వేద తండ్రి శ్రీశైలం కంటతడి పెట్టారు. వారికి సైనైడ్ ఎలా లభించిందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొల్లగొడుతున్న సైబర్ ముఠాలు
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి వ్యాపారి(40) వాట్సప్కు స్టాక్మార్కెట్ మెలకువలు నేర్పిస్తామంటూ మెసేజ్ వచ్చింది. ఆయన ఆసక్తి చూపడంతో ‘ఓక్ట్రీ క్యాపిటల్ గ్రూప్’ పేరిట ఉన్న వాట్సప్ గ్రూప్లో చేర్చారు. నిర్వాహకుల మాటలు నమ్మి వారు సూచించిన బ్యాంకు ఖాతాలోకి వ్యాపారి నగదు బదిలీ చేస్తూ వచ్చారు. -
శిర్డీ ఎక్స్ప్రెస్లో భారీ చోరీ
శిర్డీ ఎక్స్ప్రెస్లో గురువారం అర్ధరాత్రి దాటాక దొంగలు విరుచుకుపడ్డారు. ప్రయాణికుల విలువైన వస్తువులు దోచుకొని పారిపోయారు. శుక్రవారం తెల్లవారుజామున గుర్తించిన బాధితులు సికింద్రాబాద్ రైల్వేపోలీసులకు ఫిర్యాదు చేశారు. -
కొడవలితో కొడుకు ఛాతీని గాయపరిచిన తల్లిదండ్రులు
గుడుంబా మత్తులో మానవత్వం మరిచిన ఓ జంట కన్నకొడుకు ఛాతీని కొడవలితో కోసిన ఘటన మంచిర్యాల జిల్లా నెన్నెల మండల కేంద్రంలో గురువారం రాత్రి జరిగింది. -
ప్రతికూల వాతావరణంతో యువ సైనికుడి మృతి
సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలనే ఆ యువకుని తపన ఆదిలోనే ఆవిరైపోయింది. అనారోగ్యం బారినపడటంతో యువసైనికుడు గురువారం రాత్రి మృత్యువాత పడ్డారు. -
గురుకుల విద్యార్థి మృతి
జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ బాలుర గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థి అస్వస్థతకు గురై మృతి చెందాడు. అనంతరం మరో ఇద్దరు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. -
గంజాయి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడి.. సహకరించిన భార్య
న్యాయ విద్య చదువుకొని ఉన్నతంగా జీవించాల్సిన యువ దంపతులు గాడితప్పారు. గంజాయికి బానిసలై.. అడ్డదారులు తొక్కారు. సహచర విద్యార్థి అయిన యువతిని ఆ మత్తు ఊబిలోకి దించారు. -
విద్యార్థి ఉసురు తీసిన నాడు-నేడు పనులు
గత వైకాపా ప్రభుత్వ హయాంలో నాసిరకంగా చేపట్టిన నాడు-నేడు అదనపు తరగతి గదుల నిర్మాణ పనులు ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. లింటెల్, దానిపైన ఉన్న గోడ కూలి మీద పడటంతో ఓ విద్యార్థి మృతి చెందిన ఘటన నెల్లూరులో చోటుచేసుకుంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే
-
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి