పట్టాలపై ఆగిన దొంగల బొలెరో.. వేగంగా వచ్చి ఢీకొన్న దురంతో
దురంతో ఎక్స్ప్రెస్ పట్టాలపై అత్యంత వేగంగా దూసుకుపోతోంది.. అదే సమయంలో కొంతమంది ఆగంతుకులు బొలెరో వాహనంతో దూసుకువచ్చారు.
ఇంజిన్ దెబ్బతిని 7 గంటల పాటు నిలిచిన రైలు
తప్పించుకొని పారిపోయిన దుండగులు
భీమడోలు, న్యూస్టుడే: దురంతో ఎక్స్ప్రెస్ పట్టాలపై అత్యంత వేగంగా దూసుకుపోతోంది.. అదే సమయంలో కొంతమంది ఆగంతుకులు బొలెరో వాహనంతో దూసుకువచ్చారు. హఠాత్తుగా అది పట్టాలపై నిలిచిపోయింది.. క్షణాల్లో దారుణం.. రైలు మెరుపు వేగంతో వచ్చి ఆ వాహనాన్ని ఢీకొంది. బొలేరో నుజ్జునుజ్జయింది. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళుతుండగా ఏలూరు జిల్లా భీమడోలు రైల్వే గేటు వద్ద గురువారం తెల్లవారుజామున 2.30గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది. పశువుల దొంగలుగా అనుమానిస్తున్న కొందరు బొలెరోలో వెళుతూ 16వ నంబరు జాతీయ రహదారిపై పోలీసులను చూసి తప్పించుకునేందుకు యత్నించారు. ఈ క్రమంలో వేసి ఉన్న రైల్వే గేటును వాహనంతో వేగంగా ఢీకొట్టారు. గేటు ఒక వైపు ముక్కలైంది. మరో వైపు గేటునూ దాటించే క్రమంలో బొలెరో పట్టాలపై ఆగిపోయింది. అదే సమయంలో దురంతో రైలు దూసుకొస్తుండటంతో దుండగులు వాహనాన్ని పట్టాలపైనే వదిలేసి పారిపోయారు. వేగంగా వచ్చిన రైలు ఢీకొట్టడంతో బొలెరో పూర్తిగా ధ్వంసమైంది. రైలు ఇంజినూ పాక్షికంగా దెబ్బతింది. 7 గంటలపాటు రైలు నిలిచిపోయింది. ఘటనా స్థలికి చేరుకున్న రైల్వే అధికారులు మరో ఇంజిన్ సాయంతో రైలును విశాఖపట్నానికి పంపించారు. ప్రాణనష్టం లేకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు. ఆ మార్గంలో వెళ్లాల్సిన రైళ్లు 20 నిమిషాలు నిలిచిపోయాయి. రైల్వే పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొల్లగొడుతున్న సైబర్ ముఠాలు
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి వ్యాపారి(40) వాట్సప్కు స్టాక్మార్కెట్ మెలకువలు నేర్పిస్తామంటూ మెసేజ్ వచ్చింది. ఆయన ఆసక్తి చూపడంతో ‘ఓక్ట్రీ క్యాపిటల్ గ్రూప్’ పేరిట ఉన్న వాట్సప్ గ్రూప్లో చేర్చారు. నిర్వాహకుల మాటలు నమ్మి వారు సూచించిన బ్యాంకు ఖాతాలోకి వ్యాపారి నగదు బదిలీ చేస్తూ వచ్చారు. -
శిర్డీ ఎక్స్ప్రెస్లో భారీ చోరీ
శిర్డీ ఎక్స్ప్రెస్లో గురువారం అర్ధరాత్రి దాటాక దొంగలు విరుచుకుపడ్డారు. ప్రయాణికుల విలువైన వస్తువులు దోచుకొని పారిపోయారు. శుక్రవారం తెల్లవారుజామున గుర్తించిన బాధితులు సికింద్రాబాద్ రైల్వేపోలీసులకు ఫిర్యాదు చేశారు. -
కొడవలితో కొడుకు ఛాతీని గాయపరిచిన తల్లిదండ్రులు
గుడుంబా మత్తులో మానవత్వం మరిచిన ఓ జంట కన్నకొడుకు ఛాతీని కొడవలితో కోసిన ఘటన మంచిర్యాల జిల్లా నెన్నెల మండల కేంద్రంలో గురువారం రాత్రి జరిగింది. -
ప్రతికూల వాతావరణంతో యువ సైనికుడి మృతి
సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలనే ఆ యువకుని తపన ఆదిలోనే ఆవిరైపోయింది. అనారోగ్యం బారినపడటంతో యువసైనికుడు గురువారం రాత్రి మృత్యువాత పడ్డారు. -
గురుకుల విద్యార్థి మృతి
జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ బాలుర గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థి అస్వస్థతకు గురై మృతి చెందాడు. అనంతరం మరో ఇద్దరు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. -
గంజాయి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడి.. సహకరించిన భార్య
న్యాయ విద్య చదువుకొని ఉన్నతంగా జీవించాల్సిన యువ దంపతులు గాడితప్పారు. గంజాయికి బానిసలై.. అడ్డదారులు తొక్కారు. సహచర విద్యార్థి అయిన యువతిని ఆ మత్తు ఊబిలోకి దించారు. -
విద్యార్థి ఉసురు తీసిన నాడు-నేడు పనులు
గత వైకాపా ప్రభుత్వ హయాంలో నాసిరకంగా చేపట్టిన నాడు-నేడు అదనపు తరగతి గదుల నిర్మాణ పనులు ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. లింటెల్, దానిపైన ఉన్న గోడ కూలి మీద పడటంతో ఓ విద్యార్థి మృతి చెందిన ఘటన నెల్లూరులో చోటుచేసుకుంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు