Kidnap: 25 మంది భద్రాద్రి జిల్లా వ్యాపారుల కిడ్నాప్
ఛత్తీస్గఢ్-తెలంగాణ రాష్ట్రాల సరిహద్దులో మావోయిస్టులు 25 మంది వ్యాపారులను కిడ్నాప్ చేశారు. తమకు వ్యతిరేకంగా పనిచేస్తూ పోలీసులకు సహకరిస్తే హతమారుస్తామని హెచ్చరించి వదిలిపెట్టారు.
హెచ్చరించి వదిలిపెట్టిన మావోయిస్టులు
దుమ్ముగూడెం, న్యూస్టుడే: ఛత్తీస్గఢ్-తెలంగాణ రాష్ట్రాల సరిహద్దులో మావోయిస్టులు 25 మంది వ్యాపారులను కిడ్నాప్ చేశారు. తమకు వ్యతిరేకంగా పనిచేస్తూ పోలీసులకు సహకరిస్తే హతమారుస్తామని హెచ్చరించి వదిలిపెట్టారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలానికి చెందిన 25 మంది వ్యాపారులు బుధవారం ఉదయం 7 గంటల సమయంలో ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లా గొల్లపల్లిలో జరిగే వార సంతకు ఆటోలు, ద్విచక్ర వాహనాల్లో బయలుదేరారు. భద్రాద్రి కొత్తగూడెం, సుక్మా జిల్లాల సరిహద్దులో ఉన్న తాళ్లగూడెం-గొల్లపల్లి క్రాస్ రోడ్డు వద్ద మావోయిస్టులు వాహనాలను అడ్డుకుని వ్యాపారులను కిందికి దింపారు. ఆటోలు, వాహనాల్లోని నిత్యావసర సరకులు, మద్యం సీసాలను బయటకు విసిరేశారు. వారి సెల్ఫోన్లను లాక్కొని అటవీ ప్రాంతాలకు తీసుకెళ్లారు. వారిలో కొందరు మహిళా వ్యాపారులు కూడా ఉన్నారు. నిత్యావసర సరకులు సరఫరా చేస్తూ పోలీసులకు ఇన్ఫార్మర్లుగా పనిచేస్తున్నారని ఆరోపిస్తూ కొందరిపై దాడికి పాల్పడ్డారు. అలాంటిదేమీ లేదని తమ వ్యాపారం తాము చేసుకుంటున్నామని, తమను వదిలిపెట్టాలని వేడుకున్నారు. తమకు వ్యతిరేకంగా పనిచేస్తే చంపుతామని బెదిరిస్తూ వారిని వదిలిపెట్టారు. అదే సమయంలో మరో ఇద్దరు వ్యాపారులు వాహనాల్లో పోలీసులకు సరకులు తీసుకెళుతున్నారు. ముందు వెళ్లిన వారిని మావోయిస్టులు అపహరించారని పసిగట్టిన ఆ వ్యాపారులు తమ వాహనాలను వెనక్కి తిప్పారు. గమనించిన మావోయిస్టులు వారివెంట పడినా తప్పించుకుని వెళ్లారు. ఈ క్రమంలో ఇద్దరు మావోయిస్టులు కిందపడటంతో గాయాలపాలయ్యారు. తప్పించుకున్న ఇద్దరు వ్యాపారులు పోలీస్ ఇన్ఫార్మర్లుగా మారారని, వారు కనిపిస్తే హతమారుస్తామని హుకుం జారీచేశారు. ఈ ఘటనతో సంత వ్యాపారుల్లో ఆందోళన నెలకొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బెంగళూరులో 100 మందితో రేవ్పార్టీ.. పట్టుబడ్డ తెలుగు టీవీ నటీనటులు!
బెంగళూరు శివారులో నిర్వహించిన రేవ్ పార్టీలో పలువురు తెలుగు టీవీ నటీనటులు, మోడళ్లు పట్టుబడ్డారు. ఓ వ్యాపారవేత్తకు చెందిన ఫామ్ హౌస్లో బర్త్ డే పార్టీ జరుగుతున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత దాడి చేశారు. -
ఆస్తి తగాదాను మనసులో పెట్టుకొని.. తాతను కొట్టి చంపిన మనవళ్లు
ఆస్తి తగాదాను మనసులో పెట్టుకొని నల్లా నీరు విషయంలో జరిగిన గొడవను సాకుగా తీసుకొని తాతపై మనవళ్లు దాడిచేసి చంపిన ఘటన హనుమకొండ జిల్లాలో చోటుచేసుకుంది. -
అమ్మానాన్నలే హంతకులయ్యారు
అల్లారుముద్దుగా పెంచిన అమ్మానాన్నలే కుమార్తెను హతమార్చారు. మానసిక స్థితి సరిగా లేదని ఆసుపత్రులు, దేవాలయాల చుట్టూ తిరిగినా ఫలితం లేదని ఆవేదన చెందిన తల్లిదండ్రులు 13 నెలల మనవడికి తల్లిని దూరం చేశారు. -
పిడుగుపాటుకు ముగ్గురు రైతుల దుర్మరణం
వికారాబాద్ జిల్లా యాలాల మండలం జుంటుపల్లి, బెన్నూరు గ్రామాల్లో పిడుగుపాటుతో ఆదివారం ముగ్గురు రైతులు దుర్మరణం చెందారు. -
రూ.105 కోట్ల హెరాయిన్ పట్టివేత
అక్రమంగా తరలిస్తున్న హెరాయిన్ను అసోం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు ఆదివారం ‘ఎక్స్’లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ వెల్లడించారు. -
గోవును అక్రమ రవాణా చేస్తున్నాడని.. వృద్ధుడిని బైక్తో ఈడ్చుకెళ్లిన దుండగులు
ఝార్ఖండ్లో అమానుష ఘటన చోటుచేసుకుంది. అక్రమంగా గోవును రవాణా చేస్తున్నాడన్న అనుమానంతో 60 ఏళ్ల వృద్ధుడిని ముగ్గురు వ్యక్తులు తమ ద్విచక్ర వాహనానికి కట్టి ఈడ్చుకెళ్లారు. -
విద్యుదాఘాతంతో దంపతుల దుర్మరణం
ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెంలో విద్యుదాఘాతానికి గురై దంపతులు మృతిచెందారు.
తాజా వార్తలు (Latest News)
-
ఎస్బీఐ కస్టమర్లకు అలర్ట్.. ఆ లింకులపై క్లిక్ చేయొద్దు..!
-
సంబరాల్లో బెంగళూరు.. ధోనీతో కరచాలనం చేసేందుకూ సమయం లేదా?: మాజీలు
-
ఇండస్ట్రీలో నన్ను ‘నంది’ అని పిలిచింది ఆయనే: రాజమౌళి
-
ప్రాసిక్యూటర్ టు ప్రెసిడెంట్: ఎవరీ ఇబ్రహీం రైసీ..?
-
పల్నాడు హింసపై వైకాపా దుష్ప్రచారం: లావు శ్రీకృష్ణదేవరాయలు
-
పీఎఫ్ విత్డ్రా.. ఈ క్లెయిమ్స్పై 3-4 రోజుల్లోనే ఖాతాల్లోకి నగదు!