మెట్లబావి దుర్ఘటనలో 36కు పెరిగిన మృతులు
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇందౌర్ ఆలయంలో శ్రీరామనవమి వేడుకల సందర్భంగా జరిగిన మెట్లబావి దుర్ఘటనలో మృతుల సంఖ్య అనూహ్యంగా పెరిగి 36కు చేరింది.
ఇందౌర్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇందౌర్ ఆలయంలో శ్రీరామనవమి వేడుకల సందర్భంగా జరిగిన మెట్లబావి దుర్ఘటనలో మృతుల సంఖ్య అనూహ్యంగా పెరిగి 36కు చేరింది. స్థానిక పటేల్నగర్ ప్రాంతంలోని మహదేవ్ ఝూలేలాల్ గుడిలో యాభై అడుగుల లోతు ఉన్న బావిపై వేసిన శ్లాబు కూలి.. అందులో పడిపోయిన భక్తుల్లో 36 మంది మరణించినట్లు అధికారులు శుక్రవారం వెల్లడించారు. గాలింపు చర్యలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. నాలుగు దశాబ్దాల క్రితం మెట్లబావిని కప్పి బేలేశ్వర్ మహాదేవ్ ఆలయాన్ని విస్తరించారు. ఈ ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు.. క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున పరిహారం ప్రకటించింది. దుర్ఘటన అనంతరం 14 మందిని కాపాడి ఆసుపత్రికి తరలించామని, వారిలో ఇద్దరు డిశ్చార్జి అయినట్లు ఇందౌర్ జిల్లా కలెక్టర్ ఇళయరాజా తెలిపారు. ఆర్మీ సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ దళాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. శుక్రవారం మంత్రులతో కలిసి ఆలయాన్ని పరిశీలించిన ముఖ్యమంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ దుర్ఘటనపై న్యాయ విచారణకు ఆదేశించారు. ఈ సందర్భంగా సీఎంకు వ్యతిరేకంగా స్థానికులు కొందరు నినాదాలు చేశారు. ఈ ప్రమాదంలో తమ ఆత్మీయులను పోగొట్టుకొన్న బాధితుల్లో 8 కుటుంబాలు ఆ విషాదాన్ని అధిగమించి అవయవ దానానికి అంగీకరించినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ప్రమాదానికి బాధ్యులుగా మహదేవ్ ఝూలేలాల్ ఆలయ కమిటీ అధ్యక్షుడు, కార్యదర్శిపై ఐపీసీ సెక్షన్ 304 కింద కేసు నమోదు చేసినట్లు ఇందౌర్ సీపీ వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొల్లగొడుతున్న సైబర్ ముఠాలు
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి వ్యాపారి(40) వాట్సప్కు స్టాక్మార్కెట్ మెలకువలు నేర్పిస్తామంటూ మెసేజ్ వచ్చింది. ఆయన ఆసక్తి చూపడంతో ‘ఓక్ట్రీ క్యాపిటల్ గ్రూప్’ పేరిట ఉన్న వాట్సప్ గ్రూప్లో చేర్చారు. నిర్వాహకుల మాటలు నమ్మి వారు సూచించిన బ్యాంకు ఖాతాలోకి వ్యాపారి నగదు బదిలీ చేస్తూ వచ్చారు. -
శిర్డీ ఎక్స్ప్రెస్లో భారీ చోరీ
శిర్డీ ఎక్స్ప్రెస్లో గురువారం అర్ధరాత్రి దాటాక దొంగలు విరుచుకుపడ్డారు. ప్రయాణికుల విలువైన వస్తువులు దోచుకొని పారిపోయారు. శుక్రవారం తెల్లవారుజామున గుర్తించిన బాధితులు సికింద్రాబాద్ రైల్వేపోలీసులకు ఫిర్యాదు చేశారు. -
కొడవలితో కొడుకు ఛాతీని గాయపరిచిన తల్లిదండ్రులు
గుడుంబా మత్తులో మానవత్వం మరిచిన ఓ జంట కన్నకొడుకు ఛాతీని కొడవలితో కోసిన ఘటన మంచిర్యాల జిల్లా నెన్నెల మండల కేంద్రంలో గురువారం రాత్రి జరిగింది. -
ప్రతికూల వాతావరణంతో యువ సైనికుడి మృతి
సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలనే ఆ యువకుని తపన ఆదిలోనే ఆవిరైపోయింది. అనారోగ్యం బారినపడటంతో యువసైనికుడు గురువారం రాత్రి మృత్యువాత పడ్డారు. -
గురుకుల విద్యార్థి మృతి
జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ బాలుర గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థి అస్వస్థతకు గురై మృతి చెందాడు. అనంతరం మరో ఇద్దరు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. -
గంజాయి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడి.. సహకరించిన భార్య
న్యాయ విద్య చదువుకొని ఉన్నతంగా జీవించాల్సిన యువ దంపతులు గాడితప్పారు. గంజాయికి బానిసలై.. అడ్డదారులు తొక్కారు. సహచర విద్యార్థి అయిన యువతిని ఆ మత్తు ఊబిలోకి దించారు. -
విద్యార్థి ఉసురు తీసిన నాడు-నేడు పనులు
గత వైకాపా ప్రభుత్వ హయాంలో నాసిరకంగా చేపట్టిన నాడు-నేడు అదనపు తరగతి గదుల నిర్మాణ పనులు ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. లింటెల్, దానిపైన ఉన్న గోడ కూలి మీద పడటంతో ఓ విద్యార్థి మృతి చెందిన ఘటన నెల్లూరులో చోటుచేసుకుంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే
-
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి