బండరాయితో తండ్రిని హతమార్చి.. రోడ్డు ప్రమాదంగా చిత్రించి..
కొడంగల్ మండలంలో మంగళవారం తండ్రిని కుమారుడు హతమార్చిన కేసులో పోలీసులు విస్తుపోయే నిజాల్ని రాబట్టారు.
బీమా డబ్బు కోసమే హత్య..
కొడంగల్, న్యూస్టుడే: కొడంగల్ మండలంలో మంగళవారం తండ్రిని కుమారుడు హతమార్చిన కేసులో పోలీసులు విస్తుపోయే నిజాల్ని రాబట్టారు. సీఐ శంకర్ తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ జిల్లా బొంరాస్పేట మండలం బిక్యానాయక్ తండాకు చెందిన శ్రీనివాస్ ఓ బీమా సంస్థలో ఏజెంట్గా పనిచేస్తున్నాడు. అతడు తండ్రి పేరిట రూ.50 లక్షల బీమా చేయించాడు. ఆ డబ్బుల కోసమే అతడు తండ్రిని హత్య చేసినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. శ్రీనివాస్ మంగళవారం తెల్లవారుజామున తాండూరు వెళ్లేందుకు తండ్రి ధన్సింగ్ (68)ని ద్విచక్ర వాహనంపై తీసుకెళ్లాడు. ఉడిమేశ్వరం గ్రామ సమీపంలోని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి బండరాయితో తండ్రి తలపై మోది హత్య చేశాడు. శవాన్ని ద్విచక్ర వాహనం వరకు లాక్కొని వెళ్లాడు. వాహనాన్ని కూడా స్వల్పంగా ధ్వంసం చేశాడు. కుటుంబసభ్యులకు ఫోన్ చేసి.. బండి మీది నుంచి పడి తండ్రి మృతి చెందాడంటూ కన్నీరుమున్నీరయ్యాడు. మృతదేహాన్ని కొడంగల్కు తరలిస్తున్నారని చెప్పాడు. కుటుంబసభ్యులు కొడంగల్ ప్రభుత్వాసుపత్రికి వచ్చారు. బండి అదుపు తప్పి పడిపోతే.. శ్రీనివాస్కు ఒక్క గాయం కూడా ఎందుకు కాలేదని అతడి అన్న రవినాయక్ అనుమానించారు. అదే విషయాన్ని సీఐకి చెప్పారు. నిందితుడిని సీఐ విచారణలో అసలు విషయం బయటపడింది. శ్రీనివాస్ను బుధవారం రిమాండ్కు తరలించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రియురాలితో ఫోన్లో మాట్లాడుతూ ఆత్మహత్య
ప్రేమించిన యువతితో గొడవపడిన ఓ యువకుడు ఆమెతోనే ఫోన్ మాట్లాడుతూ బలవన్మరణానికి పాల్పడ్డాడు. -
పోలింగ్ బూత్ నుంచి ఇన్స్టా లైవ్.. బోగస్ ఓటింగ్కు పాల్పడ్డాడంటూ అరెస్టు చేసిన పోలీసులు
గుజరాత్లోని దాహోద్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఓ పోలింగ్ కేంద్రం లోపల నుంచి వీడియోను ప్రత్యక్ష ప్రసారం చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు స్థానిక భాజపా నాయకుడి కుమారుడైన విజయ్ భాభోర్.. పోలింగ్ కేంద్ర లోపల నుంచి ఇన్స్టా లైవ్ చేసి ప్రజాస్వామ్యాన్ని అవమానించారంటూ కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. -
కేరళలో ఏనుగు దాడి.. కెమెరామన్ దుర్మరణం
కేరళలో గుంపు నుంచి తప్పిపోయిన అడవి ఏనుగు దాడిలో ఎ.వి.ముకేశ్ (34) అనే యువకుడు తీవ్రంగా గాయపడి మృతిచెందాడు. ప్రముఖ న్యూస్ ఛానల్ ‘మాతృభూమి’ కెమెరామన్గా, కాలమిస్ట్గా పనిచేస్తున్న ముకేశ్ రిపోర్టరుతో కలిసి మలమ్పుఝా - కంజికోడ్ మార్గంలో నదిని దాటే ఏనుగుల గుంపు దృశ్యాల చిత్రీకరణకు వెళ్లాడు. -
అత్యాచారం కేసు నిందితుడు 40 ఏళ్ల తర్వాత దొరికాడు
అత్యాచారం కేసులో పరారీలో ఉన్న నిందితుడిని 40 ఏళ్ల తర్వాత అరెస్టు చేసిన ముంబయి పోలీసులు మంగళవారం కోర్టులో హాజరుపరిచారు. ముంబయికి చెందిన పాపా అలియాస్ దావూద్ 1984లో ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. -
ఈవీఎంలలో చిప్ మారుస్తా.. మిమ్మల్ని గెలిపిస్తా
డబ్బులిస్తే ఈవీఎంలలో చిప్ను మార్చి ఎక్కువ ఓట్లు పడేలా చేస్తానని మోసగించేందుకు యత్నించిన ఓ జవానును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
రూ.7 వేలకోట్ల రుణ సమీకరణకు ప్రయత్నాలు.. పోలింగ్ ముందురోజు పంపకాలకు సన్నాహాలు
-
జగన్ ఇష్టారాజ్యం చట్టం.. ఆస్తి కాపాడుకోవడం కష్టం
-
ప్రియురాలితో ఫోన్లో మాట్లాడుతూ ఆత్మహత్య
-
వైకాపా మార్క్ ’పీనల్ కోడ్’: పులకేశీ.. విపక్షాలపై ఎంత కసి?
-
మంత్రి జోగి ఇలాకాలో భారీగా ఎన్నికల తాయిలాల సీజ్
-
ఊయల కట్టిన స్టూల్ మీదపడి చిన్నారి మృతి