టీ కోసం వెళ్తే.. ప్రాణాలే పోయాయి..
అర్ధరాత్రి వేళ.. టీ తాగాలని బయలుదేరిన ఆ యువకులను మృత్యువు కబళించింది. ఆయిల్ ట్యాంకర్ రూపంలో దూసుకొచ్చి మూడు నిండు ప్రాణాలను బలిగొంది.
ఆయిల్ ట్యాంకరు ఢీకొని ముగ్గురి మృతి
పరారయ్యే యత్నంలో ట్యాంకరూ బోల్తా.. డ్రైవరు మృత్యువాత
జోగిపేట, న్యూస్టుడే: అర్ధరాత్రి వేళ.. టీ తాగాలని బయలుదేరిన ఆ యువకులను మృత్యువు కబళించింది. ఆయిల్ ట్యాంకర్ రూపంలో దూసుకొచ్చి మూడు నిండు ప్రాణాలను బలిగొంది. మరో యువకుడిని ఆసుపత్రి పాలుజేసింది. తర్వాత ట్యాంకర్ డ్రైవర్ భయంతో మరింత వేగంగా నడపడంతో అది అదుపు తప్పి బోల్తా పడడంతో అతడు కూడా ప్రాణాలు కోల్పోయాడు. సంగారెడ్డి జిల్లా అందోలు మండలంలోని మాసానిపల్లి శివారులో ఎన్హెచ్ 161 సర్వీసు రోడ్డుపై సోమవారం అర్ధరాత్రి ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. జోగిపేట పట్టణానికి చెందిన ముఖరం (26), హాజీ (26), వాజీద్ (29), రిజ్వాన్, అర్షద్, షంషు రాత్రివేళ టీ తాగేందుకు కారులో చౌటకూరు మండల కేంద్రంలోని జాతీయ రహదారిపైనున్న హోటల్కు వెళ్లారు. అది మూసి ఉండడంతో అదే మార్గంలో అందోలు మండలంలోని సంగుపేట శివారులో ఉన్న సర్వీసు రోడ్డు మీదుగా డాకూరు దగ్గరున్న హోటల్కు బయలుదేరారు. దారిలో మాసానిపల్లి శివారులోని అండర్పాస్ వద్ద కారు నిలిపి.. ముఖరం, హాజీ, వాజీద్, రిజ్వాన్ మూత్రవిసర్జనకు కిందకు దిగారు. ఆ సమయంలో హైదరాబాద్ నుంచి నాందేడ్ వైపు వెళుతున్న ఆయిల్ ట్యాంకరు అతివేగంగా రోడ్డు పక్కన ఆగి ఉన్న నలుగురితోపాటు కారును ఢీకొంది. ప్రమాదంలో ముఖరం, హాజీ, వాజీద్ అక్కడికక్కడే మృతిచెందారు. రిజ్వాన్ను హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కారు వెనుక భాగం నుజ్జయింది. అర్షద్, షంషు కారులోనే ఉన్నా.. ముందువైపు కూర్చోవడంతో సురక్షితంగా బయటపడ్డారు. యువకులను ఢీకొట్టి వేగంగా వెళ్లిన ఆయిల్ ట్యాంకర్ అల్లాదుర్గం శివారులో బోల్తాపడడంతో దాని డ్రైవర్ కియారాం (25) మృతి చెందినట్లు ఎస్సై అరుణ్కుమార్ తెలిపారు. ట్యాంకర్ను ఎవరైనా గుర్తిస్తారన్న భయంతో డ్రైవర్ వేగంగా పరారవ్వాలన్న ప్రయత్నంలో అదుపుతప్పి ఉండొచ్చని అన్నారు. కియారాంను రాజస్థాన్కు చెందిన వ్యక్తిగా గుర్తించామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొల్లగొడుతున్న సైబర్ ముఠాలు
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి వ్యాపారి(40) వాట్సప్కు స్టాక్మార్కెట్ మెలకువలు నేర్పిస్తామంటూ మెసేజ్ వచ్చింది. ఆయన ఆసక్తి చూపడంతో ‘ఓక్ట్రీ క్యాపిటల్ గ్రూప్’ పేరిట ఉన్న వాట్సప్ గ్రూప్లో చేర్చారు. నిర్వాహకుల మాటలు నమ్మి వారు సూచించిన బ్యాంకు ఖాతాలోకి వ్యాపారి నగదు బదిలీ చేస్తూ వచ్చారు. -
శిర్డీ ఎక్స్ప్రెస్లో భారీ చోరీ
శిర్డీ ఎక్స్ప్రెస్లో గురువారం అర్ధరాత్రి దాటాక దొంగలు విరుచుకుపడ్డారు. ప్రయాణికుల విలువైన వస్తువులు దోచుకొని పారిపోయారు. శుక్రవారం తెల్లవారుజామున గుర్తించిన బాధితులు సికింద్రాబాద్ రైల్వేపోలీసులకు ఫిర్యాదు చేశారు. -
కొడవలితో కొడుకు ఛాతీని గాయపరిచిన తల్లిదండ్రులు
గుడుంబా మత్తులో మానవత్వం మరిచిన ఓ జంట కన్నకొడుకు ఛాతీని కొడవలితో కోసిన ఘటన మంచిర్యాల జిల్లా నెన్నెల మండల కేంద్రంలో గురువారం రాత్రి జరిగింది. -
ప్రతికూల వాతావరణంతో యువ సైనికుడి మృతి
సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలనే ఆ యువకుని తపన ఆదిలోనే ఆవిరైపోయింది. అనారోగ్యం బారినపడటంతో యువసైనికుడు గురువారం రాత్రి మృత్యువాత పడ్డారు. -
గురుకుల విద్యార్థి మృతి
జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ బాలుర గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థి అస్వస్థతకు గురై మృతి చెందాడు. అనంతరం మరో ఇద్దరు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. -
గంజాయి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడి.. సహకరించిన భార్య
న్యాయ విద్య చదువుకొని ఉన్నతంగా జీవించాల్సిన యువ దంపతులు గాడితప్పారు. గంజాయికి బానిసలై.. అడ్డదారులు తొక్కారు. సహచర విద్యార్థి అయిన యువతిని ఆ మత్తు ఊబిలోకి దించారు. -
విద్యార్థి ఉసురు తీసిన నాడు-నేడు పనులు
గత వైకాపా ప్రభుత్వ హయాంలో నాసిరకంగా చేపట్టిన నాడు-నేడు అదనపు తరగతి గదుల నిర్మాణ పనులు ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. లింటెల్, దానిపైన ఉన్న గోడ కూలి మీద పడటంతో ఓ విద్యార్థి మృతి చెందిన ఘటన నెల్లూరులో చోటుచేసుకుంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్