నమ్మి ఆశ్రయిస్తే నకిలీ హాల్టికెట్ ఇచ్చాడు!
బద్ధకం.. కాలయాపన.. ఆపై నిర్లక్ష్యం.. నిర్భయం.. ఇవన్నీ ఒంటబట్టించుకున్న ఓ యువకుడు తను కటకటాల పాలవడమే కాకుండా తన బంధువును కష్టాల్లోకి నెట్టేశాడు.
నిందితుణ్ని అరెస్టు చేసిన పోలీసులు
చిత్తూరు (నేరవార్తలు), న్యూస్టుడే: బద్ధకం.. కాలయాపన.. ఆపై నిర్లక్ష్యం.. నిర్భయం.. ఇవన్నీ ఒంటబట్టించుకున్న ఓ యువకుడు తను కటకటాల పాలవడమే కాకుండా తన బంధువును కష్టాల్లోకి నెట్టేశాడు. చిత్తూరు జిల్లాలో గ్రూప్-2 పరీక్షకు నకిలీ హాల్ టికెట్ తయారు చేసిన నిందితుడి వ్యవహారమిది. ఏఎస్పీ ఆరీఫుల్లా మంగళవారం ఈ కేసు వివరాలు మీడియాకు వెల్లడించారు. కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం కంబాలపాడు గ్రామానికి చెందిన సుదర్శన్ గ్రూప్-2 పరీక్షకు సన్నద్ధమవుతున్నాడు. నోటిఫికేషన్ రావడంతో దరఖాస్తు చేసిపెట్టమని డోన్లో మీ-సేవ కేంద్రం నిర్వహిస్తున్న తన సమీప బంధువైన ఇమ్మానుయేల్ను ఆశ్రయించాడు. నగదు ఇచ్చి వివరాలు చెప్పి, దరఖాస్తు చేసి హాల్టికెట్ వచ్చాక పంపమని వెళ్లిపోయాడు. ఇమ్మానుయేల్ దరఖాస్తు చేయకుండా కాలయాపన చేశాడు.
పరీక్ష తేదీ సమీపించడంతో సుదర్శన్ ఇమ్మానుయేల్ను హాల్టికెట్ గురించి అడిగాడు. దరఖాస్తు పెట్టలేదని చెబితే గొడవవుతుందని భయపడ్డ ఇమ్మానుయేల్ నకిలీ హాల్టికెట్ తయారీకి సిద్ధపడ్డాడు. పరీక్ష కేంద్రం దూర ప్రాంతంలో పడినట్లు పెడితే.. సుదర్శన్ అక్కడకు వెళ్లలేడు కనుక సమస్య ఉండదని భావించాడు. అదే సమయంలో ఓ యువకుడు తన మీ-సేవ కేంద్రంలో హాల్టికెట్ డౌన్లోడ్ చేసుకుని వెళ్లగా, దాని కాపీ దాచిపెట్టి సుదర్శన్ వివరాలతో ‘ఎడిట్’ చేశాడు. పరీక్ష కేంద్రం కర్నూలుకు దూరంగా ఉండే చిత్తూరు నగరంగా మార్చి, హాల్టికెట్ ‘తయారుచేసి’ సుదర్శన్కు ఇచ్చాడు. అతడు ఆదివారం ఆదరాబాదరాగా చిత్తూరు చేరుకుని పరీక్ష కేంద్రం కోసం అధికారులను ఆశ్రయించగా హాల్టికెట్ నకిలీదని గుర్తించి పోలీసులకు తెలిపారు. వారు అతన్ని అదుపులోకి తీసుకుని విచారించారు. అతడు చెప్పిన వివరాలతో ఇమ్మానుయేల్ నిర్వాకాన్ని గుర్తించి అరెస్టు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొల్లగొడుతున్న సైబర్ ముఠాలు
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి వ్యాపారి(40) వాట్సప్కు స్టాక్మార్కెట్ మెలకువలు నేర్పిస్తామంటూ మెసేజ్ వచ్చింది. ఆయన ఆసక్తి చూపడంతో ‘ఓక్ట్రీ క్యాపిటల్ గ్రూప్’ పేరిట ఉన్న వాట్సప్ గ్రూప్లో చేర్చారు. నిర్వాహకుల మాటలు నమ్మి వారు సూచించిన బ్యాంకు ఖాతాలోకి వ్యాపారి నగదు బదిలీ చేస్తూ వచ్చారు. -
శిర్డీ ఎక్స్ప్రెస్లో భారీ చోరీ
శిర్డీ ఎక్స్ప్రెస్లో గురువారం అర్ధరాత్రి దాటాక దొంగలు విరుచుకుపడ్డారు. ప్రయాణికుల విలువైన వస్తువులు దోచుకొని పారిపోయారు. శుక్రవారం తెల్లవారుజామున గుర్తించిన బాధితులు సికింద్రాబాద్ రైల్వేపోలీసులకు ఫిర్యాదు చేశారు. -
కొడవలితో కొడుకు ఛాతీని గాయపరిచిన తల్లిదండ్రులు
గుడుంబా మత్తులో మానవత్వం మరిచిన ఓ జంట కన్నకొడుకు ఛాతీని కొడవలితో కోసిన ఘటన మంచిర్యాల జిల్లా నెన్నెల మండల కేంద్రంలో గురువారం రాత్రి జరిగింది. -
ప్రతికూల వాతావరణంతో యువ సైనికుడి మృతి
సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలనే ఆ యువకుని తపన ఆదిలోనే ఆవిరైపోయింది. అనారోగ్యం బారినపడటంతో యువసైనికుడు గురువారం రాత్రి మృత్యువాత పడ్డారు. -
గురుకుల విద్యార్థి మృతి
జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ బాలుర గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థి అస్వస్థతకు గురై మృతి చెందాడు. అనంతరం మరో ఇద్దరు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. -
గంజాయి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడి.. సహకరించిన భార్య
న్యాయ విద్య చదువుకొని ఉన్నతంగా జీవించాల్సిన యువ దంపతులు గాడితప్పారు. గంజాయికి బానిసలై.. అడ్డదారులు తొక్కారు. సహచర విద్యార్థి అయిన యువతిని ఆ మత్తు ఊబిలోకి దించారు. -
విద్యార్థి ఉసురు తీసిన నాడు-నేడు పనులు
గత వైకాపా ప్రభుత్వ హయాంలో నాసిరకంగా చేపట్టిన నాడు-నేడు అదనపు తరగతి గదుల నిర్మాణ పనులు ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. లింటెల్, దానిపైన ఉన్న గోడ కూలి మీద పడటంతో ఓ విద్యార్థి మృతి చెందిన ఘటన నెల్లూరులో చోటుచేసుకుంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు