Peddapalli: ఊపిరాడకుండా చేసి.. పాముతో కాటు వేయించి..
పెద్దపల్లి జిల్లా గోదావరిఖని మార్కండేయకాలనీకి చెందిన స్థిరాస్తి వ్యాపారి, బిల్డర్ కొచ్చెర ప్రవీణ్ (42) హత్య కేసు మిస్టరీ వీడింది. ప్రవీణ్ భార్య సహా ఆరుగురు నిందితులను గోదావరిఖని ఒకటో పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు.
స్థిరాస్తి వ్యాపారి హత్య కేసులో వీడిన మిస్టరీ
భార్య సహా ఆరుగురి అరెస్ట్
గోదావరిఖని, పెద్దపల్లి- న్యూస్టుడే: పెద్దపల్లి జిల్లా గోదావరిఖని మార్కండేయకాలనీకి చెందిన స్థిరాస్తి వ్యాపారి, బిల్డర్ కొచ్చెర ప్రవీణ్ (42) హత్య కేసు మిస్టరీ వీడింది. ప్రవీణ్ భార్య సహా ఆరుగురు నిందితులను గోదావరిఖని ఒకటో పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. పెద్దపల్లిలో డీసీపీ వైభవ్ గైక్వాడ్ శుక్రవారం ఈ వివరాలు వెల్లడించారు. ప్రవీణ్, లలిత దంపతులకు 14, 12, 10 ఏళ్ల వయసున్న ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. కొన్నాళ్లుగా ప్రవీణ్కు ఓ మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడిందనే విషయం తెలుసుకున్న భార్య లలిత.. నిత్యం గొడవపడేది. భర్తలో మార్పు కనిపించకపోవడంతో అంతమొందించాలని నిర్ణయించుకుంది.
ప్రవీణ్ వద్దే సెంట్రింగ్ పనులు నిర్వహించే రామగుండం హౌసింగ్బోర్డు కాలనీకి చెందిన మచ్చ సురేశ్ (37)తో ఈ విషయం చెప్పింది. ప్రవీణ్ను హత్య చేస్తే ఒక ప్లాట్ ఇస్తానని చెప్పడంతో అంగీకరించిన సురేశ్.. రామగుండానికి చెందిన ఇందారపు సతీష్(25), మందమర్రికి చెందిన మాస శ్రీనివాస్(33), భీమ గణేశ్(23)లతో కలిసి హత్యకు పథకం రచించాడు. పాముతో కాటు వేయించాలన్న పథకం మేరకు మందమర్రిలో ప్రైవేటు సెక్యూరిటీ గార్డు నన్నపురాజు చంద్రశేఖర్(38)తో మాట్లాడుకున్నారు. ఈ క్రమంలో వీరి ఖర్చుల కోసం లలిత 34 గ్రాముల బంగారు గొలుసును వారికి ఇచ్చింది. ఈ నెల 9న రాత్రి రామగుండంలో మద్యం తాగిన నిందితులు.. లలితతో ఫోన్లో మాట్లాడి ద్విచక్ర వాహనాలపై ఇంటికి చేరుకున్నారు.
పడుకున్న ప్రవీణ్ను చూపించి లలిత మరో గదిలోకి వెళ్లి వేచిచూసింది. నిందితులు ప్రవీణ్ ముఖంపై దిండుతో అదిమిపట్టారు. కొద్దిసేపు పెనుగులాడిన ప్రవీణ్లో కదలిక నిలిచిన తర్వాత వెంట తెచ్చిన పాముతో కాటు వేయించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం పామును బహిరంగ ప్రదేశంలో వదిలేశారు. గుండెపోటుతో చనిపోయాడని లలిత చెప్పిన మాటలను నమ్మని ప్రవీణ్ తల్లి.. తన కుమారుడి మృతిపై అనుమానం ఉందని ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు విచారణ చేపట్టారు. దర్యాప్తులో కుట్ర బయటపడడంతో.. లలిత సహా ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు డీసీపీ వెల్లడించారు. వారి నుంచి ఆరు సెల్ఫోన్లు, 34 గ్రాముల బంగారు గొలుసు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల కేసు సూత్రధారి మృతి
దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల కేసు సూత్రధారి, ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాది సయ్యద్ మక్బూల్ (52)మృతి చెందాడు. -
షిర్డీ నుంచి కాకినాడ వెళ్తున్న రైలులో చోరీ
షిర్డీ నుంచి కాకినాడ వెళ్తున్న రైలులో చోరీ జరిగింది. మూడు బోగీల్లో దుండగులు దోపిడీకి పాల్పడ్డారు. -
ఆగస్టులో పెళ్లి.. అంతలోనే కాటేసిన విధి!
తల్లిదండ్రులు ఆగస్టులో తమ పెద్ద కొడుకు పెళ్లి చేద్దామనుకున్నారు. అంతలోపే విధి చెట్టు రూపంలో కాటేసి కానరాని లోకాలకు తీసుకెళ్లింది. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఓ చెట్టు కూలి మీద పడడంతో యువకుడు మృతి చెందిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. -
చిట్టీల పేరుతో మోసం.. ప్రభుత్వ ఉపాధ్యాయురాలు, భర్త అరెస్టు
అక్రమంగా చిట్టీలు నడుపుతూ.. గడువు ముగిసినా డబ్బులు చెల్లించకుండా మోసం చేసిన కేసులో పోలీసులు ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలిని, ఆమె భర్తను అరెస్టు చేశారు. గురువారం హసన్పర్తి ఠాణాలో ఎస్సై దేవేందర్తో కలిసి సీఐ జె.సురేశ్ మీడియాకు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి.. -
మల ద్వారంలోకి గాలి పంపింగ్.. యువకుడి పరిస్థితి విషమం
స్నేహితుల సరదా ఓ యువకుడి ప్రాణం మీదకు తెచ్చింది. మెకానిక్ షెడ్డు వద్ద మల ద్వారంలోకి గాలి పంపింగ్ చేయడంతో పరిస్థితి విషమంగా మారింది. హనుమకొండ జిల్లా ఐనవోలు మండల కేంద్రంలో నాలుగు రోజుల కిందట జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. -
ఎదురుకాల్పుల్లో మావోయిస్టు మృతి
ములుగు-భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల సరిహద్దుల్లోని అడవుల్లో గురువారం జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ మావోయిస్టు మృతి చెందాడు. -
బాలుడిని బలిగొన్న టైరు.. ఓఆర్ఆర్పై మూత్రవిసర్జన చేస్తుండగా ఘటన
అవుటర్ రింగు రోడ్డుపై ఓ బాలుడు మూత్ర విసర్జన చేస్తుండగా ఎక్కడి నుంచో దొర్లుకుంటూ వచ్చిన టైరు తగిలి తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతిచెందాడు. -
లంచం తీసుకుంటూ అనిశాకు చిక్కిన ప్రభుత్వాధికారులు
లంచం తీసుకుంటూ అనిశా వలకు చిక్కారు ఇద్దరు ప్రభుత్వాధికారులు. వివరాల్లోకి వెళ్తే..హనుమకొండ జిల్లా పరకాల మున్సిపాలిటీ పరిధిలోని సీతారాంపురం గ్రామానికి చెందిన లడె రాజేశ్వర్రావు పేరిట ఉన్న 1,173 చదరపు గజాల స్థలం ఉంది. -
గ్యాస్ లీకై.. ప్రయాణికులతో వెళ్తున్న ఆటో దగ్ధం
ప్రయాణికులతో వెళ్తున్న ఆటో దగ్ధం కావడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. విజయవాడలోని మహాత్మాగాంధీ రోడ్డులో ఈ ఘటన చోటుచేసుకుంది. -
మహిళను వివస్త్రను చేసి చిత్రహింసలు
సభ్యసమాజం తలదించుకునేలా ఓ గిరిజన మహిళను చెట్టుకు కట్టేసి, వివస్త్రను చేసి చితకబాదిన సంఘటన అన్నమయ్య జిల్లా వీరబల్లి మండలంలో చోటుచేసుకుంది. -
వినుకొండ హత్యకేసులో మరో ఆరుగురి అరెస్టు
పల్నాడు జిల్లా వినుకొండలో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రషీద్ హత్యకేసులో మరో ఆరుగురిని పోలీసులు గురువారం అరెస్టుచేశారు. వినుకొండ పట్టణ పోలీసుస్టేషన్లో సీఐ సాంబశివరావు విలేకరులతో మాట్లాడుతూ వివరాలు వెల్లడించారు. -
తుపాకీ గురిపెట్టి బాలికపై అత్యాచారం!
దేశ రాజధానిలో దారుణం చోటుచేసుకుంది. పొరుగింటి వ్యక్తి తుపాకీ గురిపెట్టి ఓ బాలికపై అత్యాచారం చేయడమే కాకుండా ఐదంతస్తుల భవనంపై నుంచి తోసేశాడు. -
కారు దిగి నడుస్తూ వెళ్లి.. ‘అటల్ సేతు’ పైనుంచి దూకేసిన టెకీ.. వీడియో
కారు దిగి అలా నడుచుకుంటూ వెళ్లిన ఓ టెకీ.. ముంబయిలోని అటల్ సేతు పైనుంచి కిందకు దూకేశాడు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి: సీఎం రేవంత్రెడ్డి
-
కొత్తింటికి రాహుల్ గాంధీ.. ఆఫర్ చేసిన హౌస్ కమిటీ!
-
ఎల్ఆర్ఎస్ అమలుకు కొత్త జిల్లాల వారీగా ప్రత్యేక బృందాలు: డిప్యూటీ సీఎం భట్టి
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
-
ఐఐటీ ఖరగ్పూర్ నుంచి.. సుందర్ పిచాయ్కి గౌరవ డాక్టరేట్
-
పేర్లు ప్రదర్శించమని బలవంతం చేయలేం: సుప్రీం