Crime News: శంషాబాద్‌ విమానాశ్రయంలో కిలోకుపైగా విదేశీ బంగారం పట్టివేత

శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ నిఘా విభాగం అధికారులు విదేశీ బంగారాన్ని పట్టుకున్నారు.

Updated : 28 Mar 2023 10:16 IST

హైదరాబాద్‌: శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ నిఘా విభాగం అధికారులు విదేశీ బంగారాన్ని పట్టుకున్నారు. దుబాయ్ నుంచి బంగారాన్ని తరలిస్తున్న ఇద్దరు ప్రయాణికులను అరెస్టు చేశారు. ముందస్తు సమాచారంతో దుబాయ్‌ నుంచి వచ్చిన ప్రయాణికుల వద్ద ఈ తనిఖీలు చేపట్టారు. తెల్లవారుజామున 2.55 గంటలకు వచ్చిన ఓ ప్రయాణికుడి నుంచి రూ 52.24 లక్షల విలువ చేసే 840 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకోగా.. తెల్లవారుజామున 3.45గంటలకు వచ్చిన మరో ప్రయాణికుడి నుంచి రూ.14.23 లక్షల విలువైన 233 గ్రాముల బంగారాన్ని పట్టుకున్నారు. మొదటి ప్రయాణికుడు ముద్ద రూపంలో బంగారాన్ని తీసుకురాగా.. రెండో ప్రయాణికుడు తున చేప ఆయిల్ డబ్బాల మధ్య దాచుకుని తెచ్చినట్టు కస్టమ్స్ అధికారులు గుర్తించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని