‘గ్రూప్-1’ ఉద్యోగాల పేరిట టోకరా!
నిరుద్యోగుల బలహీనతలను ఆసరాగా చేసుకొన్న ఓ ముఠా ‘గ్రూప్-1’ ఉద్యోగాల పేరుతో పలువురికి టోకరా వేసిన వైనం వెలుగులోకి వచ్చింది.
నలుగురు సభ్యుల ముఠా మోసం
మాజీ పోలీసు అధికారి కుటుంబం వద్ద రూ. 2.50 కోట్ల వసూలు
వరంగల్ క్రైం, న్యూస్టుడే: నిరుద్యోగుల బలహీనతలను ఆసరాగా చేసుకొన్న ఓ ముఠా ‘గ్రూప్-1’ ఉద్యోగాల పేరుతో పలువురికి టోకరా వేసిన వైనం వెలుగులోకి వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా రూ.కోట్లలో వసూలు చేసినట్లు వరంగల్ పోలీసులు గుర్తించారు. ఈ మేరకు వరంగల్కు చెందిన ఇద్దరు, హైదరాబాద్కు చెందిన ఇద్దరు (వీరిలో ఓ మహిళ) కలిసి ముఠాగా ఏర్పడ్డారు. తమకు టీఎస్పీఎస్సీ ఉన్నతాధికారులతో పరిచయాలున్నాయని, ‘గ్రూప్-1’ పరీక్ష మొదలుకొని ఉద్యోగం వచ్చేవరకు అన్నీ తాము చూసుకుంటామని చెప్పి పలువురిని నమ్మించి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేశారు. పోలీసు అధికారి పోస్టులు సైతం ఇప్పించామని ముఠా సభ్యులు ప్రచారం చేసుకున్నారు. పోలీసు ఉన్నతాధికారులతో కలిసి ఉన్న ఫొటోలను చూపిస్తూ పలువురిని నమ్మించారు. ప్రస్తుతం పరారీలో ఉన్న ఈ ముఠా సభ్యుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో పనిచేసి ఉద్యోగ విరమణ పొంది, కరోనా సమయంలో మృతిచెందిన ఓ పోలీసు అధికారి కుమారుడికి గ్రూప్-1 డీఎస్పీ ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించిన ముఠా.. ఆ కుటుంబ సభ్యుల నుంచి ఏడాది కిందట దశల వారీగా రూ.2.50 కోట్లు వసూలు చేసింది. అయితే ఉద్యోగం రాకపోవడంతో ఆ కుటుంబ సభ్యులు నిలదీయగా ముఠా సభ్యులు తప్పించుకు తిరుగుతున్నారు. దీంతో విశ్రాంత పోలీసు అధికారి కుటుంబ సభ్యులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై విచారణ చేసి, తగిన చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశించడంతో ఈ ముఠా వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
పోలీసుల దర్యాప్తు..
పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాలతో వరంగల్ కమిషనరేట్లోని ప్రత్యేక విభాగం దీనిపై దర్యాప్తు ప్రారంభించింది. ఈ కేసును ఏసీపీ స్థాయి అధికారి పర్యవేక్షణలో అత్యంత రహస్యంగా విచారణ చేస్తున్నారు. నిందితులు నలుగురూ ఇటు వరంగల్, అటు హైదరాబాద్లో కూడా లేరని, ఇతర రాష్ట్రాలకు పారిపోయి ఉంటారని భావిస్తున్నారు. వారిని పట్టుకుంటే ఎంతమంది నుంచి ఎంత డబ్బు వసూలు చేశారు? వారి వెనుక ఇంకా ఎవరున్నారో తెలుస్తుందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆలిన్ హెర్బల్ పరిశ్రమలో మళ్లీ వ్యాపించిన మంటలు
రంగారెడ్డి జిల్లా నందిగామ మండల కేంద్రంలోని ఆలిన్ హెర్బల్ పరిశ్రమలో మళ్లీ మంటలు వ్యాపించాయి. -
అంతర్జాతీయ కోడ్తో వాట్సప్ కాల్స్!
బంజారాహిల్స్ వాసి దినేశ్కు +84 (వియత్నాం) కోడ్తో మొదలయ్యే నంబర్ నుంచి వాట్సప్ వీడియోకాల్ వచ్చింది. అది విదేశీ నంబర్ కావడంతో అనుమానంతో అతను లిఫ్ట్ చేయలేదు. -
ఇద్దరు మావోయిస్టుల లొంగుబాటు
మావోయిస్టు పార్టీకి చెందిన ఇద్దరు సభ్యులు శుక్రవారం పోలీసులకు లొంగిపోయారు. ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లా కిష్టారం పోలీస్స్టేషన్ పరిధిలోని నెమలిగూడకు చెందిన పొడియం ఇడుమయ్య అలియాస్ హరీశ్, ఉయికే ముత్యాలక్క లు భద్రాచలం ఏఎస్పీ పరితోష్ పంకజ్ ఎదుట లొంగిపోయినట్లు తన కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఏఎస్పీ తెలిపారు. -
‘మృత్యు’ ప్రయాణం!
సెలవులు...శుభకార్యాలు. వెరసి వేసవికాలంలో..ముఖ్యంగా మే నెలలో అత్యధికంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. జాతీయ రహదారులు, హైవేల మంత్రిత్వశాఖ నివేదిక ప్రకారం 2022 సంవత్సరంలో అత్యధికంగా మే నెలలోనే రోడ్డు ప్రమాదాలు, మరణాలు నమోదయ్యాయి. -
కొట్టేసిన ఫోన్లు సూడాన్కు.. స్మగ్లింగ్ ముఠా గుట్టురట్టు
రాష్ట్రంలో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తున్న, వాటిని కొనుగోలు చేస్తున్న 12 మంది సభ్యులున్న ముఠాను హైదరాబాద్ సౌత్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. -
పెళ్లి వేడుకలో అగ్నిప్రమాదం.. ఒకే కుటుంబంలో ఆరుగురి మృతి
బిహార్లో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. దర్భంగా ప్రాంతంలో జరిగిన ఓ వివాహ వేడుకలో మంటలు చెలరేగి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతిచెందగా, పలువురు గాయపడ్డారు. -
కాలం చెల్లిన ఆర్టీసీ బస్సులతో ప్రమాదాలు
ఉమ్మడి అనంతపురం జిల్లాలో శుక్రవారం రెండు వేర్వేరు చోట్ల ఆర్టీసీ బస్సులు ప్రమాదానికి గురయ్యాయి. ఆ రెండు బస్సులూ కాలం చెల్లినవే కావడం గమనార్హం. -
ఆలిన్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం
రంగారెడ్డి జిల్లా నందిగామ మండల కేంద్రంలోని ఆలిన్ ఫార్మసీ కంపెనీలో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. -
నీటి బకెట్లో పడి చిన్నారి మృతి
నీటి బకెట్లో పడి ఊపిరాడక 18 నెలల చిన్నారి స్నేహిత మృతిచెందింది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలంలో జరిగింది. -
ఏనుగు దాడిలో మరో ఇద్దరి రైతుల మృతి
కుమురం భీం జిల్లాలో ఇటీవల ఇద్దరిని చంపిన ఏనుగు మహారాష్ట్రలో మరో ఇద్దరిని బలి తీసుకుంది. -
స్టాక్ ట్రేడింగ్లో లాభాలిస్తామని రూ.కోటి కాజేత
సైబర్ వలలో చిక్కుకున్న ఓ విద్యార్థిని రూ.కోటికి పైగా డబ్బు పోగొట్టుకుంది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
అధికారిక ప్రకటనే లేదు.. ‘రామాయణ’ షూట్ ఫొటోలు వైరల్
-
హెలికాప్టర్లో తూలి పడిపోయిన మమతా బెనర్జీ
-
ట్విటర్ (ఎక్స్)లో అడుగుపెట్టిన కేసీఆర్
-
జైల్లో కేజ్రీవాల్ ఆరోగ్యంగానే..: ఎయిమ్స్ మెడికల్ బోర్డు..!
-
దాదాపు 900 రన్స్ చేశా.. చోటు దక్కకపోతే చాలా బాధపడతా: గిల్
-
ఆలిన్ హెర్బల్ పరిశ్రమలో మళ్లీ వ్యాపించిన మంటలు