కరీంనగర్లో భూ దందా.. మరో ముగ్గురు కార్పొరేటర్ల భర్తలపై కేసులు
కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో భూ దందాకు సంబంధించి బుధవారం మరో ముగ్గురు మహిళా కార్పొరేటర్ల భర్తలపై కరీంనగర్ రూరల్ పోలీస్స్టేషన్లో కేసులు నమోదయ్యాయి.
ఈనాడు, కరీంనగర్: కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో భూ దందాకు సంబంధించి బుధవారం మరో ముగ్గురు మహిళా కార్పొరేటర్ల భర్తలపై కరీంనగర్ రూరల్ పోలీస్స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. నగరపాలక సంస్థ పరిధిలోని తీగలగుట్టపల్లిలో తాము కొనుగోలు చేసిన ప్లాట్లకు సంబంధించి భారాస కార్పొరేటర్ల భర్తలైన ఎడ్ల అశోక్, కాశెట్టి శ్రీనివాస్, తులా బాలయ్యలు డబ్బులు డిమాండ్ చేశారని పలువురు బాధితులు ఇటీవల సీపీ అభిషేక్ మహంతికి ఫిర్యాదు చేశారు. ఆ ప్లాట్లను శ్మశానవాటికకు ఉపయోగిస్తామని బెదిరించారని, ప్రహరీని కూల్చివేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సీపీ ఆదేశాల మేరకు ముగ్గురు నిందితులపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు రూరల్ సీఐ ప్రదీప్ తెలిపారు. వారిని బుధవారం సాయంత్రం న్యాయస్థానంలో హాజరుపరిచారు. రిమాండ్ విధించాలన్న పోలీసుల వినతిని ప్రిన్సిపల్ జుడిషియల్ మెజిస్ట్రేట్ తిరస్కరించారు. నిందితులకు 41 సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు.
ఈ వ్యవహారంలో ఇప్పటికే ఇద్దరు కార్పొరేటర్లు తోట రాములు, జంగిలి సాగర్ అరెస్టయి జైలుకు వెళ్లారు. కార్పొరేటర్ల భర్తలు కోల ప్రశాంత్, సుధగోని కృష్ణాగౌడ్లు జుడిషియల్ రిమాండ్లో ఉన్నారు. తాజాగా మరో ముగ్గురిపై కేసులు నమోదు కావడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొల్లగొడుతున్న సైబర్ ముఠాలు
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి వ్యాపారి(40) వాట్సప్కు స్టాక్మార్కెట్ మెలకువలు నేర్పిస్తామంటూ మెసేజ్ వచ్చింది. ఆయన ఆసక్తి చూపడంతో ‘ఓక్ట్రీ క్యాపిటల్ గ్రూప్’ పేరిట ఉన్న వాట్సప్ గ్రూప్లో చేర్చారు. నిర్వాహకుల మాటలు నమ్మి వారు సూచించిన బ్యాంకు ఖాతాలోకి వ్యాపారి నగదు బదిలీ చేస్తూ వచ్చారు. -
శిర్డీ ఎక్స్ప్రెస్లో భారీ చోరీ
శిర్డీ ఎక్స్ప్రెస్లో గురువారం అర్ధరాత్రి దాటాక దొంగలు విరుచుకుపడ్డారు. ప్రయాణికుల విలువైన వస్తువులు దోచుకొని పారిపోయారు. శుక్రవారం తెల్లవారుజామున గుర్తించిన బాధితులు సికింద్రాబాద్ రైల్వేపోలీసులకు ఫిర్యాదు చేశారు. -
కొడవలితో కొడుకు ఛాతీని గాయపరిచిన తల్లిదండ్రులు
గుడుంబా మత్తులో మానవత్వం మరిచిన ఓ జంట కన్నకొడుకు ఛాతీని కొడవలితో కోసిన ఘటన మంచిర్యాల జిల్లా నెన్నెల మండల కేంద్రంలో గురువారం రాత్రి జరిగింది. -
ప్రతికూల వాతావరణంతో యువ సైనికుడి మృతి
సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలనే ఆ యువకుని తపన ఆదిలోనే ఆవిరైపోయింది. అనారోగ్యం బారినపడటంతో యువసైనికుడు గురువారం రాత్రి మృత్యువాత పడ్డారు. -
గురుకుల విద్యార్థి మృతి
జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ బాలుర గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థి అస్వస్థతకు గురై మృతి చెందాడు. అనంతరం మరో ఇద్దరు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. -
గంజాయి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడి.. సహకరించిన భార్య
న్యాయ విద్య చదువుకొని ఉన్నతంగా జీవించాల్సిన యువ దంపతులు గాడితప్పారు. గంజాయికి బానిసలై.. అడ్డదారులు తొక్కారు. సహచర విద్యార్థి అయిన యువతిని ఆ మత్తు ఊబిలోకి దించారు. -
విద్యార్థి ఉసురు తీసిన నాడు-నేడు పనులు
గత వైకాపా ప్రభుత్వ హయాంలో నాసిరకంగా చేపట్టిన నాడు-నేడు అదనపు తరగతి గదుల నిర్మాణ పనులు ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. లింటెల్, దానిపైన ఉన్న గోడ కూలి మీద పడటంతో ఓ విద్యార్థి మృతి చెందిన ఘటన నెల్లూరులో చోటుచేసుకుంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే
-
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి