Hyderabad: క్రీడాకారిణికి మంత్రి పేషీ ఉద్యోగి వేధింపులు!
ఓ జాతీయ స్థాయి క్రీడాకారిణిని రాష్ట్ర క్రీడా మంత్రి పేషీలోని ఓ పొరుగు సేవల ఉద్యోగి వేధింపులకు గురిచేసిన విషయం వెలుగులోకి వచ్చింది.
ఈనాడు, హైదరాబాద్: ఓ జాతీయ స్థాయి క్రీడాకారిణిని రాష్ట్ర క్రీడా మంత్రి పేషీలోని ఓ పొరుగు సేవల ఉద్యోగి వేధింపులకు గురిచేసిన విషయం వెలుగులోకి వచ్చింది. జాతీయ స్థాయి క్రీడాకారిణి అయినప్పటికీ ప్రోత్సాహం లభించడం లేదని తన సమీప బంధువు సాయంతో ఆమె క్రీడా మంత్రిని కలిసి సాయం చేయాలని విన్నవించింది. దీంతో వివరాలను తన కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగికి ఇచ్చి వెళ్లాలని మంత్రి సూచించారు. ఈ నేపథ్యంలోనే ఆమె ఫోన్ నంబరు తీసుకున్న ఆ ఉద్యోగి... అసభ్యకరమైన సందేశాలను పంపించాడు. వ్యక్తిగత ఫొటోలను పంపించాలని అడిగాడు. ఈ విషయంపై అతడిని క్రీడాకారిణి బంధువు నిలదీయడంతో మొదట అలాంటిదేమీ లేదని బుకాయించాడు. చివరకు తప్పు చేశానని, క్షమించాలని కోరాడు. ఈ విషయం మంత్రి దృష్టికి వెళ్లడంతో అతడిని కార్యాలయానికి రావొద్దని ఆదేశించినట్లు తెలిసింది. రెండు వారాల నుంచి ఆ ఉద్యోగి విధులకు రావడం లేదని, అతనిపై చర్యలు తీసుకుంటామని మంత్రి కార్యాలయ వర్గాలు తెలిపాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మొబైల్ కోసం వ్యక్తి దారుణ హత్య
గుడిమల్కాపూర్లో నడిరోడ్డుపై వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. పీవీ ఎక్స్ప్రెస్ వే పిల్లర్ నంబర్ 65 వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. -
తల్లిని, భార్యాబిడ్డలను హతమార్చి.. ఉరేసుకుని మరణించిన వైద్యుడు
ఆర్థిక సమస్యలు ఓ కుటుంబాన్ని బలి తీసుకున్నాయి. అప్పుల కారణంగా మానసికంగా కుంగిపోయిన ఓ వైద్యుడు భార్య, ఇద్దరు పిల్లలను, కన్నతల్లిని కడతేర్చి తానూ ఉరివేసుకుని తనువు చాలించారు. -
ఎదురుకాల్పుల్లో 10 మంది మావోయిస్టుల మృతి
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని అబూఝ్మడ్ అటవీ ప్రాంతం మరోసారి తుపాకుల మోతతో దద్దరిల్లింది. నారాయణ్పుర్, కాంకేర్ జిల్లాల సరిహద్దు ప్రాంతంలో భద్రతాబలగాలు, మావోయిస్టుల మధ్య మంగళవారం జరిగిన ఎదురుకాల్పుల్లో 10 మంది మావోయిస్టులు మృతి చెందారు. -
టమాటా పెట్టెల చాటున తెలంగాణ మద్యం రవాణా
తెలంగాణ నుంచి భారీ మొత్తంలో మద్యం అక్రమ రవాణా చేస్తున్న నిందితులను స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో(సెబ్) పోలీసులు అరెస్టు చేశారు. -
మహారాష్ట్రలో ఆర్టీసీ బస్సు, ట్రక్కు ఢీ
మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు ఓ ట్రక్కును ఢీకొంది. ఈ ప్రమాదంలో ఓ బాలుడు సహా నలుగురు దుర్మరణం పాలయ్యారు. -
సివిల్స్ మూడో ర్యాంకర్ అనన్యరెడ్డి పేరుతో నకిలీ ఖాతాలు
తన పేరిట సామాజిక మాధ్యమాల్లో నకిలీ ఖాతాలు సృష్టించి డబ్బు వసూలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని సివిల్స్ మూడో ర్యాంకర్ అనన్యరెడ్డి సైబరాబాద్ సైబర్క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
కెప్టెన్గా మార్ష్.. యంగ్ సెన్సేషన్కు నో ఛాన్స్.. ఆసీస్ జట్టు ఇదే!
-
‘రామాయణ’లో పాత్ర..రూమర్స్పై లారా దత్తా కామెంట్స్
-
లోక్సభ ఎన్నికల వేళ.. దిల్లీ హైకోర్టుకు ‘డీప్ఫేక్’ వ్యవహారం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
జీఎస్టీ చరిత్రలో రికార్డు వసూళ్లు.. ఒక్క నెలలో రూ.2.10 లక్షల కోట్లు!
-
చెన్నై ‘విన్నింగ్’ ట్రెండ్ను కొనసాగిస్తుందా.. ప్లేఆఫ్స్ బెర్తు ఖరారు చేసుకుంటుందా?