Kakinada: యువ వైద్యుడి విషాదాంతం
భూమి విషయమై ఎమ్మెల్యే సోదరుడు మోసం చేయడంతో తన కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని కాకినాడకు చెందిన శేషారత్నం ఆరోపించారు.
ఎమ్మెల్యే కన్నబాబు సోదరుడే ఆత్మహత్యకు కారణమని మృతుడి తల్లి ఆరోపణ
సాయంత్రానికల్లా మాట మార్పు
దర్శకుడు కల్యాణ్ కృష్ణకు సంబంధం లేదని వెల్లడి
ఈనాడు, కాకినాడ - న్యూస్టుడే, సర్పవరం, మసీదుసెంటర్, కలెక్టరేట్: భూమి విషయమై ఎమ్మెల్యే సోదరుడు మోసం చేయడంతో తన కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని కాకినాడకు చెందిన శేషారత్నం ఆరోపించారు. ఆదివారం ఉదయం అంతా అలా చెప్పిన ఆమె.. మళ్లీ సాయంత్రానికి మాట మార్చి, ఈ ఆత్మహత్యతో ఎమ్మెల్యే కన్నబాబుకు గానీ, ఆయన సోదరుడు కల్యాణ్కృష్ణకు గానీ సంబంధం లేదన్నారు. కాకినాడలో చోటుచేసుకున్న ఈ ఘటన పెద్ద దుమారం రేపింది. కాకినాడ నేతాజీ వీధిలో ఉండే నున్న శ్రీకిరణ్చౌదరి (33) శనివారం సాయంత్రం నిద్రమాత్రలు మింగి, గడ్డిమందు తాగి ఇంట్లో ఆత్మహత్యకు ప్రయత్నించారు. కాకినాడ జీజీహెచ్లో చేర్పించగా చికిత్స పొందుతూ అర్ధరాత్రి 12.50 గంటలకు మృతిచెందారు. శ్రీకిరణ్ రష్యాలో వైద్యవిద్య అభ్యసించేవారు. కొవిడ్ సమయంలో తండ్రి మరణంతో స్వదేశానికి వచ్చేశారు. శనివారం సాయంత్రమే ఆత్మహత్యకు ప్రయత్నించగా.. ఆదివారం సాయంత్రం వరకు పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లలేదు. ఆదివారం సాయంత్రం పంచనామా నిర్వహించిన పోలీసులు.. రాజకీయ కారణాలేమీ లేవని, ఆర్థిక ఇబ్బందులే ఆత్మహత్యకు కారణమని వెల్లడించారు.
ఇదీ వివాదం
మృతుడు శ్రీకిరణ్ కుటుంబీకుల కథనం ప్రకారం.. కాకినాడవాసి నున్న విశ్వనాథ చౌదరికి గొల్లప్రోలు మండలం చెందుర్తి దగ్గర 12.50 ఎకరాల భూమి ఉంది. ఇందులో అయిదు ఎకరాల విషయంలో వివాదం నడుస్తోంది. మరో ఆరు ఎకరాలు సామర్లకోట మండలం వేట్లపాలెంలోని ఓ వ్యక్తి దగ్గర తాకట్టు పెట్టి రూ. 50 లక్షలు అప్పు తెచ్చారు. తండ్రి మరణం తర్వాత అప్పు తీర్చాల్సిన బాధ్యత కుమారుడు కిరణ్పై పడింది. దీంతో ఆయన ఎమ్మెల్యే కన్నబాబు సోదరుడు కల్యాణ్ను ఆశ్రయించారు. వివాదంలో ఉన్న అయిదు ఎకరాలు కొంటామనడంతో.. ఎకరం రూ. 30 లక్షలకు అమ్మేలా ఒప్పందం చేసుకున్నారు. తర్వాత కిరణ్కు కొంత సొమ్ము ఇచ్చారు. మిగిలిన లావాదేవీల్లో జాప్యం చోటుచేసుకుంది. శనివారం వెళ్లి అడిగితే.. ఇంక ఇవ్వాల్సిందేమీ లేదని ఎమ్మెల్యే సోదరుడు, మధ్యవర్తి చెప్పడంతో మనస్తాపానికి గురై కిరణ్ ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబీకులు తెలిపారు.
తల్లి ఏమన్నారంటే..
‘ఎమ్మెల్యే కన్నబాబు తమ్ముడు కల్యాణ్కృష్ణ నా కుమారుడి దగ్గర భూమి పత్రాలు తీసుకున్నారు. డబ్బులు అడిగితే ఇవ్వం.. నువ్వేం చేసుకుంటావో చేసుకో అని అచ్చంపేటకు చెందిన మధ్యవర్తి పెదబాబు అన్నారు. నా కుమారుడు శనివారం ఇంటికొచ్చి ఏడ్చేశాడు. ఇంతలో అఘాయిత్యానికి పాల్పడ్డాడు. నా కొడుకు చదువు మానేసి వచ్చి ఇక్కడ ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పనిచేస్తున్నారు. అక్కడికి వెళ్లి పెదబాబు గొడవపెట్టారు. కన్నబాబు దగ్గర ఉండే బాలాజీ కూడా మరో భూమి అమ్మకానికి సంబంధించి ఇవ్వాల్సిన రూ. 29 లక్షలు ఇవ్వలేదు. దానినీ సెటిల్ చేస్తానని కల్యాణ్ మాటిచ్చి చేయలేదు’ అని ఆదివారం ఉదయం ఆమె చెప్పారు. అయితే, సాయంత్రం మరోలా మట్లాడారు. తన కుమారుడి ఆత్మహత్యతో కన్నబాబుకు, కల్యాణ్కు సంబంధం లేదన్నారు. వాళ్లూ వీళ్లూ, తమ కుమారుడి స్నేహితులు చెప్పడంతోనే అలా చెప్పానన్నారు. ఒత్తిడి తట్టుకోలేకే తన కుమారుడు ఆత్మహత్య చేసుకున్నారని వివరించారు.
మా తమ్ముడు జాలిపడి నగదు ఇచ్చాడు
- కురసాల కన్నబాబు, వైకాపా ఎమ్మెల్యే
‘మా అమ్మకు క్యాన్సర్, వైద్యం చేయించడానికి డబ్బులు అవసరం.. మా భూమి కొనుక్కోండి’ అని శ్రీకిరణ్ మా దగ్గరకు వచ్చి మా తమ్ముడు కల్యాణ్కృష్ణను బతిమిలాడాడు. కల్యాణ్ జాలిపడి భూమి కొనడానికి సిద్ధమై డబ్బులు ఇచ్చాడు. ఆ భూమి అప్పటికే వేరేవారికి అమ్మేశాడని తెలిసింది. కిరణ్ చౌదరే మా తమ్ముడిని మోసం చేశాడు. మాకే అతని దగ్గర్నుంచి డబ్బు రావాలి. ఆత్మహత్యతో మాకు ఎలాంటి సంబంధం లేదు.
శ్రీకిరణ్ మోసం చేశారు
- వీరంరెడ్డి పెదబాబు, కన్నబాబు అనుచరుడు
దర్శకుడు కల్యాణ్కృష్ణను శ్రీకిరణ్ మోసం చేశారు. భూమి అమ్ముతానని చెప్పి అడ్వాన్స్ తీసుకుని నాలుగు నెలలు కనపడలేదు. అప్పటికే వీరభద్రరావు అనే వ్యక్తికి ఆ భూమి రిజిస్ట్రేషన్ చేసినట్లు తెలిసి నిలదీస్తే.. ఆయనతో మాకు ఆ భూమి రిజిస్ట్రేషన్ చేయిస్తానని చెప్పారు. వీరభద్రరావుకు కల్యాణ్ నెలరోజుల క్రితం డబ్బు చెల్లించి, ఆ భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అయితే మా దగ్గర తీసుకున్న అడ్వాన్స్ తిరిగి ఇవ్వకుండా శ్రీకిరణ్ ఇబ్బందిపెట్టారు.
ఇది వైకాపా భూబకాసురుల హత్యే
తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్
ఈనాడు డిజిటల్, అమరావతి: వైకాపా ఎమ్మెల్యే, మాజీ మంత్రి కురసాల కన్నబాబు తమ్ముడు కల్యాణ్ భూదందాలు, దౌర్జన్యాలు భరించలేక కాకినాడకు చెందిన యువ వైద్యుడు శ్రీకిరణ్ ఆత్మహత్య చేసుకున్నారని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పేర్కొన్నారు. శ్రీకిరణ్కు చెందిన అయిదెకరాలను కొని డబ్బులివ్వకుండా.. ఒరిజినల్ డాక్యుమెంట్లను తన వద్దే ఉంచుకొని కల్యాణ్ వేధించారని వివరించారు. ఇది ముమ్మాటికీ వైకాపా భూబకాసురుల హత్యేనని ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై విచారించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూశాఖ దస్త్రాల దహనం కేసు విచారణను పోలీసులు వేగవంతం చేశారు. -
రూ.2.2 కోట్ల చోరీ కేసు.. గంటల వ్యవధిలో ఛేదించిన పోలీసులు
రాజమహేంద్రవరంలోని హెచ్డీఎఫ్సీ బ్యాంక్కు చెందిన రూ. 2.2 కోట్ల చోరీ కేసును పోలీసులు ఛేదించారు. -
కొడవలితో కొడుకు ఛాతీని గాయపరిచిన తల్లిదండ్రులు
గుడుంబా మత్తులో మానవత్వం మరిచిన ఓ జంట కన్నకొడుకు ఛాతీని కొడవలితో కోసిన ఘటన మంచిర్యాల జిల్లా నెన్నెల మండల కేంద్రంలో గురువారం రాత్రి జరిగింది. -
కొల్లగొడుతున్న సైబర్ ముఠాలు
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి వ్యాపారి(40) వాట్సప్కు స్టాక్మార్కెట్ మెలకువలు నేర్పిస్తామంటూ మెసేజ్ వచ్చింది. ఆయన ఆసక్తి చూపడంతో ‘ఓక్ట్రీ క్యాపిటల్ గ్రూప్’ పేరిట ఉన్న వాట్సప్ గ్రూప్లో చేర్చారు. నిర్వాహకుల మాటలు నమ్మి వారు సూచించిన బ్యాంకు ఖాతాలోకి వ్యాపారి నగదు బదిలీ చేస్తూ వచ్చారు. -
శిర్డీ ఎక్స్ప్రెస్లో భారీ చోరీ
శిర్డీ ఎక్స్ప్రెస్లో గురువారం అర్ధరాత్రి దాటాక దొంగలు విరుచుకుపడ్డారు. ప్రయాణికుల విలువైన వస్తువులు దోచుకొని పారిపోయారు. శుక్రవారం తెల్లవారుజామున గుర్తించిన బాధితులు సికింద్రాబాద్ రైల్వేపోలీసులకు ఫిర్యాదు చేశారు. -
ప్రతికూల వాతావరణంతో యువ సైనికుడి మృతి
సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలనే ఆ యువకుని తపన ఆదిలోనే ఆవిరైపోయింది. అనారోగ్యం బారినపడటంతో యువసైనికుడు గురువారం రాత్రి మృత్యువాత పడ్డారు. -
గురుకుల విద్యార్థి మృతి
జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ బాలుర గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థి అస్వస్థతకు గురై మృతి చెందాడు. అనంతరం మరో ఇద్దరు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. -
గంజాయి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడి.. సహకరించిన భార్య
న్యాయ విద్య చదువుకొని ఉన్నతంగా జీవించాల్సిన యువ దంపతులు గాడితప్పారు. గంజాయికి బానిసలై.. అడ్డదారులు తొక్కారు. సహచర విద్యార్థి అయిన యువతిని ఆ మత్తు ఊబిలోకి దించారు. -
విద్యార్థి ఉసురు తీసిన నాడు-నేడు పనులు
గత వైకాపా ప్రభుత్వ హయాంలో నాసిరకంగా చేపట్టిన నాడు-నేడు అదనపు తరగతి గదుల నిర్మాణ పనులు ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. లింటెల్, దానిపైన ఉన్న గోడ కూలి మీద పడటంతో ఓ విద్యార్థి మృతి చెందిన ఘటన నెల్లూరులో చోటుచేసుకుంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘తప్పు జరిగింది.. క్షమించండి’: పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు
-
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్