చెరువులు కబళించాయ్..!
సెలవు రోజు సరదాగా గడపాలనుకున్న ఆ బాలుర ఉత్సాహాన్ని మృత్యువు కబళించింది. స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లిన ఇద్దరు విద్యార్థులు, మరోచోట మేకలకు కాపలాగా వెళ్లిన ఇద్దరు అన్నదమ్ములు నీటిలో మునిగి మృతి చెందిన సంఘటనలు ఆదివారం ఉమ్మడి వరంగల్ జిల్లాలో విషాదం నింపాయి.
రెండు సంఘటనల్లో నలుగురు బాలుర దుర్మరణం
తొర్రూరు, మల్హర్ - న్యూస్టుడే: సెలవు రోజు సరదాగా గడపాలనుకున్న ఆ బాలుర ఉత్సాహాన్ని మృత్యువు కబళించింది. స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లిన ఇద్దరు విద్యార్థులు, మరోచోట మేకలకు కాపలాగా వెళ్లిన ఇద్దరు అన్నదమ్ములు నీటిలో మునిగి మృతి చెందిన సంఘటనలు ఆదివారం ఉమ్మడి వరంగల్ జిల్లాలో విషాదం నింపాయి. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం అమ్మాపురం గ్రామంలో గంధం యాకూబ్ (13), కిన్నెర జంపా (11) మరో నలుగురు స్నేహితులతో కలిసి ఊరి చివర ఉన్న పెద్ద చెరువులో ఈత కొట్టేందుకు వెళ్లారు. చెరువు మత్తడి నుంచి పొలాలకు వెళ్లే కాలువలో ఈతకు దిగారు. వెంటనే యాకూబ్, జంపా మునిగిపోవడంతో మిగతా నలుగురు భయంతో ఒడ్డుపైకి చేరి కేకలు వేశారు. అటుగా వ్యవసాయ పనులకు వెళ్తున్న గుంటుక నరేష్కు విషయం చెప్పి పారిపోయారు. నరేష్ సమీపంలో ఉన్న వారిని పిలిపించి మృతదేహాలను వెలికితీయించారు.
అన్నదమ్ముల మృతి
మరో ఘటనలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం తాడిచెర్ల పెంజేరువు గుంతలో పడి అన్నదమ్ములైన ఇద్దరు బాలురు మృతి చెందారు. కుటుంబసభ్యులు, గ్రామస్థుల కథనం ప్రకారం.. బొంతల రాజు భార్య అనూష తన ఇద్దరు పిల్లలు అరుణ్కుమార్ (12), కార్తీక్ (9)లతో కలిసి మేకల కాపలాకు వెళ్లింది. మధ్యాహ్నం సమయంలో అనూష ఆకలి వేస్తోందంటూ ఇంటికి వెళ్లింది. సాయంత్రం వేళ మేకల దగ్గర ఎవరూ లేరని గ్రామానికి చెందిన వ్యక్తులు.. బొంతల రాజుకు ఫోన్లో సమాచారమిచ్చారు. ఆయన భార్యకు తెలపడంతో ఆమె హుటాహుటిన వెళ్లి తన పిల్లల కోసం వెతకగా.. చెరువు గుంత వద్ద చెప్పులు కనిపించాయి. గ్రామస్థులొచ్చి నీటిలో గాలించగా అరుణ్, కార్తీక్ల మృతదేహాలు లభ్యమయ్యాయి. ఒకరి చేయి మరొకరు పట్టుకొని ఉన్నట్లు చెబుతున్నారు. ఒకరు మునిగిపోతుంటే మరొకరు రక్షించే ప్రయత్నంలో ఇద్దరూ మృతి చెంది ఉంటారని గ్రామస్థులు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొల్లగొడుతున్న సైబర్ ముఠాలు
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి వ్యాపారి(40) వాట్సప్కు స్టాక్మార్కెట్ మెలకువలు నేర్పిస్తామంటూ మెసేజ్ వచ్చింది. ఆయన ఆసక్తి చూపడంతో ‘ఓక్ట్రీ క్యాపిటల్ గ్రూప్’ పేరిట ఉన్న వాట్సప్ గ్రూప్లో చేర్చారు. నిర్వాహకుల మాటలు నమ్మి వారు సూచించిన బ్యాంకు ఖాతాలోకి వ్యాపారి నగదు బదిలీ చేస్తూ వచ్చారు. -
శిర్డీ ఎక్స్ప్రెస్లో భారీ చోరీ
శిర్డీ ఎక్స్ప్రెస్లో గురువారం అర్ధరాత్రి దాటాక దొంగలు విరుచుకుపడ్డారు. ప్రయాణికుల విలువైన వస్తువులు దోచుకొని పారిపోయారు. శుక్రవారం తెల్లవారుజామున గుర్తించిన బాధితులు సికింద్రాబాద్ రైల్వేపోలీసులకు ఫిర్యాదు చేశారు. -
కొడవలితో కొడుకు ఛాతీని గాయపరిచిన తల్లిదండ్రులు
గుడుంబా మత్తులో మానవత్వం మరిచిన ఓ జంట కన్నకొడుకు ఛాతీని కొడవలితో కోసిన ఘటన మంచిర్యాల జిల్లా నెన్నెల మండల కేంద్రంలో గురువారం రాత్రి జరిగింది. -
ప్రతికూల వాతావరణంతో యువ సైనికుడి మృతి
సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలనే ఆ యువకుని తపన ఆదిలోనే ఆవిరైపోయింది. అనారోగ్యం బారినపడటంతో యువసైనికుడు గురువారం రాత్రి మృత్యువాత పడ్డారు. -
గురుకుల విద్యార్థి మృతి
జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ బాలుర గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థి అస్వస్థతకు గురై మృతి చెందాడు. అనంతరం మరో ఇద్దరు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. -
గంజాయి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడి.. సహకరించిన భార్య
న్యాయ విద్య చదువుకొని ఉన్నతంగా జీవించాల్సిన యువ దంపతులు గాడితప్పారు. గంజాయికి బానిసలై.. అడ్డదారులు తొక్కారు. సహచర విద్యార్థి అయిన యువతిని ఆ మత్తు ఊబిలోకి దించారు. -
విద్యార్థి ఉసురు తీసిన నాడు-నేడు పనులు
గత వైకాపా ప్రభుత్వ హయాంలో నాసిరకంగా చేపట్టిన నాడు-నేడు అదనపు తరగతి గదుల నిర్మాణ పనులు ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. లింటెల్, దానిపైన ఉన్న గోడ కూలి మీద పడటంతో ఓ విద్యార్థి మృతి చెందిన ఘటన నెల్లూరులో చోటుచేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!