స్వపక్ష నాయకుడిపైనే ఎంపీ కేసు
కృష్ణా జిల్లా గుడివాడ కౌన్సిల్లో వైకాపా పక్ష నేతగా గతంలో వ్యవహరించిన సీహెచ్ రవికాంత్ను తుళ్లూరు పోలీసులు రెండు రోజుల కిందట అదుపులోకి తీసుకున్నారు.
పోలీసుల అదుపులో నిందితుడు!
కుటుంబీకులు స్టేషన్ చుట్టూ తిరిగినా నిష్ఫలమే!
గుంటూరు, న్యూస్టుడే: కృష్ణా జిల్లా గుడివాడ కౌన్సిల్లో వైకాపా పక్ష నేతగా గతంలో వ్యవహరించిన సీహెచ్ రవికాంత్ను తుళ్లూరు పోలీసులు రెండు రోజుల కిందట అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికీ ఆయన జాడ లేకపోవడం చర్చనీయాంశమైంది. ఎంపీ నందిగం సురేష్ను ఫోన్లో దూషించారని ఆయన వ్యక్తిగత కార్యదర్శి ఫిర్యాదు మేరకు రవికాంత్పై పోలీసులు కేసు నమోదు చేసి సోమవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. 48 గంటలు గడిచినప్పటికీ ఆయన్ను న్యాయస్థానంలో హాజరుపరచకపోవడం వెనుక ఎంపీ ఒత్తిళ్లు ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. ఎంపీ సురేష్కు, రవికాంత్కు గతంలో సత్సంబంధాలు ఉన్నాయి. ఓసారి ఎంపీ గురించి మరొకరి వద్ద రవికాంత్ తప్పుగా మాట్లాడారని చెబుతున్నారు. విషయం తెలిసిన ఎంపీ ఫోన్లో రవికాంత్ను నిలదీశారని, వారి మధ్య వాగ్వాదమేర్పడిందని తెలుస్తోంది. ఈ సందర్భంగా తన స్నేహితులు విజయ్, నాగబాబు, రామచంద్రరాజులతోనూ ఎంపీని తిట్టించారని పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎంపీని కించపర్చేలా ఆయన ఫోన్ వాట్సప్కు సందేశాలు పంపారని ఫిర్యాదులో వివరించారు. ఈ క్రమంలో కేసు నమోదై పోలీసులు రవికాంత్ను అదుపులోకి తీసుకోవడంతో కుటుంబసభ్యులు తుళ్లూరు స్టేషన్కు వెళ్లి ఎంపీ తమకు తెలుసని, మాట్లాడుకుంటామంటూ బతిమాలినా పోలీసులు సర్దిచెబుతూ పంపిస్తున్నారని తెలుస్తోంది. ఎంపీని ఆశ్రయించినప్పటికీ నిష్ఫలమైనట్లు సమాచారం. సొంత పార్టీ నాయకుడిపైనే ఎంపీ ఫిర్యాదు చేయడం చర్చనీయాంశమైంది. రవికాంత్ను సోమవారం అదుపులోకి తీసుకుని పంపించేశామని పోలీసులు వివరణ ఇస్తున్నారు. మంగళవారం కూడా రవికాంత్.. తల్లితో కలిసి తమ వద్దకు వచ్చారన్నారు. ఎంపీతో తాము మాట్లాడుకుంటామని, కేసు వద్దని కోరారని తెలిపారు. ఈ క్రమంలో బుధవారం రవికాంత్కు 41ఏ నోటీసునిచ్చి పంపించామని వివరించారు. మరోవైపు రవికాంత్ను ఇప్పటికీ పోలీసులు విడిచిపెట్టలేదని కుటుంబసభ్యులు వాపోతున్నారు. స్టేషన్లోనే ఉంచి లేరని చెబుతున్నారా? వేరే చోటకు తరలించి ఇబ్బంది పెడుతున్నారా? అన్నది మిస్టరీగానే ఉందని వారు ఆందోళన చెందుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొల్లగొడుతున్న సైబర్ ముఠాలు
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి వ్యాపారి(40) వాట్సప్కు స్టాక్మార్కెట్ మెలకువలు నేర్పిస్తామంటూ మెసేజ్ వచ్చింది. ఆయన ఆసక్తి చూపడంతో ‘ఓక్ట్రీ క్యాపిటల్ గ్రూప్’ పేరిట ఉన్న వాట్సప్ గ్రూప్లో చేర్చారు. నిర్వాహకుల మాటలు నమ్మి వారు సూచించిన బ్యాంకు ఖాతాలోకి వ్యాపారి నగదు బదిలీ చేస్తూ వచ్చారు. -
శిర్డీ ఎక్స్ప్రెస్లో భారీ చోరీ
శిర్డీ ఎక్స్ప్రెస్లో గురువారం అర్ధరాత్రి దాటాక దొంగలు విరుచుకుపడ్డారు. ప్రయాణికుల విలువైన వస్తువులు దోచుకొని పారిపోయారు. శుక్రవారం తెల్లవారుజామున గుర్తించిన బాధితులు సికింద్రాబాద్ రైల్వేపోలీసులకు ఫిర్యాదు చేశారు. -
కొడవలితో కొడుకు ఛాతీని గాయపరిచిన తల్లిదండ్రులు
గుడుంబా మత్తులో మానవత్వం మరిచిన ఓ జంట కన్నకొడుకు ఛాతీని కొడవలితో కోసిన ఘటన మంచిర్యాల జిల్లా నెన్నెల మండల కేంద్రంలో గురువారం రాత్రి జరిగింది. -
ప్రతికూల వాతావరణంతో యువ సైనికుడి మృతి
సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలనే ఆ యువకుని తపన ఆదిలోనే ఆవిరైపోయింది. అనారోగ్యం బారినపడటంతో యువసైనికుడు గురువారం రాత్రి మృత్యువాత పడ్డారు. -
గురుకుల విద్యార్థి మృతి
జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ బాలుర గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థి అస్వస్థతకు గురై మృతి చెందాడు. అనంతరం మరో ఇద్దరు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. -
గంజాయి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడి.. సహకరించిన భార్య
న్యాయ విద్య చదువుకొని ఉన్నతంగా జీవించాల్సిన యువ దంపతులు గాడితప్పారు. గంజాయికి బానిసలై.. అడ్డదారులు తొక్కారు. సహచర విద్యార్థి అయిన యువతిని ఆ మత్తు ఊబిలోకి దించారు. -
విద్యార్థి ఉసురు తీసిన నాడు-నేడు పనులు
గత వైకాపా ప్రభుత్వ హయాంలో నాసిరకంగా చేపట్టిన నాడు-నేడు అదనపు తరగతి గదుల నిర్మాణ పనులు ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. లింటెల్, దానిపైన ఉన్న గోడ కూలి మీద పడటంతో ఓ విద్యార్థి మృతి చెందిన ఘటన నెల్లూరులో చోటుచేసుకుంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే
-
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి