Kakinada: తరగతి గదిలో తేలు కాటు.. రక్తపు వాంతులతో విద్యార్థి మృతి!
తరగతి గదిలో తేలు కుట్టి విద్యార్థి మృతిచెందిన ఘటన డా.బీఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో గురువారం జరిగింది.
ఉపాధి నిమిత్తం తండ్రి వరంగల్లో.. తల్లి కువైట్లో
కాకినాడ, కపిలేశ్వరపురం - న్యూస్టుడే: తరగతి గదిలో తేలు కుట్టి విద్యార్థి మృతిచెందిన ఘటన డా.బీఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో గురువారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. కపిలేశ్వరపురం మండలం కోరుమిల్లికి చెందిన వై.ప్రసాద్, శ్రీదేవిల చిన్నకుమారుడైన అభిలాష్ (14).. వాకతిప్ప జడ్పీహెచ్ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. గురువారం తరగతి గదిలో చిక్కీల రేపర్లు ఎక్కువగా ఉండటంతో మరో విద్యార్థితో కలిసి వాటిని ఏరుతుండగా అభిలాష్ ఎడమ చేతిని తేలు కుట్టింది. ఉపాధ్యాయులు విద్యార్థిని వెంటనే స్థానిక పీహెచ్సీకి తరలించి ప్రథమ చికిత్స చేయించారు. మెరుగైన చికిత్స నిమిత్తం కాకినాడ జీజీహెచ్కు తరలించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఊపిరితిత్తుల్లోకి విషం చేరడంతో, రక్తపు వాంతులు అయ్యి బాలుడు మృతిచెందినట్లు వైద్యులు చెబుతున్నారు. కేసు నమోదు చేసినట్లు అంగర ఎస్సై తెలిపారు. మృతుడి తండ్రి వలస కూలీగా వరంగల్లో పనిచేస్తుండగా, తల్లి ఉపాధి నిమిత్తం కువైట్లో ఉంటున్నారు. తాతయ్య వద్ద ఉంటూ చదువుకుంటుండగా ఇలా జరగడంతో స్థానికంగా విషాదం నెలకొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రసాయనాల మాటున కరెన్సీ కట్టలు
విజయవాడ-విశాఖపట్నం జాతీయ రహదారిపై గుట్టుగా తరలిస్తున్న రూ.7 కోట్ల డబ్బు కట్టలు రోడ్డు ప్రమాదం కారణంగా బయటపడ్డాయి. -
ఆరు ప్రాణాలు బలిగొన్న మద్యం
ఉత్తర్ప్రదేశ్లోని సీతాపూర్కు చెందిన ఓ వ్యక్తి అయిదుగురు కుటుంబసభ్యులను హతమార్చి, తాను ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం.. అనురాగ్ సింగ్ (42) మద్యానికి బానిసై కుటుంబసభ్యులతో తరచూ గొడవ పడేవాడు. -
కుక్కల దాడిలో వృద్ధురాలి మృతి
వృద్ధురాలిపై కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపర్చడంతో ప్రాణాలు కోల్పోయిన ఘటన పార్వతీపురం మన్యం జిల్లాలోని జియ్యమ్మవలస మండలం వెంకటరాజపురంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన బంటు లక్ష్మి(70) శనివారం ఉదయం బహిర్భూమికి ఊరి చివరకు వెళ్లారు. -
అమెరికాలో జలపాతంలో మునిగి ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
ఉన్నత విద్యాభ్యాసానికి అమెరికా వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు పట్టా అందుకున్న కొద్ది రోజులకే మృత్యువాత పడిన విషాదకర ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇద్దరూ ఆరిజోనాలోని ప్రసిద్ధ ఫాజిల్ క్రీక్ జలపాతంలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. -
రూ.2 కోట్ల విలువైన మద్యం పట్టివేత
ఎన్నికల వేళ అర్ధరాత్రి అక్రమంగా తరలిస్తున్న సుమారు రూ.2 కోట్ల విలువ చేసే మద్యాన్ని పట్టుకున్నట్లు మహబూబ్నగర్ డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. శనివారం మహబూబ్నగర్ జిల్లా బాలానగర్ ఠాణాలో సీఐ నాగార్జునగౌడ్తో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. -
రేవణ్న లైంగిక వేధింపుల కేసు.. పోలీసుల అదుపులో దేవరాజ గౌడ
కర్ణాటక ఎంపీ ప్రజ్వల్ రేవణ్న లైంగిక వేధింపుల కేసుకు సంబంధించి వీడియోను లీక్ చేశారనే ఆరోపణలపై నమోదైన కేసులో నిందితుడు, ఓ మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలను ఎదుర్కొంటున్న భాజపా నేత దేవరాజ గౌడను చిత్రదుర్గం జిల్లా హిరియూరు గ్రామీణ పోలీసులు శుక్రవారం రాత్రి అరెస్టు చేశారు. -
ఇసుక లారీ ఢీ.. ఇద్దరు ప్రయాణికుల మృతి
బస్షెల్టర్లో బస్సు కోసం ఎదురుచూస్తున్న ప్రయాణికులపై శనివారం సాయంత్రం ఇసుక లారీ దూసుకెళ్లడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఐదుగురికి గాయాలయ్యాయి. -
ఎదురుకాల్పుల్లో మావోయిస్టు, ఐఈడీ పేలి బాలిక మృతి
ఛత్తీస్గఢ్ రాష్ట్రం దంతరి, బీజాపూర్ జిల్లాల్లో శనివారం జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో ఓ మావోయిస్టు, మరో బాలిక మృతి చెందారు. దంతరి జిల్లా బైసాముండా గ్రామ శివారు అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు కూంబింగ్ ఆపరేషన్ చేపట్టాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఐదేళ్లలో ఒకటో తేదీన జీతం అందుకున్న దాఖలాల్లేవు: సూర్యనారాయణ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
అయిదేళ్ల పాలన.. అంతులేని వేదన.. తలరాతలు మార్చుకునే తరుణమిదే
-
అరకులో కూటమికే మొగ్గు!.. ఈ పార్లమెంటు బరిలో వైకాపా ఎదురీత
-
ఖండాంతరాలు దాటి ఓట్ల పండగకు.. సొంత ఊర్లకు చేరుకుంటున్న ప్రవాసాంధ్రులు
-
నేడు 13 జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం