Kidney Racket: టెలిగ్రామ్లో కిడ్నీల దందా..!
తెలంగాణలో మరోసారి కిడ్నీ రాకెట్ కార్యకలాపాలు వెలుగులోకి వచ్చాయి. క్రయవిక్రయాలకు సంబంధించి సామాజిక మాధ్యమంలో ప్రకటనలపై అందిన ఫిర్యాదు మేరకు తెలంగాణ సీఐడీ సెక్షన్ 18, 19 ఆఫ్ హ్యూమన్ ఆర్గాన్స్ ట్రాన్స్ప్లాంటేషన్-1994 చట్టం కింద కేసు నమోదు చేసింది.
క్రయవిక్రయాలపై ప్రకటనలు
కేసు నమోదు చేసిన తెలంగాణ సీఐడీ
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణలో మరోసారి కిడ్నీ రాకెట్ కార్యకలాపాలు వెలుగులోకి వచ్చాయి. క్రయవిక్రయాలకు సంబంధించి సామాజిక మాధ్యమంలో ప్రకటనలపై అందిన ఫిర్యాదు మేరకు తెలంగాణ సీఐడీ సెక్షన్ 18, 19 ఆఫ్ హ్యూమన్ ఆర్గాన్స్ ట్రాన్స్ప్లాంటేషన్-1994 చట్టం కింద కేసు నమోదు చేసింది. టెలిగ్రామ్ యాప్లో ఓ ఛానెల్ ద్వారా దందా సాగిస్తున్న అంశంపై సామాజిక కార్యకర్త ఒకరు ఇచ్చిన ఫిర్యాదుతో సీఐడీ బృందం దర్యాప్తు ప్రారంభించింది. కిడ్నీ అవసరమున్న బాధితులను గుర్తించి ఆ గ్రూపులో చేర్చేలా ముఠా కుట్ర పన్నినట్లు వెల్లడైంది. అడ్మిన్ మాత్రమే సభ్యులను చేర్చేలా గుట్టుగా దందా సాగిస్తున్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఇది సైబర్ మోసమా లేక నిజంగానే కిడ్నీలు విక్రయిస్తున్నారా..? అని తేల్చే దిశగా దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటివరకు ఎవరైనా బాధితులు ఈ ముఠా బారినపడ్డారా..? అని ఆరా తీస్తున్నారు. రాష్ట్రంలో గతంలోనూ పలు కిడ్నీ రాకెట్లు బహిర్గతమయ్యాయి. సీఐడీతోపాటు హైదరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో ఇవి వెలుగుచూశాయి. శ్రీలంకకు తీసుకెళ్లి కిడ్నీలను మార్పిడి చేయించిన ముఠాలను పోలీసులు గుర్తించారు. 2016నాటి కేసులో సీఐడీ గత ఏడాదే అభియోగపత్రం దాఖలు చేసింది. తాజాగా మరోసారి వెలుగుచూసిన నేపథ్యంలో పాత ముఠాల్లోని నిందితుల గురించి సీఐడీ ఆరా తీస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొల్లగొడుతున్న సైబర్ ముఠాలు
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి వ్యాపారి(40) వాట్సప్కు స్టాక్మార్కెట్ మెలకువలు నేర్పిస్తామంటూ మెసేజ్ వచ్చింది. ఆయన ఆసక్తి చూపడంతో ‘ఓక్ట్రీ క్యాపిటల్ గ్రూప్’ పేరిట ఉన్న వాట్సప్ గ్రూప్లో చేర్చారు. నిర్వాహకుల మాటలు నమ్మి వారు సూచించిన బ్యాంకు ఖాతాలోకి వ్యాపారి నగదు బదిలీ చేస్తూ వచ్చారు. -
శిర్డీ ఎక్స్ప్రెస్లో భారీ చోరీ
శిర్డీ ఎక్స్ప్రెస్లో గురువారం అర్ధరాత్రి దాటాక దొంగలు విరుచుకుపడ్డారు. ప్రయాణికుల విలువైన వస్తువులు దోచుకొని పారిపోయారు. శుక్రవారం తెల్లవారుజామున గుర్తించిన బాధితులు సికింద్రాబాద్ రైల్వేపోలీసులకు ఫిర్యాదు చేశారు. -
కొడవలితో కొడుకు ఛాతీని గాయపరిచిన తల్లిదండ్రులు
గుడుంబా మత్తులో మానవత్వం మరిచిన ఓ జంట కన్నకొడుకు ఛాతీని కొడవలితో కోసిన ఘటన మంచిర్యాల జిల్లా నెన్నెల మండల కేంద్రంలో గురువారం రాత్రి జరిగింది. -
ప్రతికూల వాతావరణంతో యువ సైనికుడి మృతి
సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలనే ఆ యువకుని తపన ఆదిలోనే ఆవిరైపోయింది. అనారోగ్యం బారినపడటంతో యువసైనికుడు గురువారం రాత్రి మృత్యువాత పడ్డారు. -
గురుకుల విద్యార్థి మృతి
జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ బాలుర గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థి అస్వస్థతకు గురై మృతి చెందాడు. అనంతరం మరో ఇద్దరు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. -
గంజాయి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడి.. సహకరించిన భార్య
న్యాయ విద్య చదువుకొని ఉన్నతంగా జీవించాల్సిన యువ దంపతులు గాడితప్పారు. గంజాయికి బానిసలై.. అడ్డదారులు తొక్కారు. సహచర విద్యార్థి అయిన యువతిని ఆ మత్తు ఊబిలోకి దించారు. -
విద్యార్థి ఉసురు తీసిన నాడు-నేడు పనులు
గత వైకాపా ప్రభుత్వ హయాంలో నాసిరకంగా చేపట్టిన నాడు-నేడు అదనపు తరగతి గదుల నిర్మాణ పనులు ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. లింటెల్, దానిపైన ఉన్న గోడ కూలి మీద పడటంతో ఓ విద్యార్థి మృతి చెందిన ఘటన నెల్లూరులో చోటుచేసుకుంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే