East Godavari: ఇంటి వద్దే తుపాకీతో కాల్చి లేఖరి దారుణ హత్య..
ఓ దస్తావేజు లేఖరిని ఇద్దరు దుండగులు ఇంటికి వచ్చి మరీ తుపాకీతో కాల్చి చంపిన ఘటన తూర్పుగోదావరి జిల్లాలో జరిగింది.
తూర్పుగోదావరి జిల్లాలో ఘటన
నల్లజర్ల, గోపాలపురం, న్యూస్టుడే: ఓ దస్తావేజు లేఖరిని ఇద్దరు దుండగులు ఇంటికి వచ్చి మరీ తుపాకీతో కాల్చి చంపిన ఘటన తూర్పుగోదావరి జిల్లాలో జరిగింది. నల్లజర్ల మండలం పుల్లలపాడులో మంగళవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి మృతుడి భార్య, పోలీసులు తెలిపిన ప్రకారం.. పుల్లలపాడుకు చెందిన కాట్రగడ్డ ప్రభాకర్(60) సమీపంలోని అనంతపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద భూ సెటిల్మెంట్లు చేస్తూ రిజిస్ట్రేషన్లు చేయిస్తుంటారు. ఈ క్రమంలో పలువురు ఆయన ఇంటికి వెళ్తుంటారు. అదే మాదిరిగా మంగళవారం సాయంత్రం 6:30 ప్రాంతంలో కారులో గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు ప్రభాకర్ ఇంటికి వచ్చారు. వాళ్లు ఆయనతో రూ.12 లక్షల విషయం ఏం చేశారని మాట్లాడుతుండటంతో భూమికి సంబంధించిన విషయమై ఉంటుందని అక్కడే ఉన్న భార్య సావిత్రి లోపలకు వెళ్లిపోయారు. ఇంతలో రెండు నిమిషాలకే తుపాకీ పేలిన శబ్దం రావడంతో ఆమె బయటకు రాగా అప్పటికే ప్రభాకర్ మృతి చెందినట్లు గుర్తించారు. దుండగులు ఇద్దరూ కారులో పరారయ్యారు. ఎస్పీ జగదీష్, కొవ్వూరు డీఎస్పీ వర్మ, సీఐ నున్న రాజు, ఎస్సైలు ఘటనా స్థలాన్ని, సమీపంలోని సీసీ కెమెరాల రికార్డులను పరిశీలించారు. క్లూస్ టీం వచ్చి వేలిముద్రలు సేకరించింది. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ మృతుడు ఎక్కువగా భూమి సెటిల్మెంట్లు చేస్తుంటారని, ఆ కోణంలోనే హత్య జరిగి ఉండొచ్చని ప్రాథమికంగా భావిస్తున్నామన్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొల్లగొడుతున్న సైబర్ ముఠాలు
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి వ్యాపారి(40) వాట్సప్కు స్టాక్మార్కెట్ మెలకువలు నేర్పిస్తామంటూ మెసేజ్ వచ్చింది. ఆయన ఆసక్తి చూపడంతో ‘ఓక్ట్రీ క్యాపిటల్ గ్రూప్’ పేరిట ఉన్న వాట్సప్ గ్రూప్లో చేర్చారు. నిర్వాహకుల మాటలు నమ్మి వారు సూచించిన బ్యాంకు ఖాతాలోకి వ్యాపారి నగదు బదిలీ చేస్తూ వచ్చారు. -
శిర్డీ ఎక్స్ప్రెస్లో భారీ చోరీ
శిర్డీ ఎక్స్ప్రెస్లో గురువారం అర్ధరాత్రి దాటాక దొంగలు విరుచుకుపడ్డారు. ప్రయాణికుల విలువైన వస్తువులు దోచుకొని పారిపోయారు. శుక్రవారం తెల్లవారుజామున గుర్తించిన బాధితులు సికింద్రాబాద్ రైల్వేపోలీసులకు ఫిర్యాదు చేశారు. -
కొడవలితో కొడుకు ఛాతీని గాయపరిచిన తల్లిదండ్రులు
గుడుంబా మత్తులో మానవత్వం మరిచిన ఓ జంట కన్నకొడుకు ఛాతీని కొడవలితో కోసిన ఘటన మంచిర్యాల జిల్లా నెన్నెల మండల కేంద్రంలో గురువారం రాత్రి జరిగింది. -
ప్రతికూల వాతావరణంతో యువ సైనికుడి మృతి
సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలనే ఆ యువకుని తపన ఆదిలోనే ఆవిరైపోయింది. అనారోగ్యం బారినపడటంతో యువసైనికుడు గురువారం రాత్రి మృత్యువాత పడ్డారు. -
గురుకుల విద్యార్థి మృతి
జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ బాలుర గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థి అస్వస్థతకు గురై మృతి చెందాడు. అనంతరం మరో ఇద్దరు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. -
గంజాయి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడి.. సహకరించిన భార్య
న్యాయ విద్య చదువుకొని ఉన్నతంగా జీవించాల్సిన యువ దంపతులు గాడితప్పారు. గంజాయికి బానిసలై.. అడ్డదారులు తొక్కారు. సహచర విద్యార్థి అయిన యువతిని ఆ మత్తు ఊబిలోకి దించారు. -
విద్యార్థి ఉసురు తీసిన నాడు-నేడు పనులు
గత వైకాపా ప్రభుత్వ హయాంలో నాసిరకంగా చేపట్టిన నాడు-నేడు అదనపు తరగతి గదుల నిర్మాణ పనులు ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. లింటెల్, దానిపైన ఉన్న గోడ కూలి మీద పడటంతో ఓ విద్యార్థి మృతి చెందిన ఘటన నెల్లూరులో చోటుచేసుకుంది.