రొయ్యల ప్రాసెసింగ్ కంపెనీలో తనిఖీలు
బాపట్ల జిల్లా చీరాల మండలం కావూరివారిపాలెం పంచాయతీ పరిధిలో ఉన్న రాయల్ మెరైన్ రొయ్యల ప్రాసెసింగ్ కంపెనీలో గురువారం పలు శాఖల అధికారులు తనిఖీలు చేపట్టారు.
రూ.56 లక్షల నగదు స్వాధీనం
బాపట్ల తెదేపా అభ్యర్థి లక్ష్యంగా దాడులు
బాపట్ల, చీరాల గ్రామీణం, న్యూస్టుడే: బాపట్ల జిల్లా చీరాల మండలం కావూరివారిపాలెం పంచాయతీ పరిధిలో ఉన్న రాయల్ మెరైన్ రొయ్యల ప్రాసెసింగ్ కంపెనీలో గురువారం పలు శాఖల అధికారులు తనిఖీలు చేపట్టారు. ఫ్యాక్టరీలో పెద్దఎత్తున నగదు ఉన్నట్లు ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్కు సమాచారం వచ్చిందని చీరాల డీఎస్పీ బేతపూడి ప్రసాద్ ఆధ్వర్యంలో పోలీసు బృందం సంస్థ కార్యాలయం వద్ద తనిఖీలు చేసింది. ఓ రొయ్యల కంటెయినర్లో అట్టపెట్టెలో దాచి ఉంచిన రూ.56 లక్షల నగదును అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. నెలాఖరు కావడంతో ఉద్యోగులు, సిబ్బందికి జీతాలు చెల్లించేందుకు నగదు తెచ్చినట్లు అధికారులకు సంస్థ ప్రతినిధులు తెలిపారు. సంబంధిత పత్రాలను అందజేశారు. రూ.10లక్షలకు మించి నగదు లభ్యం కావడంతో పోలీసులు ఆదాయపన్ను విభాగం అధికారులకు తెలిపారు. రెవెన్యూ, పోలీసు, ఆదాయపన్ను విభాగం అధికారుల విచారణ ముగిసేవరకు నగదును చీరాల ఎస్టీఓ కార్యాలయంలో జమ చేయాలని నిర్ణయించారు.
ఒక్క సంస్థలోనే తనిఖీలపై చర్చ
రాయల్ మెరైన్ కంపెనీలో తెదేపా బాపట్ల అసెంబ్లీ అభ్యర్థి వేగేశన నరేంద్రవర్మ ఓ భాగస్వామి. బాపట్ల జిల్లా తీర ప్రాంతంలో నాలుగు యూనిట్లు నడుస్తుండగా.. ఒక్క తెదేపా అభ్యర్థి సంస్థపైనే దాడులు చేయడం చర్చనీయాంశం అయింది. నరేంద్రవర్మ లక్ష్యంగా ఈ దాడులు జరిగినట్లు రాజకీయవర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. దీనిపై చీరాల ఆర్డీవో సూర్యనారాయణరెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల నిబంధనల మేరకు తనిఖీలు చేపట్టినట్లు వివరించారు. కంపెనీ ఏ పార్టీకి చెందినదో తమకు సంబంధం లేదన్నారు.
అన్ని పత్రాలూ అందజేశాం
నగదుకు సంబంధించి అన్ని పత్రాలూ అధికారులకు అందజేశామని సంస్థ ప్రతినిధి విజయ్కుమార్ తెలిపారు. ఇది ఎన్నికల నగదు కాదని, వేతనాలకు సంబంధించినదని ఆయన స్పష్టం చేశారు. నిబంధనల ప్రకారం అన్ని ఆధారాలు చూపించి నగదును రెండు, మూడు రోజుల్లో తిరిగి తీసుకుంటామని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అంతర్జాతీయ కోడ్తో వాట్సప్ కాల్స్!
బంజారాహిల్స్ వాసి దినేశ్కు +84 (వియత్నాం) కోడ్తో మొదలయ్యే నంబర్ నుంచి వాట్సప్ వీడియోకాల్ వచ్చింది. అది విదేశీ నంబర్ కావడంతో అనుమానంతో అతను లిఫ్ట్ చేయలేదు. -
ఇద్దరు మావోయిస్టుల లొంగుబాటు
మావోయిస్టు పార్టీకి చెందిన ఇద్దరు సభ్యులు శుక్రవారం పోలీసులకు లొంగిపోయారు. ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లా కిష్టారం పోలీస్స్టేషన్ పరిధిలోని నెమలిగూడకు చెందిన పొడియం ఇడుమయ్య అలియాస్ హరీశ్, ఉయికే ముత్యాలక్క లు భద్రాచలం ఏఎస్పీ పరితోష్ పంకజ్ ఎదుట లొంగిపోయినట్లు తన కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఏఎస్పీ తెలిపారు. -
‘మృత్యు’ ప్రయాణం!
సెలవులు...శుభకార్యాలు. వెరసి వేసవికాలంలో..ముఖ్యంగా మే నెలలో అత్యధికంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. జాతీయ రహదారులు, హైవేల మంత్రిత్వశాఖ నివేదిక ప్రకారం 2022 సంవత్సరంలో అత్యధికంగా మే నెలలోనే రోడ్డు ప్రమాదాలు, మరణాలు నమోదయ్యాయి. -
కొట్టేసిన ఫోన్లు సూడాన్కు.. స్మగ్లింగ్ ముఠా గుట్టురట్టు
రాష్ట్రంలో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తున్న, వాటిని కొనుగోలు చేస్తున్న 12 మంది సభ్యులున్న ముఠాను హైదరాబాద్ సౌత్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. -
పెళ్లి వేడుకలో అగ్నిప్రమాదం.. ఒకే కుటుంబంలో ఆరుగురి మృతి
బిహార్లో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. దర్భంగా ప్రాంతంలో జరిగిన ఓ వివాహ వేడుకలో మంటలు చెలరేగి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతిచెందగా, పలువురు గాయపడ్డారు. -
కాలం చెల్లిన ఆర్టీసీ బస్సులతో ప్రమాదాలు
ఉమ్మడి అనంతపురం జిల్లాలో శుక్రవారం రెండు వేర్వేరు చోట్ల ఆర్టీసీ బస్సులు ప్రమాదానికి గురయ్యాయి. ఆ రెండు బస్సులూ కాలం చెల్లినవే కావడం గమనార్హం. -
ఆలిన్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం
రంగారెడ్డి జిల్లా నందిగామ మండల కేంద్రంలోని ఆలిన్ ఫార్మసీ కంపెనీలో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. -
నీటి బకెట్లో పడి చిన్నారి మృతి
నీటి బకెట్లో పడి ఊపిరాడక 18 నెలల చిన్నారి స్నేహిత మృతిచెందింది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలంలో జరిగింది. -
ఏనుగు దాడిలో మరో ఇద్దరి రైతుల మృతి
కుమురం భీం జిల్లాలో ఇటీవల ఇద్దరిని చంపిన ఏనుగు మహారాష్ట్రలో మరో ఇద్దరిని బలి తీసుకుంది. -
స్టాక్ ట్రేడింగ్లో లాభాలిస్తామని రూ.కోటి కాజేత
సైబర్ వలలో చిక్కుకున్న ఓ విద్యార్థిని రూ.కోటికి పైగా డబ్బు పోగొట్టుకుంది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆ సమయంలో 32 కిలోల బరువు పెరిగాను: సోనమ్ కపూర్
-
క్రికెట్.. బేస్బాల్ గేమ్లా మారిపోతోంది: పంజాబ్ కెప్టెన్
-
అందాల పోటీల్లో తొలిసారి.. 60 ఏళ్ల ‘భామ’కు కిరీటం
-
అభిమానుల ప్రేమను పొందడం సులభం కాదు: సమంత
-
మా పార్టీ పుట్టుక సంచలనం.. దారి పొడవునా రాజీలేని రణం: కేటీఆర్
-
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి.. అమెరికాలో పోలీసుల కర్కశత్వం