Tirupati: హారన్ కొట్టాడని.. బస్సు డ్రైవర్పై దాడి
నడిరోడ్డుపై పుట్టినరోజు వేడుకలు చేసుకుంటున్న యువకులు.. హారన్ కొట్టాడని ఓ బస్సు డ్రైవర్పై దాడి చేశారు. ఈ ఘటన తిరుపతిలో గురువారం అర్ధరాత్రి చోటుచేసుకుంది.
తిరుపతిలో నడిరోడ్డుపై పుట్టినరోజు సంబరాలు
దారివ్వాలని హారన్ కొట్టడంతో ఆగ్రహం
తిరుపతి (నేరవిభాగం), న్యూస్టుడే: నడిరోడ్డుపై పుట్టినరోజు వేడుకలు చేసుకుంటున్న యువకులు.. హారన్ కొట్టాడని ఓ బస్సు డ్రైవర్పై దాడి చేశారు. ఈ ఘటన తిరుపతిలో గురువారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. తిరుపతిలోని అంబేడ్కర్ కాలనీకి చెందిన శివ, శశి స్నేహితుల పుట్టినరోజు వేడుకలను గురువారం అర్ధరాత్రి స్థానిక శంకరంబాడి సర్కిల్ సమీపంలోని ఎంఆర్ఎఫ్ షోరూం వద్ద ప్రధాన రోడ్డుపై నిర్వహించారు. ఆరుగురు యువకులతో కలిసి నడిరోడ్డుపై ద్విచక్రవాహనాలు అడ్డు పెట్టి కేకులు కోస్తూ హడావుడి చేశారు. అదే సమయంలో అభిషేక్ ట్రావెల్స్కు చెందిన బస్సు విజయవాడ నుంచి బెంగళూరు వెళ్తూ ఆ మార్గంలోకి ప్రవేశించింది. రోడ్డుకు అడ్డుగా ఉన్న యువకులు తప్పుకోవాలని బస్సు డ్రైవర్ గణేష్ హారన్ కొట్టారు. ఆగ్రహించిన యువకులు బస్సుపై రాళ్లు రువ్వారు. దీంతో బస్సు పక్క అద్దాలు పగిలాయి. వారిని అడ్డుకోబోయిన డ్రైవర్ను తీవ్రంగా కొట్టారు. ఇంతలో పోలీసులు రావడంతో యువకులు పారిపోయారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. మిగిలినవారి కోసం గాలిస్తున్నారు. డ్రైవర్ను కొడుతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. గంజాయి తీసుకోవడం వల్లే ఆ యువకులు అలా ప్రవర్తించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొలువుల ఆశ చూపి కంబోడియాకు..
ఏజెంట్లు ఇచ్చే కమీషన్లకు ఆశపడి..ఉద్యోగాల పేరుతో యువకులను మభ్యపెట్టి కంబోడియాకు తరలిస్తున్న ముఠా గుట్టును రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు రట్టు చేశారు. ఆ ముఠా సభ్యుడు కంచర్ల సాయి ప్రసాద్ను అరెస్టు చేశారు. -
ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ నాయకుడి హత్య
ఛత్తీస్గఢ్లోని దంతెవాడ జిల్లాలో కాంగ్రెస్ జిల్లా నాయకుడు జోగ పొడియం(48)ను మావోయిస్టులు శుక్రవారం అర్ధరాత్రి ఆయన ఇంట్లోనే దారుణంగా హత్య చేశారు. పొటాలి సీఆర్పీఎఫ్ బేస్ క్యాంపు సమీపంలో మావోయిస్టులు ఈ ఘటనకు పాల్పడ్డారు. -
ఆకస్మిక తనిఖీల్లో భారీ సొత్తు స్వాధీనం
మల్టీజోన్-1 పరిధిలోని 16 జిల్లాల్లో చేపట్టిన ఆకస్మిక తనిఖీల్లో పోలీసులు భారీ సొత్తు స్వాధీనం చేసుకున్నారు. -
డ్రగ్స్ తయారీ మాఫియా గుట్టురట్టు
గుజరాత్, రాజస్థాన్లలో మాదక ద్రవ్యాల తయారీ ముఠా గుట్టు రట్టయింది. రహస్యంగా నడుపుతున్న డ్రగ్స్ ల్యాబ్లపై మాదక ద్రవ్యాల నిరోధక విభాగం (ఎన్సీబీ), గుజరాత్కు చెందిన ఉగ్రవాద నిరోధక దళం(ఏటీఎస్) దాడులు నిర్వహించి 13 మందిని అరెస్టు చేశాయి. -
ఝార్ఖండ్లో స్కూల్ బస్సు బోల్తా.. 15 మంది చిన్నారులకు గాయాలు
ఝార్ఖండ్లోని రాంచీలో చిన్నారులతో పాఠశాలకు వెళుతున్న ఓ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 15 మంది విద్యార్థులు గాయపడ్డారు. వీరందరినీ ఆసుపత్రికి తరలించారు.
తాజా వార్తలు (Latest News)
-
లఖ్నవూపై సూపర్ ఇన్నింగ్స్.. పొట్టి కప్ రేసులోకి సంజూ!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
పదేళ్ల పాలనలో మీరు ఎన్ని హామీలు అమలు చేశారు?: బండి సంజయ్కు పొన్నం కౌంటర్
-
వేసవిలో ఫోన్ ఛార్జింగ్ వేగం తగ్గుతుంది..? ఎందుకు?
-
MH370 మిస్సింగ్లో ఏలియెన్స్ ఆధారాలు?.. ఎలాన్ మస్క్ ఏమన్నారంటే..
-
భారత్ను వదిలి వెళ్లిన దేవెగౌడ మనవడు..!