Heart Attack: గుండె పట్టుకుని ఆసుపత్రికి బస్సు నడిపి.. నిమిషాల వ్యవధిలోనే..
బస్సు నడుపుతున్న డ్రైవరు హఠాత్తుగా గుండెపోటుకు గురయ్యారు. నొప్పిని పంటి బిగువన పట్టి దగ్గరలోని ఆసుపత్రి వరకు వాహనాన్ని నడిపారు.
చికిత్స పొందుతూ మృతిచెందిన ఆర్టీసీ డ్రైవర్
కల్లూరు, న్యూస్టుడే: బస్సు నడుపుతున్న డ్రైవరు హఠాత్తుగా గుండెపోటుకు గురయ్యారు. నొప్పిని పంటి బిగువన పట్టి దగ్గరలోని ఆసుపత్రి వరకు వాహనాన్ని నడిపారు. కానీ వైద్యుల వద్దకు వెళ్లిన నిమిషాల వ్యవధిలోనే ఆయన మృతిచెందారు. ఈ విషాదకర సంఘటన ఖమ్మం జిల్లా కల్లూరు పట్టణంలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. జిల్లాలోని వేంసూరు మండలం రామన్నపాలెంకు చెందిన కాకాని శ్రీనివాసరావు(45) సత్తుపల్లి డిపోకు చెందిన ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవరుగా విధులు నిర్వర్తిస్తున్నారు. తెల్లవారుజామున సత్తుపల్లి నుంచి ఖమ్మం బయలుదేరారు. ఉదయం 6 గంటల సమయంలో కల్లూరు పట్టణం సమీపంలోకి చేరగానే గుండెలో నొప్పిగా ఉందంటూ స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి బస్సు తీసుకెళ్లారు. ఆయనే నడుచుకుంటూ లోనికి వెళ్లారు. కానీ వైద్యులు పరీక్షిస్తుండగానే పరిస్థితి విషమించి మృతిచెందారు. ఈ సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. శ్రీనివాసరావుకు భార్య, కుమార్తె ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొలువుల ఆశ చూపి కంబోడియాకు..
ఏజెంట్లు ఇచ్చే కమీషన్లకు ఆశపడి..ఉద్యోగాల పేరుతో యువకులను మభ్యపెట్టి కంబోడియాకు తరలిస్తున్న ముఠా గుట్టును రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు రట్టు చేశారు. ఆ ముఠా సభ్యుడు కంచర్ల సాయి ప్రసాద్ను అరెస్టు చేశారు. -
ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ నాయకుడి హత్య
ఛత్తీస్గఢ్లోని దంతెవాడ జిల్లాలో కాంగ్రెస్ జిల్లా నాయకుడు జోగ పొడియం(48)ను మావోయిస్టులు శుక్రవారం అర్ధరాత్రి ఆయన ఇంట్లోనే దారుణంగా హత్య చేశారు. పొటాలి సీఆర్పీఎఫ్ బేస్ క్యాంపు సమీపంలో మావోయిస్టులు ఈ ఘటనకు పాల్పడ్డారు. -
ఆకస్మిక తనిఖీల్లో భారీ సొత్తు స్వాధీనం
మల్టీజోన్-1 పరిధిలోని 16 జిల్లాల్లో చేపట్టిన ఆకస్మిక తనిఖీల్లో పోలీసులు భారీ సొత్తు స్వాధీనం చేసుకున్నారు. -
డ్రగ్స్ తయారీ మాఫియా గుట్టురట్టు
గుజరాత్, రాజస్థాన్లలో మాదక ద్రవ్యాల తయారీ ముఠా గుట్టు రట్టయింది. రహస్యంగా నడుపుతున్న డ్రగ్స్ ల్యాబ్లపై మాదక ద్రవ్యాల నిరోధక విభాగం (ఎన్సీబీ), గుజరాత్కు చెందిన ఉగ్రవాద నిరోధక దళం(ఏటీఎస్) దాడులు నిర్వహించి 13 మందిని అరెస్టు చేశాయి. -
ఝార్ఖండ్లో స్కూల్ బస్సు బోల్తా.. 15 మంది చిన్నారులకు గాయాలు
ఝార్ఖండ్లోని రాంచీలో చిన్నారులతో పాఠశాలకు వెళుతున్న ఓ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 15 మంది విద్యార్థులు గాయపడ్డారు. వీరందరినీ ఆసుపత్రికి తరలించారు.
తాజా వార్తలు (Latest News)
-
కోహ్లీని వెనకేసుకొచ్చిన గంభీర్.. మీడియాకు చురకలు..!
-
WWE మాజీ మహిళా రెజ్లర్ను పెళ్లాడిన టెక్ సీఈఓ
-
‘బంగారం’లాంటి కబురు చెప్పిన సమంత.. అభిమానుల ఆనందం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
వైకాపా పాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం: కిరణ్ కుమార్రెడ్డి
-
పాలు ఎప్పుడు తాగాలి? ఎందుకు తాగాలి? పూర్తి సమాచారం ఇదిగో!