Hyderabad: హైదరాబాద్‌లో మరోసారి ఉగ్రమూకల కలకలం

నగరంలో మరోసారి ఉగ్రమూకల కలకలం రేగింది. హైదరాబాద్‌లో తలదాచుకున్న రాడికల్‌ ఇస్లామిక్‌ కార్యకర్తలను భోపాల్‌ పోలీసులు అరెస్టు చేశారు.

Updated : 09 May 2023 14:21 IST

హైదరాబాద్‌: నగరంలో మరోసారి ఉగ్రమూకల కలకలం రేగింది. హైదరాబాద్‌లో తలదాచుకున్న రాడికల్‌ ఇస్లామిక్‌ కార్యకర్తలను భోపాల్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఓ కేసులో భాగంగా రాష్ట్ర ఇంటెలిజెన్స్‌ అధికారులతో కలిసి హైదరాబాద్‌లో నిఘా పెట్టిన పోలీసులు.. సోమవారం 16 మందిని అరెస్టు చేశారు. 

అరెస్టైన వారిలో 11 మంది భోపాల్‌, ఐదుగురు హైదరాబాద్‌ వాసులను పోలీసులు గుర్తించారు. నిందితుల నుంచి జిహాదీ సాహిత్యం, కత్తులు, ఎయిర్‌గన్స్‌ స్వాధీనం చేసుకున్నారు. కేంద్ర నిఘా వర్గాల సమాచారంతో దాడులు నిర్వహించిన పోలీసులు.. నగరంలో 18 నెలలుగా రాడికల్‌ ఇస్లామిక్‌ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని