ఛత్తీస్గఢ్లో ఎదురుకాల్పులు
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని దండకారణ్య ప్రాంతం కాల్పుల మోతతో దద్దరిల్లింది. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజాపూర్ జిల్లా బాసగూడ పోలీస్స్టేషన్ పరిధిలోని చీపురుబట్టీ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు- మావోయిస్టుల మధ్య బుధవారం జరిగిన ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు.
ఇద్దరు మహిళలు సహా ఆరుగురు మావోయిస్టుల మృతి
దుమ్ముగూడెం, చర్ల, న్యూస్టుడే: ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని దండకారణ్య ప్రాంతం కాల్పుల మోతతో దద్దరిల్లింది. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజాపూర్ జిల్లా బాసగూడ పోలీస్స్టేషన్ పరిధిలోని చీపురుబట్టీ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు- మావోయిస్టుల మధ్య బుధవారం జరిగిన ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. వీరిలో ఇద్దరు మహిళలున్నారు. చీపురుబట్టీ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారన్న నిఘావర్గాల సమాచారంతో సీఆర్పీఎఫ్, కోబ్రా, డీఆర్జీ(డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్) బెటాలియన్లు సంయుక్తంగా గాలింపు చేపట్టాయి. ఉదయం 8గంటల సమయంలో తాల్పేర్ నది శివారులో మావోయిస్టుల సమావేశం జరుగుతోంది. భద్రతా బలగాల రాకను పసిగట్టిన మావోయిస్టులు కాల్పులకు దిగారు. భద్రతా బలగాలు ఎదురుకాల్పులు ప్రారంభించాయి. ఇరువర్గాల మధ్య దాదాపు మూడు గంటలపాటు కాల్పులు కొనసాగాయి. ఈ ఘటనలో ప్లాటూన్ నంబర్-10కి చెందిన మావోయిస్టు డిప్యూటీ కమాండర్ నగేష్(40)అతని భార్య సోనీ(35), మిలీషియా డివిజనల్ అధ్యక్షుడు వికాస్(38), ఏరియా కమిటీ మహిళా సభ్యురాలు గంగీ(30), మిలీషియా సెక్షన్ కమాండర్ ముక్కా(37), మిలీషియా కమాండర్ చుక్కా(36) అక్కడికక్కడే మృతి చెందారు. మిగిలినవారు అటవీ ప్రాంతాల మీదుగా తప్పించుకొని పోయినట్లు పోలీసు అధికారులు భావిస్తున్నారు. ఘటనా స్థలంలో మావోయిస్టులకు చెందిన తుపాకులు, పేలుడు పదార్థాలు, కిట్ బ్యాగులు, ఇతర సామగ్రిని భద్రత బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఘటనను బీజాపూర్ ఎస్పీ జితేంద్రకుమార్ యాదవ్ ధ్రువీకరించారు.
ఎన్నికల నేపథ్యంలో ఆపరేషన్ చేపట్టి..
మూడు రోజుల కిందట ఇదే ప్రాంతంలో హోలీ ఆడుకుంటున్న యువకులపై పోలీస్ ఇన్ఫార్మర్ల నెపంతో మావోయిస్టులు గొడ్డళ్లతో విచక్షణారహితంగా దాడిచేసి ముగ్గురిని హత్య చేశారు. బీజాపూర్ జిల్లా బస్తర్ లోక్సభ నియోజకవర్గం పరిధిలో ఉంది. ఈ స్థానానికి ఏప్రిల్ 19న తొలి విడతలోనే పోలింగ్ జరగనుంది. మావోయిస్టులు ముగ్గురిని హత్య చేయడం, ఎన్నికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. పోలింగ్ సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఈ ఆపరేషన్ చేపట్టి మావోయిస్టులను కోలుకోలేని దెబ్బతీశారు. బీజాపూర్ జిల్లాలో పది రోజుల వ్యవధిలో పలువురు మావోయిస్టులు ఎదురుకాల్పుల్లో మృతి చెందడంతో వారికి తీవ్ర నష్టం వాటిల్లింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘మృత్యు’ ప్రయాణం!
సెలవులు...శుభకార్యాలు. వెరసి వేసవికాలంలో..ముఖ్యంగా మే నెలలో అత్యధికంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. జాతీయ రహదారులు, హైవేల మంత్రిత్వశాఖ నివేదిక ప్రకారం 2022 సంవత్సరంలో అత్యధికంగా మే నెలలోనే రోడ్డు ప్రమాదాలు, మరణాలు నమోదయ్యాయి. -
కొట్టేసిన ఫోన్లు సూడాన్కు.. స్మగ్లింగ్ ముఠా గుట్టురట్టు
రాష్ట్రంలో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తున్న, వాటిని కొనుగోలు చేస్తున్న 12 మంది సభ్యులున్న ముఠాను హైదరాబాద్ సౌత్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. -
ఆలిన్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం
రంగారెడ్డి జిల్లా నందిగామ మండల కేంద్రంలోని ఆలిన్ ఫార్మసీ కంపెనీలో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. -
ఇద్దరు మావోయిస్టుల లొంగుబాటు
మావోయిస్టు పార్టీకి చెందిన ఇద్దరు సభ్యులు శుక్రవారం పోలీసులకు లొంగిపోయారు. ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లా కిష్టారం పోలీస్స్టేషన్ పరిధిలోని నెమలిగూడకు చెందిన పొడియం ఇడుమయ్య అలియాస్ హరీశ్, ఉయికే ముత్యాలక్క లు భద్రాచలం ఏఎస్పీ పరితోష్ పంకజ్ ఎదుట లొంగిపోయినట్లు తన కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఏఎస్పీ తెలిపారు. -
నీటి బకెట్లో పడి చిన్నారి మృతి
నీటి బకెట్లో పడి ఊపిరాడక 18 నెలల చిన్నారి స్నేహిత మృతిచెందింది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలంలో జరిగింది. -
ఏనుగు దాడిలో మరో ఇద్దరి రైతుల మృతి
కుమురం భీం జిల్లాలో ఇటీవల ఇద్దరిని చంపిన ఏనుగు మహారాష్ట్రలో మరో ఇద్దరిని బలి తీసుకుంది. -
స్టాక్ ట్రేడింగ్లో లాభాలిస్తామని రూ.కోటి కాజేత
సైబర్ వలలో చిక్కుకున్న ఓ విద్యార్థిని రూ.కోటికి పైగా డబ్బు పోగొట్టుకుంది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. -
అంతర్జాతీయ కోడ్తో వాట్సప్ కాల్స్!
బంజారాహిల్స్ వాసి దినేశ్కు +84 (వియత్నాం) కోడ్తో మొదలయ్యే నంబర్ నుంచి వాట్సప్ వీడియోకాల్ వచ్చింది. అది విదేశీ నంబర్ కావడంతో అనుమానంతో అతను లిఫ్ట్ చేయలేదు.
తాజా వార్తలు (Latest News)
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?