Gun fire: కబాబ్‌ రుచి నచ్చలేదని వంట మనిషి కాల్చివేత

కబాబ్‌ రుచి నచ్చలేదని గొడవ పెట్టుకున్న ఇద్దరు వ్యక్తులు డబ్బులు చెల్లించమని అడిగినందుకు వంట మనిషిని కాల్చి చంపారు.

Updated : 05 May 2023 07:52 IST

బరేలీ: కబాబ్‌ రుచి నచ్చలేదని గొడవ పెట్టుకున్న ఇద్దరు వ్యక్తులు డబ్బులు చెల్లించమని అడిగినందుకు వంట మనిషిని కాల్చి చంపారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని బరేలీలో బుధవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. బరేలీలోని ప్రేమ్‌నగర్‌లో ఉన్న ఓ కబాబ్‌ దుకాణానికి ఇద్దరు వ్యక్తులు కారులో వచ్చారు. ఆ సమయంలో వారు మద్యం మత్తులో ఉన్నారు. కబాబ్‌ల రుచి నచ్చలేదని దుకాణ యజమాని అంకుర్‌ సబర్వాల్‌తో గొడవపెట్టుకున్నారు. ఈక్రమంలో బిల్లు చెల్లించకుండానే వారు కారు వద్దకు వెళ్లారు. వారి దగ్గర రూ.120 వసూలు చేసుకురమ్మని నసీర్‌ అహ్మద్‌ అనే వంట మనిషిని అంకుర్‌ పంపించాడు. నసీర్‌ వారి వద్దకు వెళ్లగా వారిలో ఒకరు కోపంతో అతడి కణతపై తుపాకీతో కాల్చాడు. దాంతో నసీర్‌ ప్రాణాలు కోల్పోయాడు. నిందితులిద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని