‘గ్రూప్-1’ ఉద్యోగాల పేరిట టోకరా!
నిరుద్యోగుల బలహీనతలను ఆసరాగా చేసుకొన్న ఓ ముఠా ‘గ్రూప్-1’ ఉద్యోగాల పేరుతో పలువురికి టోకరా వేసిన వైనం వెలుగులోకి వచ్చింది.
నలుగురు సభ్యుల ముఠా మోసం
మాజీ పోలీసు అధికారి కుటుంబం వద్ద రూ. 2.50 కోట్ల వసూలు
వరంగల్ క్రైం, న్యూస్టుడే: నిరుద్యోగుల బలహీనతలను ఆసరాగా చేసుకొన్న ఓ ముఠా ‘గ్రూప్-1’ ఉద్యోగాల పేరుతో పలువురికి టోకరా వేసిన వైనం వెలుగులోకి వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా రూ.కోట్లలో వసూలు చేసినట్లు వరంగల్ పోలీసులు గుర్తించారు. ఈ మేరకు వరంగల్కు చెందిన ఇద్దరు, హైదరాబాద్కు చెందిన ఇద్దరు (వీరిలో ఓ మహిళ) కలిసి ముఠాగా ఏర్పడ్డారు. తమకు టీఎస్పీఎస్సీ ఉన్నతాధికారులతో పరిచయాలున్నాయని, ‘గ్రూప్-1’ పరీక్ష మొదలుకొని ఉద్యోగం వచ్చేవరకు అన్నీ తాము చూసుకుంటామని చెప్పి పలువురిని నమ్మించి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేశారు. పోలీసు అధికారి పోస్టులు సైతం ఇప్పించామని ముఠా సభ్యులు ప్రచారం చేసుకున్నారు. పోలీసు ఉన్నతాధికారులతో కలిసి ఉన్న ఫొటోలను చూపిస్తూ పలువురిని నమ్మించారు. ప్రస్తుతం పరారీలో ఉన్న ఈ ముఠా సభ్యుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో పనిచేసి ఉద్యోగ విరమణ పొంది, కరోనా సమయంలో మృతిచెందిన ఓ పోలీసు అధికారి కుమారుడికి గ్రూప్-1 డీఎస్పీ ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించిన ముఠా.. ఆ కుటుంబ సభ్యుల నుంచి ఏడాది కిందట దశల వారీగా రూ.2.50 కోట్లు వసూలు చేసింది. అయితే ఉద్యోగం రాకపోవడంతో ఆ కుటుంబ సభ్యులు నిలదీయగా ముఠా సభ్యులు తప్పించుకు తిరుగుతున్నారు. దీంతో విశ్రాంత పోలీసు అధికారి కుటుంబ సభ్యులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై విచారణ చేసి, తగిన చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశించడంతో ఈ ముఠా వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
పోలీసుల దర్యాప్తు..
పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాలతో వరంగల్ కమిషనరేట్లోని ప్రత్యేక విభాగం దీనిపై దర్యాప్తు ప్రారంభించింది. ఈ కేసును ఏసీపీ స్థాయి అధికారి పర్యవేక్షణలో అత్యంత రహస్యంగా విచారణ చేస్తున్నారు. నిందితులు నలుగురూ ఇటు వరంగల్, అటు హైదరాబాద్లో కూడా లేరని, ఇతర రాష్ట్రాలకు పారిపోయి ఉంటారని భావిస్తున్నారు. వారిని పట్టుకుంటే ఎంతమంది నుంచి ఎంత డబ్బు వసూలు చేశారు? వారి వెనుక ఇంకా ఎవరున్నారో తెలుస్తుందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొల్లగొడుతున్న సైబర్ ముఠాలు
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి వ్యాపారి(40) వాట్సప్కు స్టాక్మార్కెట్ మెలకువలు నేర్పిస్తామంటూ మెసేజ్ వచ్చింది. ఆయన ఆసక్తి చూపడంతో ‘ఓక్ట్రీ క్యాపిటల్ గ్రూప్’ పేరిట ఉన్న వాట్సప్ గ్రూప్లో చేర్చారు. నిర్వాహకుల మాటలు నమ్మి వారు సూచించిన బ్యాంకు ఖాతాలోకి వ్యాపారి నగదు బదిలీ చేస్తూ వచ్చారు. -
శిర్డీ ఎక్స్ప్రెస్లో భారీ చోరీ
శిర్డీ ఎక్స్ప్రెస్లో గురువారం అర్ధరాత్రి దాటాక దొంగలు విరుచుకుపడ్డారు. ప్రయాణికుల విలువైన వస్తువులు దోచుకొని పారిపోయారు. శుక్రవారం తెల్లవారుజామున గుర్తించిన బాధితులు సికింద్రాబాద్ రైల్వేపోలీసులకు ఫిర్యాదు చేశారు. -
కొడవలితో కొడుకు ఛాతీని గాయపరిచిన తల్లిదండ్రులు
గుడుంబా మత్తులో మానవత్వం మరిచిన ఓ జంట కన్నకొడుకు ఛాతీని కొడవలితో కోసిన ఘటన మంచిర్యాల జిల్లా నెన్నెల మండల కేంద్రంలో గురువారం రాత్రి జరిగింది. -
ప్రతికూల వాతావరణంతో యువ సైనికుడి మృతి
సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలనే ఆ యువకుని తపన ఆదిలోనే ఆవిరైపోయింది. అనారోగ్యం బారినపడటంతో యువసైనికుడు గురువారం రాత్రి మృత్యువాత పడ్డారు. -
గురుకుల విద్యార్థి మృతి
జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ బాలుర గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థి అస్వస్థతకు గురై మృతి చెందాడు. అనంతరం మరో ఇద్దరు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. -
గంజాయి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడి.. సహకరించిన భార్య
న్యాయ విద్య చదువుకొని ఉన్నతంగా జీవించాల్సిన యువ దంపతులు గాడితప్పారు. గంజాయికి బానిసలై.. అడ్డదారులు తొక్కారు. సహచర విద్యార్థి అయిన యువతిని ఆ మత్తు ఊబిలోకి దించారు. -
విద్యార్థి ఉసురు తీసిన నాడు-నేడు పనులు
గత వైకాపా ప్రభుత్వ హయాంలో నాసిరకంగా చేపట్టిన నాడు-నేడు అదనపు తరగతి గదుల నిర్మాణ పనులు ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. లింటెల్, దానిపైన ఉన్న గోడ కూలి మీద పడటంతో ఓ విద్యార్థి మృతి చెందిన ఘటన నెల్లూరులో చోటుచేసుకుంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే