తాగునీళ్లడిగితే.. ట్రాక్టరుతో తొక్కించి చంపాడు
వైకాపా దురాగతానికి మరో ప్రాణం బలైపోయింది. నీళ్లు పట్టుకోడానికి వచ్చిన ఓ ఎస్టీ మహిళను ట్రాక్టరుతో ఢీకొట్టి చంపాడొక నాయకుడి అనుచరుడు.
వైకాపా సర్పంచి అనుచరుడి దురాగతం
తీవ్ర రక్తస్రావంతో అక్కడికక్కడే మృతి చెందిన ఎస్టీ మహిళ
మాచర్ల నియోజకవర్గంలో మరో అరాచకం
ఈనాడు డిజిటల్, నరసరావుపేట: వైకాపా దురాగతానికి మరో ప్రాణం బలైపోయింది. నీళ్లు పట్టుకోడానికి వచ్చిన ఓ ఎస్టీ మహిళను ట్రాక్టరుతో ఢీకొట్టి చంపాడొక నాయకుడి అనుచరుడు. ‘ఇది వైకాపా ట్యాంకు.. మా పార్టీ వారే తాగునీరు పట్టుకోవాలి.. వేరేవారు పట్టుకోవడానికి వీల్లేదు’ అన్నందుకు ఎదురు ప్రశ్నించడమే ఆ మహిళ తప్పయింది. నన్నే ఎదిరిస్తావా? నీ సంగతి చూస్తా అంటూ వైకాపా సర్పంచి అనుచరుడు అందరూ చూస్తుండగానే మూడుసార్లు ట్రాక్టర్తో ఢీకొట్టాడు. తీవ్ర రక్తస్రావంతో ఆమె అక్కడే పడిపోయింది. ఆసుపత్రికి తీసుకెళ్లే క్రమంలో మృతిచెందింది. ఈ హృదయవిదారక ఘటన పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం రెంటచింతల మండలం మల్లవరంలో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామస్థులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం... మల్లవరం తండాలో వారం రోజులుగా తాగునీటి సమస్య వేధిస్తోంది. దీంతో వైకాపాకు చెందిన సర్పంచ్ షేక్ నన్నే సాహెబ్ నాలుగు రోజులుగా ట్రాక్టర్లతో తాగునీటిని సరఫరా చేయిస్తున్నారు.
శుక్రవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో మల్లవరం తండా కాలనీకి ట్రాక్టర్ ట్యాంకరు వచ్చింది. మహిళలంతా నీరు పట్టుకోవడానికి ఎగబడగా.. మీరు తెదేపాకు చెందిన వారు.. మా పార్టీ అందించే నీరు ఎందుకు పట్టుకుంటున్నారని ట్రాక్టర్ డ్రైవర్, సర్పంచి అనుచరుడు మణికంఠ నాయక్ అడ్డుపడ్డాడు. బిందెలతో నిల్చున్న బాణావత్ సామునిబాయ్(50).. ‘మా ఇంట్లో బిందె నీరు కూడా లేదు. తాగునీటికి పార్టీలకు సంబంధం ఏంటి? మానవత్వం లేకుండా మాట్లాడుతున్నారు’ అంటూ నిలదీసింది. దీంతో డ్రైవర్ మమ్మల్నే ప్రశ్నిస్తారా? అంటూ ట్రాక్టర్ను ఆవిడ కాళ్లపైకి పోనిచ్చాడు. ఇలా మూడుసార్లు మీదకి పోనీయడంతో రక్తగాయాలతో అక్కడే పడిపోయింది. ట్రాక్టర్ ముందువైపు బంపర్ ఆమె పొట్టలో గట్టిగా తగిలింది. వెనుకవైపు గోడ ఉండటంతో ఆమె తప్పించుకునేందుకు వీల్లేకుండా పోయింది. ట్రాక్టరుతో కాళ్లపై తొక్కించడంతో సామునిబాయ్ తీవ్రంగా గాయపడింది.
వెంటనే ఆమె బంధువులు మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందింది. మృతురాలికి దివ్యాంగుడైన భర్త, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. పిల్లలందరూ వివాహితులే. వ్యవసాయ కూలీగా జీవనం పొందేది. మృతురాలి కుటుంబానికి గతంలోనూ మణికంఠ కుటుంబంతో గొడవలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే మంచినీటి కోసం నిలదీసినప్పుడు కోపంతో ట్రాక్టర్ మీదకు ఎక్కించారనే ఆరోపణలు ఉన్నాయి. తాగునీరు అడిగితే చంపేస్తారా? అని కుటుంబసభ్యులు వైకాపా నేతలను నిలదీస్తున్నారు. ఉద్దేశపూర్వకంగా ట్రాక్టర్ ఎక్కించి చంపేశాడని మృతురాలి బంధువులు మాచర్ల ఆసుపత్రి వద్ద ఆవేదన వ్యక్తం చేశారు.
పోలీసుల కథనం ప్రకారం..
సామునిబాయ్.. పంచాయతీ ట్యాంకులో మోటార్ వేసి నీళ్లు పట్టుకోవడానికి స్విచ్బోర్డు వద్ద ఉంది. ఈ క్రమంలో డ్రైవర్ చూసుకోకుండా ట్రాక్టర్ మలుపు తిప్పుతుండగా సామునిబాయ్ కాళ్లపైకి టైరు వెళ్లింది. దీనిని గుర్తించి కంగారులో మరో రెండుసార్లు పోనిచ్చాడు. అతనికి సరిగా డ్రైవింగ్ రాదని, ప్రమాదవశాత్తే ఘటన జరిగిందని రెంటచింతల ఎస్సై నారాయణరెడ్డి తెలిపారు. కేసును విచారిస్తున్నామని, పూర్తి వివరాలు దర్యాప్తులో తేలతాయన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల కేసు నిందితుడు మృతి
దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల కేసు నిందితుడు మృతి చెందాడు. ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్రవాది సయ్యద్ మక్బూల్ (52) చర్లపల్లి జైలులో ఖైదీగా ఉన్నాడు. -
షిర్డీ నుంచి కాకినాడ వెళ్తున్న రైలులో చోరీ
షిర్డీ నుంచి కాకినాడ వెళ్తున్న రైలులో చోరీ జరిగింది. మూడు బోగీల్లో దుండగులు దోపిడీకి పాల్పడ్డారు. -
ఆగస్టులో పెళ్లి.. అంతలోనే కాటేసిన విధి!
తల్లిదండ్రులు ఆగస్టులో తమ పెద్ద కొడుకు పెళ్లి చేద్దామనుకున్నారు. అంతలోపే విధి చెట్టు రూపంలో కాటేసి కానరాని లోకాలకు తీసుకెళ్లింది. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఓ చెట్టు కూలి మీద పడడంతో యువకుడు మృతి చెందిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. -
చిట్టీల పేరుతో మోసం.. ప్రభుత్వ ఉపాధ్యాయురాలు, భర్త అరెస్టు
అక్రమంగా చిట్టీలు నడుపుతూ.. గడువు ముగిసినా డబ్బులు చెల్లించకుండా మోసం చేసిన కేసులో పోలీసులు ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలిని, ఆమె భర్తను అరెస్టు చేశారు. గురువారం హసన్పర్తి ఠాణాలో ఎస్సై దేవేందర్తో కలిసి సీఐ జె.సురేశ్ మీడియాకు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి.. -
మల ద్వారంలోకి గాలి పంపింగ్.. యువకుడి పరిస్థితి విషమం
స్నేహితుల సరదా ఓ యువకుడి ప్రాణం మీదకు తెచ్చింది. మెకానిక్ షెడ్డు వద్ద మల ద్వారంలోకి గాలి పంపింగ్ చేయడంతో పరిస్థితి విషమంగా మారింది. హనుమకొండ జిల్లా ఐనవోలు మండల కేంద్రంలో నాలుగు రోజుల కిందట జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. -
ఎదురుకాల్పుల్లో మావోయిస్టు మృతి
ములుగు-భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల సరిహద్దుల్లోని అడవుల్లో గురువారం జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ మావోయిస్టు మృతి చెందాడు. -
బాలుడిని బలిగొన్న టైరు.. ఓఆర్ఆర్పై మూత్రవిసర్జన చేస్తుండగా ఘటన
అవుటర్ రింగు రోడ్డుపై ఓ బాలుడు మూత్ర విసర్జన చేస్తుండగా ఎక్కడి నుంచో దొర్లుకుంటూ వచ్చిన టైరు తగిలి తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతిచెందాడు. -
లంచం తీసుకుంటూ అనిశాకు చిక్కిన ప్రభుత్వాధికారులు
లంచం తీసుకుంటూ అనిశా వలకు చిక్కారు ఇద్దరు ప్రభుత్వాధికారులు. వివరాల్లోకి వెళ్తే..హనుమకొండ జిల్లా పరకాల మున్సిపాలిటీ పరిధిలోని సీతారాంపురం గ్రామానికి చెందిన లడె రాజేశ్వర్రావు పేరిట ఉన్న 1,173 చదరపు గజాల స్థలం ఉంది. -
గ్యాస్ లీకై.. ప్రయాణికులతో వెళ్తున్న ఆటో దగ్ధం
ప్రయాణికులతో వెళ్తున్న ఆటో దగ్ధం కావడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. విజయవాడలోని మహాత్మాగాంధీ రోడ్డులో ఈ ఘటన చోటుచేసుకుంది. -
మహిళను వివస్త్రను చేసి చిత్రహింసలు
సభ్యసమాజం తలదించుకునేలా ఓ గిరిజన మహిళను చెట్టుకు కట్టేసి, వివస్త్రను చేసి చితకబాదిన సంఘటన అన్నమయ్య జిల్లా వీరబల్లి మండలంలో చోటుచేసుకుంది. -
వినుకొండ హత్యకేసులో మరో ఆరుగురి అరెస్టు
పల్నాడు జిల్లా వినుకొండలో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రషీద్ హత్యకేసులో మరో ఆరుగురిని పోలీసులు గురువారం అరెస్టుచేశారు. వినుకొండ పట్టణ పోలీసుస్టేషన్లో సీఐ సాంబశివరావు విలేకరులతో మాట్లాడుతూ వివరాలు వెల్లడించారు. -
తుపాకీ గురిపెట్టి బాలికపై అత్యాచారం!
దేశ రాజధానిలో దారుణం చోటుచేసుకుంది. పొరుగింటి వ్యక్తి తుపాకీ గురిపెట్టి ఓ బాలికపై అత్యాచారం చేయడమే కాకుండా ఐదంతస్తుల భవనంపై నుంచి తోసేశాడు. -
కారు దిగి నడుస్తూ వెళ్లి.. ‘అటల్ సేతు’ పైనుంచి దూకేసిన టెకీ.. వీడియో
కారు దిగి అలా నడుచుకుంటూ వెళ్లిన ఓ టెకీ.. ముంబయిలోని అటల్ సేతు పైనుంచి కిందకు దూకేశాడు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
సోషల్ మీడియా వీడియోల పిచ్చి ముదిరి.. రైలును పట్టాలు తప్పించి..!
-
ఆ ప్రాజెక్ట్కు ఓకే చెప్పినందుకు బాధపడ్డా: టబు
-
నాలుగు సంవత్సరాలు ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నా: నాగ్ అశ్విన్
-
చర్చకు సిద్ధమేనన్న కమలాహారిస్.. అప్పటివరకు వద్దన్న ట్రంప్
-
కార్గిల్ 25వ విజయ్ దివస్.. యుద్ధ స్మారకం వద్ద మోదీ నివాళులు
-
జోబైడెన్ మెదడు అద్భుతంగా పనిచేస్తోంది: శ్వేతసౌధం డాక్టర్ల సర్టిఫికెట్