Peddapalli: ఊపిరాడకుండా చేసి.. పాముతో కాటు వేయించి..
పెద్దపల్లి జిల్లా గోదావరిఖని మార్కండేయకాలనీకి చెందిన స్థిరాస్తి వ్యాపారి, బిల్డర్ కొచ్చెర ప్రవీణ్ (42) హత్య కేసు మిస్టరీ వీడింది. ప్రవీణ్ భార్య సహా ఆరుగురు నిందితులను గోదావరిఖని ఒకటో పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు.
స్థిరాస్తి వ్యాపారి హత్య కేసులో వీడిన మిస్టరీ
భార్య సహా ఆరుగురి అరెస్ట్
గోదావరిఖని, పెద్దపల్లి- న్యూస్టుడే: పెద్దపల్లి జిల్లా గోదావరిఖని మార్కండేయకాలనీకి చెందిన స్థిరాస్తి వ్యాపారి, బిల్డర్ కొచ్చెర ప్రవీణ్ (42) హత్య కేసు మిస్టరీ వీడింది. ప్రవీణ్ భార్య సహా ఆరుగురు నిందితులను గోదావరిఖని ఒకటో పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. పెద్దపల్లిలో డీసీపీ వైభవ్ గైక్వాడ్ శుక్రవారం ఈ వివరాలు వెల్లడించారు. ప్రవీణ్, లలిత దంపతులకు 14, 12, 10 ఏళ్ల వయసున్న ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. కొన్నాళ్లుగా ప్రవీణ్కు ఓ మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడిందనే విషయం తెలుసుకున్న భార్య లలిత.. నిత్యం గొడవపడేది. భర్తలో మార్పు కనిపించకపోవడంతో అంతమొందించాలని నిర్ణయించుకుంది.
ప్రవీణ్ వద్దే సెంట్రింగ్ పనులు నిర్వహించే రామగుండం హౌసింగ్బోర్డు కాలనీకి చెందిన మచ్చ సురేశ్ (37)తో ఈ విషయం చెప్పింది. ప్రవీణ్ను హత్య చేస్తే ఒక ప్లాట్ ఇస్తానని చెప్పడంతో అంగీకరించిన సురేశ్.. రామగుండానికి చెందిన ఇందారపు సతీష్(25), మందమర్రికి చెందిన మాస శ్రీనివాస్(33), భీమ గణేశ్(23)లతో కలిసి హత్యకు పథకం రచించాడు. పాముతో కాటు వేయించాలన్న పథకం మేరకు మందమర్రిలో ప్రైవేటు సెక్యూరిటీ గార్డు నన్నపురాజు చంద్రశేఖర్(38)తో మాట్లాడుకున్నారు. ఈ క్రమంలో వీరి ఖర్చుల కోసం లలిత 34 గ్రాముల బంగారు గొలుసును వారికి ఇచ్చింది. ఈ నెల 9న రాత్రి రామగుండంలో మద్యం తాగిన నిందితులు.. లలితతో ఫోన్లో మాట్లాడి ద్విచక్ర వాహనాలపై ఇంటికి చేరుకున్నారు.
పడుకున్న ప్రవీణ్ను చూపించి లలిత మరో గదిలోకి వెళ్లి వేచిచూసింది. నిందితులు ప్రవీణ్ ముఖంపై దిండుతో అదిమిపట్టారు. కొద్దిసేపు పెనుగులాడిన ప్రవీణ్లో కదలిక నిలిచిన తర్వాత వెంట తెచ్చిన పాముతో కాటు వేయించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం పామును బహిరంగ ప్రదేశంలో వదిలేశారు. గుండెపోటుతో చనిపోయాడని లలిత చెప్పిన మాటలను నమ్మని ప్రవీణ్ తల్లి.. తన కుమారుడి మృతిపై అనుమానం ఉందని ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు విచారణ చేపట్టారు. దర్యాప్తులో కుట్ర బయటపడడంతో.. లలిత సహా ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు డీసీపీ వెల్లడించారు. వారి నుంచి ఆరు సెల్ఫోన్లు, 34 గ్రాముల బంగారు గొలుసు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పనికి వెళుతూ.. ప్రాణాలొదిలారు
ఉపాధి కోసం హైదరాబాద్కు వెళుతున్న భార్యాభర్తలు, వీరి కుమారుడు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలొదిలారు. ఈ విషాద ఘటన సంగారెడ్డి జిల్లాలో శుక్రవారం జరిగింది. -
ఉన్నట్టుండి పెరిగిన జలపాతం.. బాలుడి మృతి
కుట్రాలం జలపాతంలో ఆకస్మికంగా వరద రావడంతో ఓ బాలుడు కొట్టుకుపోయి మృతి చెందాడు. -
మహిళను బెదిరించి రాత్రి నుంచి ఉదయం వరకు వీడియోకాల్
ఆర్కిటెక్ట్ అయిన మహిళకు రాత్రి వేళ ఫోన్ చేసిన దుండగుడు మాయమాటలతో బెదిరించాడు. అనంతరం వీడియో కాల్ చేసి ఉదయం వరకు పోలీసు కేసుల పేరుతో భయపెడుతూనే ఉన్నాడు. -
విమానాశ్రయంలో వైద్యుడి అరెస్టు
గుంటూరు జిల్లా వెంకటాపురానికి చెందిన డాక్టర్ లోకేశ్కుమార్ శుక్రవారం రాత్రి విమానాశ్రయంలోని వాహనాల పార్కింగ్ ప్రదేశంలో అనుమానాస్పదంగా కనిపించడంతో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
సీశామ్ కలవరం!
‘‘ హైదరాబాద్లో ఓ వ్యక్తి ఫేస్బుక్ ఖాతా ద్వారా మైనర్ల అశ్లీల వీడియో(ఛైల్డ్ సెక్సువల్ అబ్యూజివ్ మెటీరియల్- సీశామ్) షేర్ అయ్యింది. -
పని ఒత్తిడి, విజిలెన్స్ విచారణ..ఎస్టీపీపీ అధికారి బలవన్మరణం
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం పెగడపల్లిలోని ఎస్టీపీపీలో ఓ ఇంజినీరు ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. తోటి ఉద్యోగులు, పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం.. గోదావరిఖనికి చెందిన బూరుగడ్డ కిరీటి(37) ఎస్టీపీపీలో డిప్యూటీ సూపరింటెండెంట్ ఇంజినీరు(డీవైఎస్ఈ)గా ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్(ఓఅండ్ఎం)లో విధులు నిర్వర్తిస్తున్నారు. -
పోలీసులు కొట్టారని ఆటోడ్రైవర్ ఆత్మహత్య
నాగర్కర్నూల్ జిల్లా తెలకపల్లి మండల కేంద్రానికి చెందిన ఓ ఆటో డ్రైవర్ పోలీసులు కొట్టారని మనస్తాపానికి గురై శుక్రవారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. -
తరగతి గది ఆవరణలో చిన్నారి మృతదేహం.. స్కూల్కు నిప్పంటించిన కుటుంబసభ్యులు
తప్పిపోయాడనుకున్న తమ మూడేళ్ల చిన్నారి మృతదేహం పాఠశాల తరగతి గది ఆవరణలో కనిపించడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. -
మనీలాండరింగ్ కేసులో ఇరుక్కున్నారు.. రూ. 60లక్షలు చెల్లించండి!
సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త పంథాలో ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
కేజీహెచ్ సూపరింటెండెంట్కు అస్వస్థత.. కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స
-
నిండు గర్భిణికి పురిటి నొప్పులు.. దారి లేక 6 కిలోమీటర్లు డోలీలోనే!
-
పేదింటి ఉత్తమ విద్యార్థులకు విమాన ప్రయాణం
-
విడాకుల్లో ఎవరి జోక్యం లేదు: గాయని సైంధవి
-
రద్దయిన క్రికెట్ మ్యాచ్కు టికెట్ల డబ్బు వాపసు
-
పని ఒత్తిడి, విజిలెన్స్ విచారణ..ఎస్టీపీపీ అధికారి బలవన్మరణం