Hyderabad: తన ప్రేమను తిరస్కరించిన అధ్యాపకుడిపై కక్ష.. యువతిపై పోక్సో కేసు
తన ప్రేమను తిరస్కరించిన అధ్యాపకుడిపై కక్షగట్టిన యువతి, ఆయన 11 ఏళ్ల కుమార్తె పరువు తీసేందుకు తెగించింది. చివరికి కటకటాల పాలైంది.
ఆయన కుమార్తె ఫొటోలు మార్ఫింగ్ చేసి పోస్టులు
ఈనాడు, హైదరాబాద్: తన ప్రేమను తిరస్కరించిన అధ్యాపకుడిపై కక్షగట్టిన యువతి, ఆయన 11 ఏళ్ల కుమార్తె పరువు తీసేందుకు తెగించింది. చివరికి కటకటాల పాలైంది. హైదరాబాద్ నగర సీసీఎస్ జాయింట్ కమిషనర్ ఏవీ రంగనాథ్, డీసీపీ కవిత, ఏసీపీ చాంద్బాషాలు గురువారం కేసు వివరాలు వెల్లడించారు.ఏపీలోని అనంతపురం జిల్లా రాయదుర్గం ప్రాంతానికి చెందిన యువతి(24) గ్రూప్-1 శిక్షణ కోసంహైదరాబాద్కు వచ్చింది. అశోక్నగర్లోని ఓ శిక్షణ సంస్థలో చేరిన ఆమె, అక్కడ ఓ సబ్జెక్టు బోధించే అధ్యాపకుడిపై మనసు పడింది. తాను ప్రేమిస్తున్న విషయాన్ని అధ్యాపకుడికి చెప్పగా.. తనకు భార్యాపిల్లలున్నారని చెబుతూ మందలించారు. ఆయనపై పగ పెంచుకున్న యువతి అధ్యాపకుడి భార్య, కుమార్తె ఫొటోలు సేకరించింది. ఇన్స్టాగ్రామ్లో నకిలీ ఖాతా, యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించి అధ్యాపకుడి కుటుంబ చిత్రాలతోపాటు 11 ఏళ్ల ఆయన కుమార్తె ఫొటోలు మార్ఫింగ్ చేసి అప్లోడ్ చేసింది. అధ్యాపకుడు పనిచేసే శిక్షణ సంస్థ, హైకోర్టు అధికారిక పేజీలు, విద్యార్థుల వాట్సప్ గ్రూపుల్లోనూ అశ్లీలతతో కూడిన పదజాలంతో ఆయా పోస్టులు పెడుతూ వేధింపులకు గురిచేస్తూ వచ్చింది. ‘బాధితుడి ఫిర్యాదు మేరకు నగర సైబర్క్రైమ్ ఇన్స్పెక్టర్ సైదులు బృందం సాంకేతిక ఆధారాలతో నిందితురాలిని అనంతపురంలో గురువారం అరెస్టు చేసింది. నిందితురాలిపై పోక్సో కేసు నమోదు చేసి రిమాండుకు తరలించాం’ అని నగర సైబర్ క్రైమ్ పోలీసులు వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొలువుల ఆశ చూపి కంబోడియాకు..
ఏజెంట్లు ఇచ్చే కమీషన్లకు ఆశపడి..ఉద్యోగాల పేరుతో యువకులను మభ్యపెట్టి కంబోడియాకు తరలిస్తున్న ముఠా గుట్టును రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు రట్టు చేశారు. ఆ ముఠా సభ్యుడు కంచర్ల సాయి ప్రసాద్ను అరెస్టు చేశారు. -
ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ నాయకుడి హత్య
ఛత్తీస్గఢ్లోని దంతెవాడ జిల్లాలో కాంగ్రెస్ జిల్లా నాయకుడు జోగ పొడియం(48)ను మావోయిస్టులు శుక్రవారం అర్ధరాత్రి ఆయన ఇంట్లోనే దారుణంగా హత్య చేశారు. పొటాలి సీఆర్పీఎఫ్ బేస్ క్యాంపు సమీపంలో మావోయిస్టులు ఈ ఘటనకు పాల్పడ్డారు. -
ఆకస్మిక తనిఖీల్లో భారీ సొత్తు స్వాధీనం
మల్టీజోన్-1 పరిధిలోని 16 జిల్లాల్లో చేపట్టిన ఆకస్మిక తనిఖీల్లో పోలీసులు భారీ సొత్తు స్వాధీనం చేసుకున్నారు. -
డ్రగ్స్ తయారీ మాఫియా గుట్టురట్టు
గుజరాత్, రాజస్థాన్లలో మాదక ద్రవ్యాల తయారీ ముఠా గుట్టు రట్టయింది. రహస్యంగా నడుపుతున్న డ్రగ్స్ ల్యాబ్లపై మాదక ద్రవ్యాల నిరోధక విభాగం (ఎన్సీబీ), గుజరాత్కు చెందిన ఉగ్రవాద నిరోధక దళం(ఏటీఎస్) దాడులు నిర్వహించి 13 మందిని అరెస్టు చేశాయి. -
ఝార్ఖండ్లో స్కూల్ బస్సు బోల్తా.. 15 మంది చిన్నారులకు గాయాలు
ఝార్ఖండ్లోని రాంచీలో చిన్నారులతో పాఠశాలకు వెళుతున్న ఓ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 15 మంది విద్యార్థులు గాయపడ్డారు. వీరందరినీ ఆసుపత్రికి తరలించారు.
తాజా వార్తలు (Latest News)
-
టాలీవుడ్లో చరిత్ర లిఖించిన రోజు.. ఎన్ని బ్లాక్బస్టర్లు విడుదలయ్యాయంటే?
-
శంషాబాద్ ఎయిర్పోర్టు సమీపంలో చిరుత సంచారం!
-
రూ.49కే బీఎస్ఎన్ఎల్ సినిమాప్లస్ సబ్స్క్రిప్షన్
-
నవాబులు, సుల్తాన్ల అరాచకాలపై మౌనమా?: రాహుల్పై మోదీ ధ్వజం
-
ధోనీ ‘ఐపీఎల్’ జర్నీ సక్సెస్కు కారణమిదే!
-
పండుగాడికి పద్దెనిమిదేళ్లు .. ‘పోకిరి’ ఆసక్తికర విశేషాలు..