‘గొర్రెల’ గోల్మాల్లో ఇంటి దొంగలు
రాష్ట్రంలో గొర్రెల పంపిణీ పథకంలో ఇంటి దొంగల గుట్టు రట్టయింది. గొర్రెల పంపిణీ పేరిట రూ.2.01 కోట్ల ప్రభుత్వ నిధుల్ని పక్కదారి పట్టించిన వ్యవహారంలో నలుగురు ప్రభుత్వ అధికారులను అవినీతి నిరోధకశాఖ గురువారం అరెస్ట్ చేసింది.
కాంట్రాక్టర్లతో ప్రభుత్వాధికారుల కుమ్మక్కు
రూ. 2.01 కోట్లు మోసపోయిన సరఫరాదారులు
నలుగురు జిల్లా స్థాయి అధికారుల్ని అరెస్ట్ చేసిన అనిశా
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో గొర్రెల పంపిణీ పథకంలో ఇంటి దొంగల గుట్టు రట్టయింది. గొర్రెల పంపిణీ పేరిట రూ.2.01 కోట్ల ప్రభుత్వ నిధుల్ని పక్కదారి పట్టించిన వ్యవహారంలో నలుగురు ప్రభుత్వ అధికారులను అవినీతి నిరోధకశాఖ గురువారం అరెస్ట్ చేసింది. కామారెడ్డి ప్రాంతీయ పశువైద్యశాల సహాయ సంచాలకుడు డా.రవి, మేడ్చల్ జిల్లా పశువైద్యశాఖ సహాయ సంచాలకుడు డా.ఎం.ఆదిత్య కేశవసాయి, రంగారెడ్డి జిల్లా భూగర్భ జలశాఖ అధికారి పసుల రఘుపతిరెడ్డి, వయోజన విద్యాశాఖ ఉపసంచాలకుడు సంగు గణేశ్ను అనిశా అధికారులు ఏసీబీ కేసుల ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరిచారు. న్యాయస్థానం వీరికి మార్చి 7 వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో చంచల్గూడ జైలుకు తరలించారు. ఈకేసులో ఇప్పటికే ప్రధాన నిందితులుగా గుర్తించిన మొయినుద్దీన్, అతని కుమారుడు ఇక్రమ్ పరారీలో ఉన్నారు. నిందితుల సంఖ్య 6కు చేరింది.
గొర్రెల పెంపకందారులది పల్నాడు జిల్లా
తెలంగాణలో గొర్రెల పంపిణీ పథకాన్ని నాడు ప్రభుత్వం పెద్దఎత్తున చేపట్టింది. దాంతో పశుసంవర్ధక శాఖ అధికారులకు వేరే శాఖల వారిని కూడా సర్కారు జతచేసింది. అనిశా దర్యాప్తు క్రమంలో అధికారులు, కాంట్రాక్టర్లు కలిసి మోసానికి తెరలేపిన వైనం బహిర్గతమైంది. రంగారెడ్డి జిల్లా మంచాల ప్రాంత లబ్ధిదారులకు గొర్రెలు పంపిణీ చేయాలంటూ వారు ఏపీలోని పల్నాడు జిల్లా అంగలూరుకు చెందిన 18 మంది గొర్రెల సరఫరా దారులను సంప్రదించారు. పశువైద్యశాఖ అధికారులు రవి, ఆదిత్యకేశవసాయితోపాటు కాంట్రాక్టర్లు మొయినుద్దీన్, ఇక్రమ్ కలిసి 133 మంది లబ్ధిదారుల్ని వెంట తీసుకెళ్లారు. ఒక్కో యూనిట్లో 20 గొర్రెలతోపాటు ఒక పొట్టేలును ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. యూనిట్కు రూ.1.58లక్షలను సరఫరా దారులకు చెల్లించేందుకు అంగీకారం కుదిరింది. అనంతరం అధికారుల సమక్షంలోనే లబ్ధిదారులకు గొర్రెలను అందజేశారు. వారం పది రోజుల్లో బ్యాంకు ఖాతాలకు డబ్బులు బదిలీ చేస్తామని అధికారులు సరఫరాదారులకు హామీ ఇచ్చారు. తెలంగాణకు గొర్రెలను తీసుకొచ్చిన అనంతరం అధికారులు, కాంట్రాక్టర్లు కలిసి కుట్రకు తెర లేపారు. అసలు పెంపకందారుల స్థానంలో బినామీలను తెరపైకి తెచ్చారు. కాంట్రాక్టర్లకు సంబంధించిన డ్రైవర్, స్నేహితులు, పనిమనుషులనే సరఫరాదారులుగా చూపుతూ రికార్డులను ఏమార్చారు. అధికారులు సహకరించి బినామీలనే అసలైన సరఫరాదారులుగా పేర్కొంటూ సంతకాలు చేశారు. దీంతో బినామీల పేరిటే నుంచి చెక్కులు మంజూరయ్యాయి. అనంతరం బినామీల ఖాతాల్లో ప్రభుత్వం నుంచి డబ్బులు పడిన కొద్దిరోజులకే వాటిని తిరిగి మొయినుద్దీన్, ఇక్రమ్ తమ ఖాతాలకు మళ్లించుకున్నారు. ఈ మోసంలో నలుగురు అధికారుల పాత్ర బహిర్గతం కావడంతో తాజాగా వారిని అరెస్ట్ చేశారు.
బైక్పై గొర్రెల తరలింపుపై ఆరా
గొర్రెల పంపిణీ పథకం పక్కదారి పట్టిన తీరును గతవారం వెలువడిన కాగ్ తాజా నివేదిక ఎత్తిచూపింది. ఒక బైక్పై ఏకంగా 126 గొర్రెల్ని తీసుకొచ్చినట్లు అధికారులు రికార్డులు సృష్టించిన అంశాన్ని కాగ్ బహిర్గతం చేసింది. అలాగే ఆటోలు, బస్సులు, కార్లలోనూ గొర్రెల్ని తరలించినట్లు చూపి నిధుల్ని స్వాహా చేసినట్లు నిగ్గుతేల్చింది. తాజా దర్యాప్తు నేపథ్యంలో కాగ్ నివేదికలోని అంశాలనూ అనిశా లోతుగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొల్లగొడుతున్న సైబర్ ముఠాలు
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి వ్యాపారి(40) వాట్సప్కు స్టాక్మార్కెట్ మెలకువలు నేర్పిస్తామంటూ మెసేజ్ వచ్చింది. ఆయన ఆసక్తి చూపడంతో ‘ఓక్ట్రీ క్యాపిటల్ గ్రూప్’ పేరిట ఉన్న వాట్సప్ గ్రూప్లో చేర్చారు. నిర్వాహకుల మాటలు నమ్మి వారు సూచించిన బ్యాంకు ఖాతాలోకి వ్యాపారి నగదు బదిలీ చేస్తూ వచ్చారు. -
శిర్డీ ఎక్స్ప్రెస్లో భారీ చోరీ
శిర్డీ ఎక్స్ప్రెస్లో గురువారం అర్ధరాత్రి దాటాక దొంగలు విరుచుకుపడ్డారు. ప్రయాణికుల విలువైన వస్తువులు దోచుకొని పారిపోయారు. శుక్రవారం తెల్లవారుజామున గుర్తించిన బాధితులు సికింద్రాబాద్ రైల్వేపోలీసులకు ఫిర్యాదు చేశారు. -
కొడవలితో కొడుకు ఛాతీని గాయపరిచిన తల్లిదండ్రులు
గుడుంబా మత్తులో మానవత్వం మరిచిన ఓ జంట కన్నకొడుకు ఛాతీని కొడవలితో కోసిన ఘటన మంచిర్యాల జిల్లా నెన్నెల మండల కేంద్రంలో గురువారం రాత్రి జరిగింది. -
ప్రతికూల వాతావరణంతో యువ సైనికుడి మృతి
సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలనే ఆ యువకుని తపన ఆదిలోనే ఆవిరైపోయింది. అనారోగ్యం బారినపడటంతో యువసైనికుడు గురువారం రాత్రి మృత్యువాత పడ్డారు. -
గురుకుల విద్యార్థి మృతి
జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ బాలుర గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థి అస్వస్థతకు గురై మృతి చెందాడు. అనంతరం మరో ఇద్దరు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. -
గంజాయి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడి.. సహకరించిన భార్య
న్యాయ విద్య చదువుకొని ఉన్నతంగా జీవించాల్సిన యువ దంపతులు గాడితప్పారు. గంజాయికి బానిసలై.. అడ్డదారులు తొక్కారు. సహచర విద్యార్థి అయిన యువతిని ఆ మత్తు ఊబిలోకి దించారు. -
విద్యార్థి ఉసురు తీసిన నాడు-నేడు పనులు
గత వైకాపా ప్రభుత్వ హయాంలో నాసిరకంగా చేపట్టిన నాడు-నేడు అదనపు తరగతి గదుల నిర్మాణ పనులు ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. లింటెల్, దానిపైన ఉన్న గోడ కూలి మీద పడటంతో ఓ విద్యార్థి మృతి చెందిన ఘటన నెల్లూరులో చోటుచేసుకుంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్