అమరేశ్వరాలయంలో చోరీ
పంచారామాల్లో ప్రథమ ఆరామంగా వెలుగొందుతున్న పల్నాడు జిల్లా అమరావతిలోని బాలచాముండికా సమేత అమరేశ్వరాలయంలో గురువారం అర్ధరాత్రి చోరీ జరిగింది.
హుండీ పగలగొట్టి నగదు దోచుకెళ్లిన దొంగ
అమరావతి, న్యూస్టుడే: పంచారామాల్లో ప్రథమ ఆరామంగా వెలుగొందుతున్న పల్నాడు జిల్లా అమరావతిలోని బాలచాముండికా సమేత అమరేశ్వరాలయంలో గురువారం అర్ధరాత్రి చోరీ జరిగింది. ఓ ఆగంతకుడు బాలచాముండికా అమ్మవారి ఆలయం ముందున్న హుండీ పగలగొట్టి అందులోని నగదు దోచుకెళ్లాడు. ఈ ఘటన సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైంది. అర్ధరాత్రి సమయంలో ఆలయానికి ఉత్తర దిక్కున కృష్ణా నది వైపు నుంచి గుర్తుతెలియని వ్యక్తి గోడదూకి ఆలయంలోని ధ్వజస్తంభం ముందున్న ప్రధాన ద్వారం ఇనుప గేటు వద్దకు చేరుకున్నాడు. తన వెంట తెచ్చుకున్న గడ్డపారతో గేటు తాళం పగలగొట్టి లోపలికి ప్రవేశించాడు. హుండీని గడ్డపారతో పగలగొట్టి అందులోని నగదు అపహరించుకుని వెళ్లిపోయాడు. శుక్రవారం ఉదయం ఆలయం తెరిచేందుకు వచ్చిన అర్చకులు గేటు తాళం పగలగొట్టి ఉండటాన్ని గమనించి ఈఓ గోపికి సమాచారం ఇచ్చారు. ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు వచ్చి ఆలయంలోని సీసీ కెమెరాలను పరిశీలించగా.. గుర్తుతెలియని వ్యక్తి చొరబడినట్లు గుర్తించారు. క్లూస్టీ రంగంలోకి దిగి ప్రాథమిక ఆధారాలు సేకరించింది. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు సీఐ బ్రహ్మం తెలిపారు. చోరీకి పాల్పడిన వ్యక్తిని పోలీసులు గుర్తించినట్లు, అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో డిసెంబరు 16 తర్వాత భక్తులు హుండీలో వేసిన నగదు అపహరణకు గురైంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొల్లగొడుతున్న సైబర్ ముఠాలు
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి వ్యాపారి(40) వాట్సప్కు స్టాక్మార్కెట్ మెలకువలు నేర్పిస్తామంటూ మెసేజ్ వచ్చింది. ఆయన ఆసక్తి చూపడంతో ‘ఓక్ట్రీ క్యాపిటల్ గ్రూప్’ పేరిట ఉన్న వాట్సప్ గ్రూప్లో చేర్చారు. నిర్వాహకుల మాటలు నమ్మి వారు సూచించిన బ్యాంకు ఖాతాలోకి వ్యాపారి నగదు బదిలీ చేస్తూ వచ్చారు. -
శిర్డీ ఎక్స్ప్రెస్లో భారీ చోరీ
శిర్డీ ఎక్స్ప్రెస్లో గురువారం అర్ధరాత్రి దాటాక దొంగలు విరుచుకుపడ్డారు. ప్రయాణికుల విలువైన వస్తువులు దోచుకొని పారిపోయారు. శుక్రవారం తెల్లవారుజామున గుర్తించిన బాధితులు సికింద్రాబాద్ రైల్వేపోలీసులకు ఫిర్యాదు చేశారు. -
కొడవలితో కొడుకు ఛాతీని గాయపరిచిన తల్లిదండ్రులు
గుడుంబా మత్తులో మానవత్వం మరిచిన ఓ జంట కన్నకొడుకు ఛాతీని కొడవలితో కోసిన ఘటన మంచిర్యాల జిల్లా నెన్నెల మండల కేంద్రంలో గురువారం రాత్రి జరిగింది. -
ప్రతికూల వాతావరణంతో యువ సైనికుడి మృతి
సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలనే ఆ యువకుని తపన ఆదిలోనే ఆవిరైపోయింది. అనారోగ్యం బారినపడటంతో యువసైనికుడు గురువారం రాత్రి మృత్యువాత పడ్డారు. -
గురుకుల విద్యార్థి మృతి
జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ బాలుర గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థి అస్వస్థతకు గురై మృతి చెందాడు. అనంతరం మరో ఇద్దరు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. -
గంజాయి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడి.. సహకరించిన భార్య
న్యాయ విద్య చదువుకొని ఉన్నతంగా జీవించాల్సిన యువ దంపతులు గాడితప్పారు. గంజాయికి బానిసలై.. అడ్డదారులు తొక్కారు. సహచర విద్యార్థి అయిన యువతిని ఆ మత్తు ఊబిలోకి దించారు. -
విద్యార్థి ఉసురు తీసిన నాడు-నేడు పనులు
గత వైకాపా ప్రభుత్వ హయాంలో నాసిరకంగా చేపట్టిన నాడు-నేడు అదనపు తరగతి గదుల నిర్మాణ పనులు ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. లింటెల్, దానిపైన ఉన్న గోడ కూలి మీద పడటంతో ఓ విద్యార్థి మృతి చెందిన ఘటన నెల్లూరులో చోటుచేసుకుంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్