భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో లారీ దహనం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో మావోయిస్టులు ఓ లారీని దహనం చేశారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చర్ల ప్రాంతానికి చెందిన ఓ వ్యాపారి మండలంలోని పూసుగుప్పలో రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు.
ఎన్నికల వేళ మావోయిస్టుల అలజడి
చర్ల, న్యూస్టుడే: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో మావోయిస్టులు ఓ లారీని దహనం చేశారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చర్ల ప్రాంతానికి చెందిన ఓ వ్యాపారి మండలంలోని పూసుగుప్పలో రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఆ ధాన్యాన్ని లారీలో చర్లకు పంపిస్తుండగా మంగళవారం సాయంత్రం సాయుధ మావోయిస్టు మిలీషియా సభ్యులు దాన్ని పూసుగుప్ప శివారులో అడ్డుకున్నారు. లారీ డ్రైవర్ను, కూలీలను కిందకి దింపి, అనంతరం డీజిల్ పోసి లారీకి నిప్పంటించారు. ఘటనా ప్రాంతానికి 2.5 కి.మీ. దూరంలోనే సీఆర్పీఎఫ్ క్యాంపులు ఉన్నాయి. సీఆర్పీఎఫ్ బలగాలు, ఇతర వాహనాలు ఘటనాస్థలానికి రాకుండా రోడ్డుకు అడ్డంగా కర్రలు పెట్టారు. లారీకి నిప్పంటించిన అనంతరం వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. మావోయిస్టులు ఇప్పటికే ఎన్నికల బహిష్కరణకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో చోటుచేసుకున్న తాజా ఘటన ఏజెన్సీలో కలకలం రేపినట్లయింది. తెలంగాణలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాత మావోయిస్టులు పాల్పడిన దుశ్చర్య ఇదే. ఈ ఘటనతో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. ఇక్కడి అటవీ ప్రాంతంలో ప్రత్యేక భద్రతా బలగాలు తనిఖీలు చేపట్టాయి. జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ఈ ఘటనపై ఆరా తీసి బలగాలకు పలు సూచనలిచ్చినట్లు సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొల్లగొడుతున్న సైబర్ ముఠాలు
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి వ్యాపారి(40) వాట్సప్కు స్టాక్మార్కెట్ మెలకువలు నేర్పిస్తామంటూ మెసేజ్ వచ్చింది. ఆయన ఆసక్తి చూపడంతో ‘ఓక్ట్రీ క్యాపిటల్ గ్రూప్’ పేరిట ఉన్న వాట్సప్ గ్రూప్లో చేర్చారు. నిర్వాహకుల మాటలు నమ్మి వారు సూచించిన బ్యాంకు ఖాతాలోకి వ్యాపారి నగదు బదిలీ చేస్తూ వచ్చారు. -
శిర్డీ ఎక్స్ప్రెస్లో భారీ చోరీ
శిర్డీ ఎక్స్ప్రెస్లో గురువారం అర్ధరాత్రి దాటాక దొంగలు విరుచుకుపడ్డారు. ప్రయాణికుల విలువైన వస్తువులు దోచుకొని పారిపోయారు. శుక్రవారం తెల్లవారుజామున గుర్తించిన బాధితులు సికింద్రాబాద్ రైల్వేపోలీసులకు ఫిర్యాదు చేశారు. -
కొడవలితో కొడుకు ఛాతీని గాయపరిచిన తల్లిదండ్రులు
గుడుంబా మత్తులో మానవత్వం మరిచిన ఓ జంట కన్నకొడుకు ఛాతీని కొడవలితో కోసిన ఘటన మంచిర్యాల జిల్లా నెన్నెల మండల కేంద్రంలో గురువారం రాత్రి జరిగింది. -
ప్రతికూల వాతావరణంతో యువ సైనికుడి మృతి
సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలనే ఆ యువకుని తపన ఆదిలోనే ఆవిరైపోయింది. అనారోగ్యం బారినపడటంతో యువసైనికుడు గురువారం రాత్రి మృత్యువాత పడ్డారు. -
గురుకుల విద్యార్థి మృతి
జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ బాలుర గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థి అస్వస్థతకు గురై మృతి చెందాడు. అనంతరం మరో ఇద్దరు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. -
గంజాయి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడి.. సహకరించిన భార్య
న్యాయ విద్య చదువుకొని ఉన్నతంగా జీవించాల్సిన యువ దంపతులు గాడితప్పారు. గంజాయికి బానిసలై.. అడ్డదారులు తొక్కారు. సహచర విద్యార్థి అయిన యువతిని ఆ మత్తు ఊబిలోకి దించారు. -
విద్యార్థి ఉసురు తీసిన నాడు-నేడు పనులు
గత వైకాపా ప్రభుత్వ హయాంలో నాసిరకంగా చేపట్టిన నాడు-నేడు అదనపు తరగతి గదుల నిర్మాణ పనులు ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. లింటెల్, దానిపైన ఉన్న గోడ కూలి మీద పడటంతో ఓ విద్యార్థి మృతి చెందిన ఘటన నెల్లూరులో చోటుచేసుకుంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు