దండకారణ్యంలో ఎదురుకాల్పులు.. నలుగురు మావోయిస్టుల మృతి
ఛత్తీస్గఢ్లో దండకారణ్య ప్రాంతం మంగళవారం మరోసారి తుపాకుల మోతతో దద్దరిల్లింది.
దుమ్ముగూడెం, న్యూస్టుడే: ఛత్తీస్గఢ్లో దండకారణ్య ప్రాంతం మంగళవారం మరోసారి తుపాకుల మోతతో దద్దరిల్లింది. బీజాపూర్ జిల్లాలో జంగ్లా పోలీస్స్టేషన్ పరిధిలోని బడే తుంగలి, ఛోటే తుంగలి గ్రామాల మధ్య అటవీ ప్రాంతంలోని రెండు ప్రదేశాల్లో జరిగిన ఎదురు కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఆ ప్రాంతంలో రెండు దళాలకు చెందిన మావోయిస్టు నాయకులు ప్రశాంత్, అనిల్ పునెమ్.. 40-50 మందితో సమావేశం నిర్వహించనున్నారని నిఘా వర్గాల ద్వారా సమాచారం అందడంతో భద్రతా బలగాలు సోమవారం నుంచి గాలింపు చర్యలు ప్రారంభించాయి. పోలీసులు రెండు బృందాలుగా కూంబింగ్ నిర్వహిస్తుండగా.. పసిగట్టిన మావోయిస్టులు మెరుపుదాడికి దిగారు. దీంతో రెండు చోట్లా డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ దళాలకు, మావోయిస్టులకు మధ్య రెండు గంటలసేపు కాల్పులు చోటుచేసుకున్నాయి. కొందరు మావోయిస్టులు తప్పించుకుపోయారు. అనంతరం పరిసర ప్రాంతాల్లో భద్రతా బలగాలు గాలించగా.. కొద్ది దూరంలో నలుగురు మావోయిస్టుల మృతదేహాలు లభ్యమయ్యాయి. సంఘటన స్థలం నుంచి మావోయిస్టులకు చెందిన తుపాకులు, పేలుడు పదార్థాలు, కిట్ బ్యాగులు, ఇతర సామగ్రిని భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. మృతి చెందిన మావోయిస్టుల వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.
‘మొన్నటి మృతులు మావోయిస్టులు కాదు.. రైతులు’
కంకెర్: రెండు రోజుల కిందట ఛత్తీస్గఢ్లో పోలీసుల కాల్పుల్లో మృతి చెందిన ముగ్గురు వ్యక్తులు మావోయిస్టులు కాదని, రైతులని వారి కుటుంబాలు ప్రకటించాయి. మృతులను మార్దా గ్రామానికి చెందిన రామేశ్వర్ నేగి, సురేష్, హిడ్కో పైర్వి గ్రామానికి చెందిన అనిల్ కుమార్గా గుర్తించారు. వారు పొలాల్లో పనిచేసుకునే రైతులని కుటుంబసభ్యులు చెబుతుండగా.. ఎస్పీ ఎలెసెల మాత్రం దీన్ని ఖండించారు. మావోయిస్టుల ఒత్తిడితోనే మృతుల కుటుంబ సభ్యులు అలా చెబుతున్నారని అన్నారు. ఈ ఘటనలో పోలీసుల తప్పేమీ లేదని, ఇందులో మావోయిస్టుల నాయకుడు రాజు సలాం, అతని దళం పాత్ర ఉందని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొల్లగొడుతున్న సైబర్ ముఠాలు
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి వ్యాపారి(40) వాట్సప్కు స్టాక్మార్కెట్ మెలకువలు నేర్పిస్తామంటూ మెసేజ్ వచ్చింది. ఆయన ఆసక్తి చూపడంతో ‘ఓక్ట్రీ క్యాపిటల్ గ్రూప్’ పేరిట ఉన్న వాట్సప్ గ్రూప్లో చేర్చారు. నిర్వాహకుల మాటలు నమ్మి వారు సూచించిన బ్యాంకు ఖాతాలోకి వ్యాపారి నగదు బదిలీ చేస్తూ వచ్చారు. -
శిర్డీ ఎక్స్ప్రెస్లో భారీ చోరీ
శిర్డీ ఎక్స్ప్రెస్లో గురువారం అర్ధరాత్రి దాటాక దొంగలు విరుచుకుపడ్డారు. ప్రయాణికుల విలువైన వస్తువులు దోచుకొని పారిపోయారు. శుక్రవారం తెల్లవారుజామున గుర్తించిన బాధితులు సికింద్రాబాద్ రైల్వేపోలీసులకు ఫిర్యాదు చేశారు. -
కొడవలితో కొడుకు ఛాతీని గాయపరిచిన తల్లిదండ్రులు
గుడుంబా మత్తులో మానవత్వం మరిచిన ఓ జంట కన్నకొడుకు ఛాతీని కొడవలితో కోసిన ఘటన మంచిర్యాల జిల్లా నెన్నెల మండల కేంద్రంలో గురువారం రాత్రి జరిగింది. -
ప్రతికూల వాతావరణంతో యువ సైనికుడి మృతి
సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలనే ఆ యువకుని తపన ఆదిలోనే ఆవిరైపోయింది. అనారోగ్యం బారినపడటంతో యువసైనికుడు గురువారం రాత్రి మృత్యువాత పడ్డారు. -
గురుకుల విద్యార్థి మృతి
జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ బాలుర గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థి అస్వస్థతకు గురై మృతి చెందాడు. అనంతరం మరో ఇద్దరు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. -
గంజాయి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడి.. సహకరించిన భార్య
న్యాయ విద్య చదువుకొని ఉన్నతంగా జీవించాల్సిన యువ దంపతులు గాడితప్పారు. గంజాయికి బానిసలై.. అడ్డదారులు తొక్కారు. సహచర విద్యార్థి అయిన యువతిని ఆ మత్తు ఊబిలోకి దించారు. -
విద్యార్థి ఉసురు తీసిన నాడు-నేడు పనులు
గత వైకాపా ప్రభుత్వ హయాంలో నాసిరకంగా చేపట్టిన నాడు-నేడు అదనపు తరగతి గదుల నిర్మాణ పనులు ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. లింటెల్, దానిపైన ఉన్న గోడ కూలి మీద పడటంతో ఓ విద్యార్థి మృతి చెందిన ఘటన నెల్లూరులో చోటుచేసుకుంది.