కేవైసీ పేరిట కేటుగాళ్ల మాయలు.. మోసపోవద్దని రిజర్వుబ్యాంకు హెచ్చరిక

సైబర్‌ నేరగాళ్లు రోజురోజుకూ వివిధ మార్గాల్లో జనంపై దాడి చేస్తున్నారు. ఫలానా బ్యాంకు నుంచి ఫోన్‌ చేస్తున్నామని, మీ కేవైసీ వివరాలు అప్‌డేట్‌ చేసుకోవాలని అడుగుతున్నారు.

Updated : 05 Feb 2024 07:11 IST

ఈనాడు, హైదరాబాద్‌: సైబర్‌ నేరగాళ్లు రోజురోజుకూ వివిధ మార్గాల్లో జనంపై దాడి చేస్తున్నారు. ఫలానా బ్యాంకు నుంచి ఫోన్‌ చేస్తున్నామని, మీ కేవైసీ వివరాలు అప్‌డేట్‌ చేసుకోవాలని అడుగుతున్నారు. లేదా ఎస్‌ఎంఎస్‌లు పంపుతున్నారు. ఇది ఎప్పటి నుంచో జరుగుతున్నా.. ఇటీవల సంబంధిత బ్యాంకు లోగోను, ఒరిజినల్‌ వెబ్‌లింకును పోలి ఉండేలా నకిలీ లింకులను సృష్టించి పంపుతున్నారు. ఇది నిజంగా బ్యాంకు నుంచి వచ్చిందేనని వినియోగదారులు క్లిక్‌ చేస్తే ఖాతాలోని సొమ్ము పోగొట్టుకునే ప్రమాదం ఉంది. ఇలా ఎవరైనా వివరాలు అడిగితే స్పందించవద్దని, సంబంధిత బ్యాంకుకెళ్లి నేరుగా తనిఖీ చేసుకోవాలని రిజర్వుబ్యాంకు తాజాగా సూచనలు జారీ చేసింది. లేదా ఆ బ్యాంకు వెబ్‌సైట్‌లో ఉండే కస్టమర్‌ కేర్‌ నంబరులో సంప్రదించాలని తెలిపింది. బ్యాంకు అధికారిక వెబ్‌సైట్‌లో కూడా కేవైసీని అప్‌డేట్‌ చేసుకునే సౌలభ్యం ఉంటుంది. వినియోగదారులు తమ నెట్‌ బ్యాంకింగ్‌ వివరాలు, ఓటీపీలు ఎవరికీ చెప్పవద్దని హెచ్చరించింది. గుర్తుతెలియని వ్యక్తులకు కేవైసీ పత్రాలు ఇవ్వకూడదని సూచించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని