TSRTC - Auto Drivers: ఆర్టీసీ డ్రైవర్‌పై ఆటోడ్రైవర్ల దాడి

ఆర్టీసీ డ్రైవర్‌పై ఆటోడ్రైవర్లు దాడిచేసిన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో బుధవారం చోటుచేసుకుంది. కొత్తగూడెం డిపో నుంచి మధ్యాహ్నం ఖమ్మం బయల్దేరిన పల్లెవెలుగు బస్సు పట్టణంలోని పోస్టాఫీస్‌ కూడలికి చేరుకుంది.

Updated : 28 Dec 2023 10:09 IST

కొత్తగూడెం నేరవిభాగం, న్యూస్‌టుడే: ఆర్టీసీ డ్రైవర్‌పై ఆటోడ్రైవర్లు (Auto Drivers) దాడిచేసిన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో బుధవారం చోటుచేసుకుంది. కొత్తగూడెం డిపో నుంచి మధ్యాహ్నం ఖమ్మం బయల్దేరిన పల్లెవెలుగు బస్సు పట్టణంలోని పోస్టాఫీస్‌ కూడలికి చేరుకుంది. అప్పటి వరకు స్థానిక సర్వీసు ఆటోల్లో వెళ్దామనుకున్న ప్రయాణికులంతా ఒక్కసారిగా బస్సెక్కారు. అదే సమయంలో అక్కడున్న నలుగురు ఆటోడ్రైవర్లు ఆవేశంతో బస్సు డ్రైవర్‌ కె.నాగరాజుపై దాడిచేశారు. అతనిపై నీళ్లు చల్లుతూ అసభ్య పదజాలంతో దూషించారు. కండక్టర్‌ సరస్వతి, ప్రయాణికులు, వాహనదారులు వారించే ప్రయత్నం చేసినా వారు ఆగలేదు. ఘటనపై కొత్తగూడెం డిపో మేనేజర్‌ బాణాల వెంకటేశ్వరరావు కొత్తగూడెం ఒకటో పట్టణ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో పోలీసులు విచారణ చేపట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు