AE In ACB Trap: లంచం డబ్బు విసిరేసి.. ఏఈ పలాయనం
విద్యుత్తు కనెక్షన్ ఇచ్చేందుకు రైతు నుంచి లంచం డిమాండ్ చేసిన విద్యుత్తు శాఖ అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ).. ఆ మొత్తం తీసుకునే క్రమంలో అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కకుండా పలాయనం చిత్తగించారు.
ఏసీబీ సీఐని కారుతో ఢీకొట్టి.. పొలాల్లో పరుగులు
పార్వతీపురం మన్యం జిల్లాలో ఘటన
మక్కువ, సాలూరు, న్యూస్టుడే: విద్యుత్తు కనెక్షన్ ఇచ్చేందుకు రైతు నుంచి లంచం డిమాండ్ చేసిన విద్యుత్తు శాఖ అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ).. ఆ మొత్తం తీసుకునే క్రమంలో అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కకుండా పలాయనం చిత్తగించారు. అయినా ఏసీబీ అధికారులు వెంటపడటంతో సీఐని కారుతో ఢీకొట్టి మరీ పొలాల్లోంచి పరుగు లంకించారు. పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలంలో ఆదివారం రాత్రివేళ జరిగిన ఈ ఘటనపై ఏసీబీ పోలీసుల కథనం ప్రకారం.. ములక్కాయవలసకు చెందిన రైతు డి.ఈశ్వరరావు తన పొలానికి కనెక్షన్ మంజూరు చేయాలని విద్యుత్తు ఏఈ శాంతారావును కోరారు. దరఖాస్తు పేరుతో ఫోన్పే ద్వారా రూ.4 వేలు ఆయన సూచించిన మేరకు చెల్లించారు. కనెక్షన్ ఇవ్వడానికి రూ.60 వేలు లంచం ఇవ్వాలని డిమాండు చేసిన ఏఈ.. రూ.20 వేలు అడ్వాన్స్గా తీసుకున్నారు. మిగిలిన సొమ్ము కోసం డిమాండు చేయగా, రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు.
పొలాల్లోంచి కారుతో పలాయనం
విద్యుత్తు కనెక్షన్ ఇచ్చిన తర్వాత ఆదివారం సాయంత్రం మిగిలిన లంచం డబ్బులు పొలం దగ్గర ఇస్తానని రైతు చెప్పడంతో ఏఈ శాంతారావు అంగీకరించారు. రాత్రి పొలం దగ్గరకు వచ్చిన ఏఈ కారులో కూర్చుని ఈశ్వరరావును వాహనంలోకి రమ్మని పిలిచి మిగిలిన రూ.40 వేలు తీసుకున్నారు. అప్పటికే దూరం నుంచి గమనిస్తున్న ఏసీబీ డీఎస్పీ రామచంద్రరావు, సీఐ టి.శ్రీనివాసరావులు ద్విచక్ర వాహనంతో కారు వద్దకు చేరుకున్నారు. వారిని గమనించిన ఏఈ కారును పక్కనే పొలాల్లోకి వేగంగా నడిపారు. గట్ల పైనుంచి కారు ఎగురుతూ వెళ్లడం చూసిన రైతులు ఆశ్చర్యపోయారు. కారును అడ్డగించి ఏఈని పట్టుకునేందుకు బైకుపై సీఐ కొంతదూరం వెంబడించారు. ఏఈ కారుతో బైక్ను ఢీకొట్టడంతో సీఐ కిందపడి గాయాలపాలయ్యారు. కొంతదూరం వెళ్లాక శాంతారావు లంచం డబ్బులు విసిరేసి, కారు వదిలేసి కాలికి పని చెప్పారు.
పట్టుబడకపోతే తీవ్ర పరిణామాలు: డీఎస్పీ
లంచం తీసుకుని తప్పించుకుపోవడమే కాకుండా పట్టుకునేందుకు యత్నించిన సీఐ వాహనాన్ని ఢీకొట్టిన ఏఈపై తీవ్ర చర్యలు తప్పవని ఏసీబీ డీఎస్పీ రామచంద్రరావు హెచ్చరించారు. ఆయన విద్యుత్తు శాఖ ఎస్ఈకి ఫోన్ చేసి మాట్లాడారు. శాంతారావు స్వచ్ఛందంగా లొంగిపోకుంటే పరిస్థితి వేరేగా ఉంటుందని పేర్కొన్నారు. విషయం తెలుసుకున్న ఏడీఈ శంకరరావు మక్కువలోని కార్యాలయానికి చేరుకుని ఏసీబీ అధికారులకు వివరాలు అందించారు. శాంతారావు నేపథ్యాన్ని అధికారులు అర్ధరాత్రి వరకూ సేకరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల కేసు సూత్రధారి మృతి
దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల కేసు సూత్రధారి, ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాది సయ్యద్ మక్బూల్ (52)మృతి చెందాడు. -
షిర్డీ నుంచి కాకినాడ వెళ్తున్న రైలులో చోరీ
షిర్డీ నుంచి కాకినాడ వెళ్తున్న రైలులో చోరీ జరిగింది. మూడు బోగీల్లో దుండగులు దోపిడీకి పాల్పడ్డారు. -
ఆగస్టులో పెళ్లి.. అంతలోనే కాటేసిన విధి!
తల్లిదండ్రులు ఆగస్టులో తమ పెద్ద కొడుకు పెళ్లి చేద్దామనుకున్నారు. అంతలోపే విధి చెట్టు రూపంలో కాటేసి కానరాని లోకాలకు తీసుకెళ్లింది. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఓ చెట్టు కూలి మీద పడడంతో యువకుడు మృతి చెందిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. -
చిట్టీల పేరుతో మోసం.. ప్రభుత్వ ఉపాధ్యాయురాలు, భర్త అరెస్టు
అక్రమంగా చిట్టీలు నడుపుతూ.. గడువు ముగిసినా డబ్బులు చెల్లించకుండా మోసం చేసిన కేసులో పోలీసులు ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలిని, ఆమె భర్తను అరెస్టు చేశారు. గురువారం హసన్పర్తి ఠాణాలో ఎస్సై దేవేందర్తో కలిసి సీఐ జె.సురేశ్ మీడియాకు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి.. -
మల ద్వారంలోకి గాలి పంపింగ్.. యువకుడి పరిస్థితి విషమం
స్నేహితుల సరదా ఓ యువకుడి ప్రాణం మీదకు తెచ్చింది. మెకానిక్ షెడ్డు వద్ద మల ద్వారంలోకి గాలి పంపింగ్ చేయడంతో పరిస్థితి విషమంగా మారింది. హనుమకొండ జిల్లా ఐనవోలు మండల కేంద్రంలో నాలుగు రోజుల కిందట జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. -
ఎదురుకాల్పుల్లో మావోయిస్టు మృతి
ములుగు-భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల సరిహద్దుల్లోని అడవుల్లో గురువారం జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ మావోయిస్టు మృతి చెందాడు. -
బాలుడిని బలిగొన్న టైరు.. ఓఆర్ఆర్పై మూత్రవిసర్జన చేస్తుండగా ఘటన
అవుటర్ రింగు రోడ్డుపై ఓ బాలుడు మూత్ర విసర్జన చేస్తుండగా ఎక్కడి నుంచో దొర్లుకుంటూ వచ్చిన టైరు తగిలి తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతిచెందాడు. -
లంచం తీసుకుంటూ అనిశాకు చిక్కిన ప్రభుత్వాధికారులు
లంచం తీసుకుంటూ అనిశా వలకు చిక్కారు ఇద్దరు ప్రభుత్వాధికారులు. వివరాల్లోకి వెళ్తే..హనుమకొండ జిల్లా పరకాల మున్సిపాలిటీ పరిధిలోని సీతారాంపురం గ్రామానికి చెందిన లడె రాజేశ్వర్రావు పేరిట ఉన్న 1,173 చదరపు గజాల స్థలం ఉంది. -
గ్యాస్ లీకై.. ప్రయాణికులతో వెళ్తున్న ఆటో దగ్ధం
ప్రయాణికులతో వెళ్తున్న ఆటో దగ్ధం కావడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. విజయవాడలోని మహాత్మాగాంధీ రోడ్డులో ఈ ఘటన చోటుచేసుకుంది. -
మహిళను వివస్త్రను చేసి చిత్రహింసలు
సభ్యసమాజం తలదించుకునేలా ఓ గిరిజన మహిళను చెట్టుకు కట్టేసి, వివస్త్రను చేసి చితకబాదిన సంఘటన అన్నమయ్య జిల్లా వీరబల్లి మండలంలో చోటుచేసుకుంది. -
వినుకొండ హత్యకేసులో మరో ఆరుగురి అరెస్టు
పల్నాడు జిల్లా వినుకొండలో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రషీద్ హత్యకేసులో మరో ఆరుగురిని పోలీసులు గురువారం అరెస్టుచేశారు. వినుకొండ పట్టణ పోలీసుస్టేషన్లో సీఐ సాంబశివరావు విలేకరులతో మాట్లాడుతూ వివరాలు వెల్లడించారు. -
తుపాకీ గురిపెట్టి బాలికపై అత్యాచారం!
దేశ రాజధానిలో దారుణం చోటుచేసుకుంది. పొరుగింటి వ్యక్తి తుపాకీ గురిపెట్టి ఓ బాలికపై అత్యాచారం చేయడమే కాకుండా ఐదంతస్తుల భవనంపై నుంచి తోసేశాడు. -
కారు దిగి నడుస్తూ వెళ్లి.. ‘అటల్ సేతు’ పైనుంచి దూకేసిన టెకీ.. వీడియో
కారు దిగి అలా నడుచుకుంటూ వెళ్లిన ఓ టెకీ.. ముంబయిలోని అటల్ సేతు పైనుంచి కిందకు దూకేశాడు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
యశ్ ‘టాక్సిక్’లో బాలీవుడ్ భామ.. ఆ విషయం తాను చెప్పలేదంటూ పోస్ట్
-
ఎవరినీ కించపరచడం మా ఉద్దేశం కాదు.. ‘డబుల్ ఇస్మార్ట్’ పాటపై మణిశర్మ క్లారిటీ
-
కార్గిల్ పోరు వేళ యుద్ధ భూమిలో మోదీ.. పాతికేళ్ల నాటి ఫొటోలు వైరల్
-
రివ్యూ: పురుషోత్తముడు.. రాజ్తరుణ్ ఖాతాలో హిట్ పడిందా?
-
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
-
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు