డ్రగ్స్ సరఫరాదారు అరెస్టు
హైదరాబాద్లోని రాడిసన్ హోటల్ కేంద్రంగా జరిగిన డ్రగ్స్ పార్టీ వ్యవహారంలో సరఫరాదారు అబ్బాస్ అలీ జాఫ్రీని సైబరాబాద్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు.
వివేకానంద్కు రాడిసన్ హోటల్లో 10 సార్లు కొకైన్ అందించినట్లు గుర్తింపు
పరారీలో ఉన్న వారి కోసం పోలీసుల గాలింపు
ఈనాడు - హైదరాబాద్, మాదాపూర్, న్యూస్టుడే: హైదరాబాద్లోని రాడిసన్ హోటల్ కేంద్రంగా జరిగిన డ్రగ్స్ పార్టీ వ్యవహారంలో సరఫరాదారు అబ్బాస్ అలీ జాఫ్రీని సైబరాబాద్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. హోటల్ నిర్వాహకులపైనా కేసులు నమోదు చేయాలని నిర్ణయించారు. అక్కడ కొన్ని సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో పార్టీకి గతంలో ఎవరెవరు వెళ్లారు తదితర ఆధారాలు సేకరించేందుకు ఇబ్బందిగా మారింది.
వారిద్దరి మధ్య లావాదేవీల పరిశీలన
గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్లో డ్రగ్స్ పార్టీ నిర్వహించారనే సమాచారంతో ఆదివారం అర్ధరాత్రి తర్వాత మాదాపూర్ ఎస్వోటీ, గచ్చిబౌలి పోలీసులు సోదాలు చేసి మంజీరా గ్రూపు సంస్థల డైరెక్టర్ గజ్జల వివేకానంద్, నిర్భయ్, కేదార్నాథ్ను అరెస్టు చేశారు. పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేసిన క్రమంలో సినీ దర్శకుడు క్రిష్(జాగర్లమూడి రాధాకృష్ణ) పేరు వెలుగులోకి వచ్చింది. ప్రధాన నిందితుడు గజ్జల వివేకానంద్ ఇచ్చిన వాంగ్మూలంలో క్రిష్ హాజరైనట్లు చెప్పాడని పోలీసులు తెలిపారు. దర్శకుడి పేరు ఎఫ్ఐఆర్లో చేర్చామని.. ఫోన్లో సంప్రదించి విచారణకు రావాలని కోరామని మాదాపూర్ డీసీపీ వినీత్ మంగళవారం విలేకరులకు తెలియజేశారు. విచారణకు ఎప్పుడు పిలిచినా హాజరవుతానని క్రిష్ బదులిచ్చారని, వైద్య పరీక్షలు నిర్వహించాక వాస్తవాలు వెలుగులోకి వస్తాయని పేర్కొన్నారు. ఈ పార్టీలో పాల్గొన్న రఘుచరణ్ బెంగళూరులో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మిగిలిన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. డ్రగ్స్ సరఫరాదారు అబ్బాస్ అలీ జాఫ్రీ గతంలో మంజీరా గ్రూపు సంస్థలో పనిచేశాడు. ఆ పరిచయంతోనే వివేకానంద్ డ్రగ్స్ తెప్పించుకుంటున్నట్లు తేలింది. వీరిద్దరి మధ్య జరిగిన లావాదేవీలను గుర్తించారు.
గతేడాది నుంచి..
పోలీసుల దర్యాప్తులో వెల్లడైన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్లో నివసించే వివేకానంద్ గతేడాది నుంచి డ్రగ్స్కు అలవాటుపడ్డాడు. అతడు అబ్బాస్ను సంప్రదించి నేరుగా రాడిసన్ హోటల్కు ప్రతిసారీ 4 గ్రాముల చొప్పున ఇప్పటివరకూ 10 సార్లు డ్రగ్స్ తెప్పించుకున్నాడని పోలీసుల విచారణలో తేలింది. గ్రాము కొకైన్ రూ.14 వేల చొప్పున అబ్బాస్ నుంచి కొనేవాడు. ఇతడు డ్రగ్స్ వినియోగించడంతోపాటు ఎవరికైనా విక్రయిస్తున్నాడా అనే అంశంపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొల్లగొడుతున్న సైబర్ ముఠాలు
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి వ్యాపారి(40) వాట్సప్కు స్టాక్మార్కెట్ మెలకువలు నేర్పిస్తామంటూ మెసేజ్ వచ్చింది. ఆయన ఆసక్తి చూపడంతో ‘ఓక్ట్రీ క్యాపిటల్ గ్రూప్’ పేరిట ఉన్న వాట్సప్ గ్రూప్లో చేర్చారు. నిర్వాహకుల మాటలు నమ్మి వారు సూచించిన బ్యాంకు ఖాతాలోకి వ్యాపారి నగదు బదిలీ చేస్తూ వచ్చారు. -
శిర్డీ ఎక్స్ప్రెస్లో భారీ చోరీ
శిర్డీ ఎక్స్ప్రెస్లో గురువారం అర్ధరాత్రి దాటాక దొంగలు విరుచుకుపడ్డారు. ప్రయాణికుల విలువైన వస్తువులు దోచుకొని పారిపోయారు. శుక్రవారం తెల్లవారుజామున గుర్తించిన బాధితులు సికింద్రాబాద్ రైల్వేపోలీసులకు ఫిర్యాదు చేశారు. -
కొడవలితో కొడుకు ఛాతీని గాయపరిచిన తల్లిదండ్రులు
గుడుంబా మత్తులో మానవత్వం మరిచిన ఓ జంట కన్నకొడుకు ఛాతీని కొడవలితో కోసిన ఘటన మంచిర్యాల జిల్లా నెన్నెల మండల కేంద్రంలో గురువారం రాత్రి జరిగింది. -
ప్రతికూల వాతావరణంతో యువ సైనికుడి మృతి
సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలనే ఆ యువకుని తపన ఆదిలోనే ఆవిరైపోయింది. అనారోగ్యం బారినపడటంతో యువసైనికుడు గురువారం రాత్రి మృత్యువాత పడ్డారు. -
గురుకుల విద్యార్థి మృతి
జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ బాలుర గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థి అస్వస్థతకు గురై మృతి చెందాడు. అనంతరం మరో ఇద్దరు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. -
గంజాయి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడి.. సహకరించిన భార్య
న్యాయ విద్య చదువుకొని ఉన్నతంగా జీవించాల్సిన యువ దంపతులు గాడితప్పారు. గంజాయికి బానిసలై.. అడ్డదారులు తొక్కారు. సహచర విద్యార్థి అయిన యువతిని ఆ మత్తు ఊబిలోకి దించారు. -
విద్యార్థి ఉసురు తీసిన నాడు-నేడు పనులు
గత వైకాపా ప్రభుత్వ హయాంలో నాసిరకంగా చేపట్టిన నాడు-నేడు అదనపు తరగతి గదుల నిర్మాణ పనులు ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. లింటెల్, దానిపైన ఉన్న గోడ కూలి మీద పడటంతో ఓ విద్యార్థి మృతి చెందిన ఘటన నెల్లూరులో చోటుచేసుకుంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే
-
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి