Murder: అతిథులకు ట్రే తగిలిందని వెయిటర్‌ దారుణ హత్య

ఉత్తర్‌ప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. వివాహ వేడుకలో పాత్రలు తీసుకువెళుతున్న ట్రే అతిథులకు తగిలిందనే కారణంతో వెయిటర్‌ను కొందరు వ్యక్తులు దారుణంగా కొట్టి చంపారు.

Updated : 08 Dec 2023 08:10 IST

లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. వివాహ వేడుకలో పాత్రలు తీసుకువెళుతున్న ట్రే అతిథులకు తగిలిందనే కారణంతో వెయిటర్‌ను కొందరు వ్యక్తులు దారుణంగా కొట్టి చంపారు. గాజియాబాద్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

వివాహ వేడుకల కాంట్రాక్టర్‌ మనోజ్‌ వద్ద పంకజ్‌(26) పని చేస్తున్నాడు. ఇటీవల ఓ గెస్ట్‌ హౌస్‌లో జరిగిన వివాహానికి పంకజ్‌ను వెయిటర్‌గా తీసుకెళ్లాడు. అతడు అతిథులు భోజనం చేసిన తర్వాత పాత్రలను ఒక ట్రేలో వేసుకుని వెళుతుండగా అడ్డుగా ఉన్న వ్యక్తులకు అది తగిలింది. దీంతో వారి మధ్య వాగ్వాదం ముదిరి గొడవకు దారి తీయడంతో పంకజ్‌ను కాంట్రాక్టర్‌ మనోజ్‌ సహా మరికొందరు తీవ్రంగా చితకబాదారు. ఆ దెబ్బలకు తాళలేక పంకజ్‌ ప్రాణాలు కోల్పోయాడు. నిందితులు మృతదేహాన్ని సమీపంలో ఉన్న అడవిలో పడేశారు. పనికి వెళ్లిన కుమారుడు ఇంటికి రాకపోవడంతో అతడి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసిన పోలీసులు ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు