పురుగుల మందు తాగి.. ఆర్టిజన్ మృతి
చాలీచాలని వేతనాలతో ఇబ్బందులు.. నమ్మినవాళ్లు మోసం చేశారన్న వేదనతో పురుగులమందు తాగిన ఆర్టిజన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతిచెందారు.
హాజీపూర్, న్యూస్టుడే: చాలీచాలని వేతనాలతో ఇబ్బందులు.. నమ్మినవాళ్లు మోసం చేశారన్న వేదనతో పురుగులమందు తాగిన ఆర్టిజన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతిచెందారు. మంచిర్యాల జిల్లా హాజీపూర్ ఎస్ఐ గోపతి సురేష్, మృతుడి కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. జైపూరు మండలం కుందారానికి చెందిన విజ్జగిరి సమ్మయ్య(51) మంచిర్యాలలో నివాసం ఉంటూ హాజీపూర్ మండలం వేంపల్లిలోని విద్యుత్ ఉపకేంద్రంలో ఆర్టిజన్గా విధులు నిర్వహిస్తున్నారు. కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆయన ఆందోళనకు గురయ్యారు. ఈ నెల 20న ఉపకేంద్రంలోనే పురుగుల మందు తాగారు. కొంతసేపటికి గమనించిన స్థానికులు మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా మారడంతో హైదరాబాద్లోని ఓ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా మృతిచెందినట్లు ఎస్ఐ తెలిపారు. మృతుని కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. సమ్మయ్యకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ‘విద్యుత్ సంస్థలో పనిచేస్తుండటంతో బతుకులు భారమవుతున్నాయి. ఒకే సంస్థలో రెండు సర్వీస్ రూల్స్ ఉండటం చాలా బాధగా ఉంది. డిపార్టుమెంట్ అధికారులు అవహేళన చేస్తున్నారు. ప్రభుత్వం ఆర్టిజన్ల జీవితాల్లో వెలుగులు నింపాలి. దీనికి నా చావే ఆఖరిది కావాలని వేడుకుంటున్నాను’ అని రాసిన నోట్ హైదరాబాద్ ఆసుపత్రిలో కుటుంబ సభ్యులకు లభ్యమైంది. అందులో తన పిల్లలనుద్దేశించి ‘అమ్మ జాగ్రత్త’ అని రాసి ఉంది. ‘నమ్మినవాళ్లు మోసం చేయడంతో తట్టుకోలేకపోయాను’ అని కూడా నోట్లో ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొల్లగొడుతున్న సైబర్ ముఠాలు
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి వ్యాపారి(40) వాట్సప్కు స్టాక్మార్కెట్ మెలకువలు నేర్పిస్తామంటూ మెసేజ్ వచ్చింది. ఆయన ఆసక్తి చూపడంతో ‘ఓక్ట్రీ క్యాపిటల్ గ్రూప్’ పేరిట ఉన్న వాట్సప్ గ్రూప్లో చేర్చారు. నిర్వాహకుల మాటలు నమ్మి వారు సూచించిన బ్యాంకు ఖాతాలోకి వ్యాపారి నగదు బదిలీ చేస్తూ వచ్చారు. -
శిర్డీ ఎక్స్ప్రెస్లో భారీ చోరీ
శిర్డీ ఎక్స్ప్రెస్లో గురువారం అర్ధరాత్రి దాటాక దొంగలు విరుచుకుపడ్డారు. ప్రయాణికుల విలువైన వస్తువులు దోచుకొని పారిపోయారు. శుక్రవారం తెల్లవారుజామున గుర్తించిన బాధితులు సికింద్రాబాద్ రైల్వేపోలీసులకు ఫిర్యాదు చేశారు. -
కొడవలితో కొడుకు ఛాతీని గాయపరిచిన తల్లిదండ్రులు
గుడుంబా మత్తులో మానవత్వం మరిచిన ఓ జంట కన్నకొడుకు ఛాతీని కొడవలితో కోసిన ఘటన మంచిర్యాల జిల్లా నెన్నెల మండల కేంద్రంలో గురువారం రాత్రి జరిగింది. -
ప్రతికూల వాతావరణంతో యువ సైనికుడి మృతి
సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలనే ఆ యువకుని తపన ఆదిలోనే ఆవిరైపోయింది. అనారోగ్యం బారినపడటంతో యువసైనికుడు గురువారం రాత్రి మృత్యువాత పడ్డారు. -
గురుకుల విద్యార్థి మృతి
జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ బాలుర గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థి అస్వస్థతకు గురై మృతి చెందాడు. అనంతరం మరో ఇద్దరు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. -
గంజాయి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడి.. సహకరించిన భార్య
న్యాయ విద్య చదువుకొని ఉన్నతంగా జీవించాల్సిన యువ దంపతులు గాడితప్పారు. గంజాయికి బానిసలై.. అడ్డదారులు తొక్కారు. సహచర విద్యార్థి అయిన యువతిని ఆ మత్తు ఊబిలోకి దించారు. -
విద్యార్థి ఉసురు తీసిన నాడు-నేడు పనులు
గత వైకాపా ప్రభుత్వ హయాంలో నాసిరకంగా చేపట్టిన నాడు-నేడు అదనపు తరగతి గదుల నిర్మాణ పనులు ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. లింటెల్, దానిపైన ఉన్న గోడ కూలి మీద పడటంతో ఓ విద్యార్థి మృతి చెందిన ఘటన నెల్లూరులో చోటుచేసుకుంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు