Uttar pradesh: మోదీ, యోగిపై చర్చకు నిండుప్రాణం బలి

ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌పై చర్చ ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది.

Updated : 13 Jun 2023 07:00 IST

ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌పై చర్చ ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. కోలాహి గ్రామానికి చెందిన రాజేశ్‌ధార్‌ దూబే (50).. తన సోదరుడి కుమారుడి వివాహానికి మిర్జాపుర్‌ వెళ్లాడు. అనంతరం కారులో తిరిగి వస్తుండగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి అదిత్యనాథ్‌పై డ్రైవర్‌తో చర్చ మొదలైంది. కొద్దిసేపటికి ఇద్దరి మధ్య మాటామాటా పెరగడంతో డ్రైవర్‌.. రాజేశ్‌ధార్‌ను కారు నుంచి బయటకు దించాడు. కారును వెళ్లనీయనంటూ రాజేశ్‌ అడ్డంగా నిలబడ్డాడు. ఈ క్రమంలోనే తీవ్ర ఆగ్రహానికి గురైన డ్రైవర్‌ రాజేశ్‌ధార్‌పై నుంచి కారును పోనిచ్చాడు. ఈ ప్రమాదంలో దూబే అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ఆగ్రహానికి గురైన మృతుడి బంధువులు మిర్జాపుర్‌-ప్రయాగ్‌రాజ్‌ రహదారిని దిగ్బంధించారు. పోలీసు ఉన్నతాధికారులు వచ్చి హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని