అపహరించి.. హత్య చేసి.. దహనం: వీడిన అదృశ్యం కేసు మిస్టరీ
తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా కొత్తకోట మండలం రామకృష్ణాపురానికి చెందిన కావలి భారతయ్య (55) అదృశ్యం కేసు మిస్టరీ ఏపీలోని కర్నూలు జిల్లాలో వీడింది.
పోలీసుల అదుపులో నిందితులు
కర్నూలు, కల్లూరు గ్రామీణ, న్యూస్టుడే: తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా కొత్తకోట మండలం రామకృష్ణాపురానికి చెందిన కావలి భారతయ్య (55) అదృశ్యం కేసు మిస్టరీ ఏపీలోని కర్నూలు జిల్లాలో వీడింది. హంతకులు ఆయన్ను అపహరించి.. అనంతరం చంపి కల్లూరు మండలం ఉలిందకొండ పోలీసుస్టేషన్ పరిధిలో దహనం చేసిన ఉదంతం ఆదివారం వెలుగుచూసింది. గతంలో కల్లు దుకాణం నిర్వహించిన రామకృష్ణాపురానికి చెందిన రవీంద్రగౌడ్ భార్య మూడేళ్ల కిందట ఆత్మహత్య చేసుకుంది. రవీంద్రగౌడ్ వేధించడంతోనే ఆమె ఆత్మహత్య చేసుకుందని గ్రామస్థులంతా అతన్ని కొట్టారు. భారతయ్య చెప్పుతో కొట్టడంతో రవీంద్రగౌడ్ అతనిపై కక్ష పెంచుకున్నాడు. జైలు నుంచి వచ్చిన అతను భారతయ్యను చంపేందుకు కుట్ర పన్నాడు. జైలులో పరిచయమైన మహ్మద్ షఫీతో చేయి కలిపాడు. ఈ ఏడాది జూన్ 26న ఆటో కోసం అప్పరాల గ్రామం వద్ద ఎదురుచూస్తున్న భారతయ్యను ఊరికి వెళ్దాం పదా అంటూ రవీంద్రగౌడ్ తన కారులో ఎక్కించుకుని కిడ్నాప్ చేశాడు. రుమాలుతో గొంతు బిగించి ఐరన్ రాడ్డుతో కొట్టి చంపాడు. మృతదేహాన్ని అదే రోజు రాత్రి కల్లూరు మండలం కొల్లంపల్లి తండా సమీపంలో పడేసి పెట్రోలు పోసి నిప్పంటించి వెళ్లిపోయాడు. భారతయ్య ఇంటికి రాకపోవడంతో అతని భార్య శివమ్మ ఫిర్యాదు చేయడంతో పోలీసులు అదృశ్యం కేసు నమోదు చేశారు. కుటుంబ సభ్యుల అనుమానం మేరకు రవీంద్రగౌడ్ను విచారించడంతో విషయం బయటపడింది. కొత్తకోట సీఐ శ్రీనివాసరెడ్డి, ఎస్సై మంజునాథ్రెడ్డి, ఉలిందకొండ ఎస్సై నల్లప్ప ఆదివారం ఘటనా స్థలానికి చేరుకుని పూర్తిగా కాలిపోయిన మృతదేహాన్ని పరిశీలించారు. శవపరీక్ష అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొల్లగొడుతున్న సైబర్ ముఠాలు
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి వ్యాపారి(40) వాట్సప్కు స్టాక్మార్కెట్ మెలకువలు నేర్పిస్తామంటూ మెసేజ్ వచ్చింది. ఆయన ఆసక్తి చూపడంతో ‘ఓక్ట్రీ క్యాపిటల్ గ్రూప్’ పేరిట ఉన్న వాట్సప్ గ్రూప్లో చేర్చారు. నిర్వాహకుల మాటలు నమ్మి వారు సూచించిన బ్యాంకు ఖాతాలోకి వ్యాపారి నగదు బదిలీ చేస్తూ వచ్చారు. -
శిర్డీ ఎక్స్ప్రెస్లో భారీ చోరీ
శిర్డీ ఎక్స్ప్రెస్లో గురువారం అర్ధరాత్రి దాటాక దొంగలు విరుచుకుపడ్డారు. ప్రయాణికుల విలువైన వస్తువులు దోచుకొని పారిపోయారు. శుక్రవారం తెల్లవారుజామున గుర్తించిన బాధితులు సికింద్రాబాద్ రైల్వేపోలీసులకు ఫిర్యాదు చేశారు. -
కొడవలితో కొడుకు ఛాతీని గాయపరిచిన తల్లిదండ్రులు
గుడుంబా మత్తులో మానవత్వం మరిచిన ఓ జంట కన్నకొడుకు ఛాతీని కొడవలితో కోసిన ఘటన మంచిర్యాల జిల్లా నెన్నెల మండల కేంద్రంలో గురువారం రాత్రి జరిగింది. -
ప్రతికూల వాతావరణంతో యువ సైనికుడి మృతి
సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలనే ఆ యువకుని తపన ఆదిలోనే ఆవిరైపోయింది. అనారోగ్యం బారినపడటంతో యువసైనికుడు గురువారం రాత్రి మృత్యువాత పడ్డారు. -
గురుకుల విద్యార్థి మృతి
జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ బాలుర గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థి అస్వస్థతకు గురై మృతి చెందాడు. అనంతరం మరో ఇద్దరు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. -
గంజాయి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడి.. సహకరించిన భార్య
న్యాయ విద్య చదువుకొని ఉన్నతంగా జీవించాల్సిన యువ దంపతులు గాడితప్పారు. గంజాయికి బానిసలై.. అడ్డదారులు తొక్కారు. సహచర విద్యార్థి అయిన యువతిని ఆ మత్తు ఊబిలోకి దించారు. -
విద్యార్థి ఉసురు తీసిన నాడు-నేడు పనులు
గత వైకాపా ప్రభుత్వ హయాంలో నాసిరకంగా చేపట్టిన నాడు-నేడు అదనపు తరగతి గదుల నిర్మాణ పనులు ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. లింటెల్, దానిపైన ఉన్న గోడ కూలి మీద పడటంతో ఓ విద్యార్థి మృతి చెందిన ఘటన నెల్లూరులో చోటుచేసుకుంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్