ఐటీ అధికారులమంటూ దారి దోపిడీ
‘ఆదాయ పన్ను శాఖ అధికారులం. మీ కారును తనిఖీ చేయాలి’ అంటూ నగల వ్యాపారి వద్దనున్న మూడున్నర కిలోల బంగారం, రూ.5 లక్షల నగదుతో ఐదుగురు దుండగులు పరారయ్యారు.
3.5 కిలోల బంగారం, రూ.5 లక్షల నగదుతో పరారీ
గోపాలపురం, నల్లజర్ల, న్యూస్టుడే: ‘ఆదాయ పన్ను శాఖ అధికారులం. మీ కారును తనిఖీ చేయాలి’ అంటూ నగల వ్యాపారి వద్దనున్న మూడున్నర కిలోల బంగారం, రూ.5 లక్షల నగదుతో ఐదుగురు దుండగులు పరారయ్యారు. తూర్పు గోదావరి జిల్లా నల్లజర్ల మండలం పోతవరం గ్రామ శివారులో బుధవారం జరిగిన ఈ ఘటనపై పోలీసుల కథనం.. మహారాష్ట్ర నుంచి పాతికేళ్ల కిందట వలసవచ్చి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో స్థిరపడిన గార్లె బాలు నాధూరాం బంగారం వ్యాపారం చేస్తున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా సహా పలు ప్రాంతాల్లోని దుకాణాల్లో హోల్సేల్ ధరలకు బంగారం విక్రయిస్తుంటారు. బుధవారం భీమవరం నుంచి కారులో డ్రైవరుతో పాటు బయల్దేరారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో ఒక దుకాణంలో బంగారం ఇచ్చి కొయ్యలగూడెం మీదుగా తాడేపల్లిగూడెం వెళ్తున్నారు. నల్లజర్ల మండలం పోతవరం శివారుకు వచ్చేసరికి కారులో వచ్చిన ఐదుగురు వ్యక్తులు.. తాము ఐటీ విభాగం అధికారులమంటూ వ్యాపారి కారును అడ్డగించారు. వ్యాపారిని, డ్రైవరును తమ కారులో ఎక్కించుకొని, నాదూరాం కారును ఆ ఐదుగురిలో ఒకరు నడిపారు. వీరు జాతీయ రహదారిపై కొవ్వూరు మీదుగా రాజమహేంద్రవరం మోరంపూడి జంక్షన్ వరకు వచ్చారు. అక్కడ రాత్రి 9 గంటల సమయంలో వ్యాపారిని, డ్రైవరును విడిచిపెట్టి, దుండగులు తాము వచ్చిన వాహనంలో వెళ్లిపోయారు. వ్యాపారి తన కారును తనిఖీ చేయగా బంగారం, నగదు లేదు. వచ్చింది నకిలీ అధికారులని గుర్తించి తొలుత కొయ్యలగూడెం పోలీసు స్టేషన్లో, తర్వాత నల్లజర్ల ఠాణాలో ఫిర్యాదు చేశారు. పోలీసులు రెండు బృందాలుగా ఏర్పడి తనిఖీలు చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొల్లగొడుతున్న సైబర్ ముఠాలు
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి వ్యాపారి(40) వాట్సప్కు స్టాక్మార్కెట్ మెలకువలు నేర్పిస్తామంటూ మెసేజ్ వచ్చింది. ఆయన ఆసక్తి చూపడంతో ‘ఓక్ట్రీ క్యాపిటల్ గ్రూప్’ పేరిట ఉన్న వాట్సప్ గ్రూప్లో చేర్చారు. నిర్వాహకుల మాటలు నమ్మి వారు సూచించిన బ్యాంకు ఖాతాలోకి వ్యాపారి నగదు బదిలీ చేస్తూ వచ్చారు. -
శిర్డీ ఎక్స్ప్రెస్లో భారీ చోరీ
శిర్డీ ఎక్స్ప్రెస్లో గురువారం అర్ధరాత్రి దాటాక దొంగలు విరుచుకుపడ్డారు. ప్రయాణికుల విలువైన వస్తువులు దోచుకొని పారిపోయారు. శుక్రవారం తెల్లవారుజామున గుర్తించిన బాధితులు సికింద్రాబాద్ రైల్వేపోలీసులకు ఫిర్యాదు చేశారు. -
కొడవలితో కొడుకు ఛాతీని గాయపరిచిన తల్లిదండ్రులు
గుడుంబా మత్తులో మానవత్వం మరిచిన ఓ జంట కన్నకొడుకు ఛాతీని కొడవలితో కోసిన ఘటన మంచిర్యాల జిల్లా నెన్నెల మండల కేంద్రంలో గురువారం రాత్రి జరిగింది. -
ప్రతికూల వాతావరణంతో యువ సైనికుడి మృతి
సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలనే ఆ యువకుని తపన ఆదిలోనే ఆవిరైపోయింది. అనారోగ్యం బారినపడటంతో యువసైనికుడు గురువారం రాత్రి మృత్యువాత పడ్డారు. -
గురుకుల విద్యార్థి మృతి
జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ బాలుర గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థి అస్వస్థతకు గురై మృతి చెందాడు. అనంతరం మరో ఇద్దరు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. -
గంజాయి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడి.. సహకరించిన భార్య
న్యాయ విద్య చదువుకొని ఉన్నతంగా జీవించాల్సిన యువ దంపతులు గాడితప్పారు. గంజాయికి బానిసలై.. అడ్డదారులు తొక్కారు. సహచర విద్యార్థి అయిన యువతిని ఆ మత్తు ఊబిలోకి దించారు. -
విద్యార్థి ఉసురు తీసిన నాడు-నేడు పనులు
గత వైకాపా ప్రభుత్వ హయాంలో నాసిరకంగా చేపట్టిన నాడు-నేడు అదనపు తరగతి గదుల నిర్మాణ పనులు ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. లింటెల్, దానిపైన ఉన్న గోడ కూలి మీద పడటంతో ఓ విద్యార్థి మృతి చెందిన ఘటన నెల్లూరులో చోటుచేసుకుంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే