ట్యాపింగ్ పాపంలో కీలక వికెట్
ఫోన్ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. హైదరాబాద్ టాస్క్ఫోర్స్ డీసీపీగా, ఉద్యోగ విరమణ అనంతరం అక్కడే ఓఎస్డీగా సుదీర్ఘకాలం పనిచేసిన రాధాకిషన్రావును పోలీసులు అరెస్ట్ చేశారు.
టాస్క్ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్రావు అరెస్ట్
ఫోన్ట్యాపింగ్.. హవాలా దందాలపై సుదీర్ఘ విచారణ
క్షేత్రస్థాయిలో అనధికారిక ఆపరేషన్లపై ఆరా
5 రోజుల పోలీస్ కస్టడీకి అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న
ఈనాడు, హైదరాబాద్: ఫోన్ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. హైదరాబాద్ టాస్క్ఫోర్స్ డీసీపీగా, ఉద్యోగ విరమణ అనంతరం అక్కడే ఓఎస్డీగా సుదీర్ఘకాలం పనిచేసిన రాధాకిషన్రావును పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం ఉదయం బంజారాహిల్స్ ఠాణాకు వచ్చిన ఆయన్ని వెస్ట్జోన్ డీసీపీ విజయ్కుమార్ నేతృత్వంలోని దర్యాప్తు బృందం రాత్రి వరకు విచారించింది. అనంతరం అరెస్ట్ చేసింది. శుక్రవారం ఉదయం ఆయన్ని న్యాయస్థానంలో హాజరుపరచనున్నారు. రాధాకిషన్రావును విచారిస్తున్న సమయంలో ఠాణా గేట్లు మూసేసి గోప్యత పాటించారు. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్(ఎస్ఐబీ)లో పనిచేసిన సమయంలో డీఎస్పీ(సస్పెండెడ్) దుగ్యాల ప్రణీత్రావు ఫోన్ట్యాపింగ్ ద్వారా ఇచ్చిన సమాచారం ఆధారంగా క్షేత్రస్థాయిలో రాధాకిషన్రావు బృందం అనధికారిక ఆపరేషన్లు చేపట్టిందనే ఆరోపణలున్నాయి. ప్రణీత్రావు వాంగ్మూలం ఆధారంగా ఇద్దరు అదనపు ఎస్పీలతోపాటు రాధాకిషన్రావు, విశ్రాంత ఐజీ ప్రభాకర్రావు, ఓ మీడియా సంస్థ నిర్వాహకుడు శ్రవణ్రావు ఇళ్లలో కొద్దిరోజుల క్రితం సోదాలు నిర్వహించారు. అనంతరం ఇద్దరు అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నలను అరెస్ట్ చేయగా.. మిగిలిన ముగ్గురు అజ్ఞాతంలోకి వెళ్లారు. వీరు ముగ్గురూ విదేశాలకు వెళ్లినట్లు భావించిన పోలీసులు లుక్అవుట్ నోటీస్లు జారీ చేశారు.
సుదీర్ఘ విచారణ
అనూహ్యంగా రాధాకిషన్రావు గురువారం ఉదయం పోలీసుల ఎదుటికి వచ్చారు. బోయినపల్లిలోని తన ఇంటి నుంచి వచ్చి వెస్ట్జోన్ డీసీపీ విజయ్కుమార్ను కలిశారు. ఈ క్రమంలో ఫోన్ట్యాపింగ్ అంశంలో ప్రణీత్రావుకు రాధాకిషన్రావు ఇచ్చిన ఆదేశాలు.. ఆయన నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా క్షేత్రస్థాయిలో చేపట్టిన ఆపరేషన్ల గురించి పోలీసులు సుదీర్ఘంగా విచారించారు. ఎవరి సూచనల మేరకు ఫోన్ట్యాపింగ్ చేయాలని ప్రణీత్రావుకు ఆదేశాలిచ్చారని రాధాకిషన్రావును ఆరా తీశారు. ఫోన్ట్యాపింగ్ సమాచారంతో క్షేత్రస్థాయిలో ఎక్కడెక్కడ ఆపరేషన్లు చేపట్టారు? హవాలా లావాదేవీల క్రమంలో నిర్వహించిన దాడుల్లో ఏం జరిగింది? పలువురు వ్యాపారులను బెదిరించి అక్రమంగా డబ్బు సంపాదించారనే ఆరోపణల్లో వాస్తవమెంత? అనే అంశాలపై ఆధారాలు సేకరించినట్లు సమాచారం. మరోవైపు, టాస్క్ఫోర్స్, ఎస్ఐబీ ఇన్స్పెక్టర్గా పనిచేసిన గట్టుమల్లును పోలీసులు గురువారం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కు పిలిపించారు. ఫోన్ట్యాపింగ్ వ్యవహారంపై ప్రశ్నించి.. వాంగ్మూలం నమోదు చేశారు. తననెందుకు అదుపులోకి తీసుకున్నారని ఎదురు ప్రశ్నించడంతో ఓ ఉన్నతాధికారి తనదైన శైలిలో విచారించినట్లు ప్రచారం జరిగింది.
ఉద్యోగ విరమణ పొందినా ఓఎస్డీగా విధులు
హైదరాబాద్ టాస్క్ఫోర్స్లో సుదీర్ఘకాలం పనిచేసిన రాధాకిషన్రావుతోపాటు ఆయన బృందంపై పలు ఆరోపణలున్నాయి. గత ప్రభుత్వ పెద్దలు తాము లక్ష్యంగా చేసుకున్న ప్రత్యర్థులను రాజకీయంగా తమకు అడ్డు తొలగించుకునే లేదా దారికితెచ్చే బాధ్యతను టాస్క్ఫోర్స్కు అప్పగించేవారని ప్రతిపక్షాలు బహిరంగంగానే ఆరోపించేవి. రాధాకిషన్రావుపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సైతం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పలుమార్లు ఆరోపణలు చేశారు. రాధాకిషన్రావు మల్కాజిగిరి ఏసీపీగా ఉన్న సమయంలో ఓ కాంగ్రెస్ నేత ఆత్మహత్యకు కారకులయ్యారనే అభియోగాలు ఎదుర్కొన్నారు. విచారణ అనంతరం ఆ కేసు నుంచి బయటపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో టాస్క్ఫోర్స్లో కీలకంగా వ్యవహరించారు. నగర కొత్వాల్గా ఎవరున్నా ప్రభుత్వ అండదండల కారణంగా రాధాకిషన్రావుకే ప్రాధాన్యం ఉండేది. ఉద్యోగ విరమణ పొందిన తర్వాతా రెండు విడతలుగా ఆయనే ఓఎస్డీగా కొనసాగడం వెనక అప్పటి ప్రభుత్వ పెద్దల ఆశీస్సులు ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమైంది. అయితే శాసనసభ ఎన్నికల నియమావళి అమల్లో ఉన్న సమయంలో రాధాకిషన్రావుపై అప్పటి కమిషనర్ సందీప్ శాండిల్య ఎన్నికల కమిషన్కు ప్రత్యేక నివేదిక పంపించడంతో ఆయనను టాస్క్ఫోర్స్ బాధ్యతల నుంచి తప్పించారు. ఎన్నికల ఫలితాల అనంతరం ప్రభుత్వం మారడంతో ఆయన తన పదవికి రాజీనామా చేశారు.
అదుపులో మరికొందరు పోలీసులు
మరో ముగ్గురు టాస్క్ఫోర్స్ పోలీసులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. టాస్క్ఫోర్స్ కార్యాలయంలోనే వారి ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. క్షేత్రస్థాయి ఆపరేషన్లలో వీరి ప్రమేయం ఉన్నట్లు గుర్తించిన నేపథ్యంలో వారిని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రణీత్రావుకు డ్రైవర్గా పనిచేసిన వ్యక్తితోపాటు ఓ కానిస్టేబుల్ సైతం పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. డిసెంబరు 4న ఎస్ఐబీలో హార్డ్డిస్క్లను ధ్వంసం చేయడంతోపాటు వాటిని మూసీ నదిలో పారేయడంలో వీరి ప్రమేయమున్నట్లు తెలుస్తోంది.
అదనపు ఎస్పీలకు ఐదు రోజుల కస్టడీ
ఈ కేసులో ఇప్పటికే అరెస్టయి చంచల్గూడ కేంద్ర కారాగారంలో ఉన్న అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నలను ఐదు రోజుల పోలీస్ కస్టడీకి ఇస్తూ నాంపల్లి కోర్టు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. శుక్రవారం నుంచి ఏప్రిల్ 2 వరకు కస్టడీ విధించింది. ప్రణీత్రావును పోలీస్ కస్టడీకి ఇచ్చేందుకు మాత్రం న్యాయస్థానం నిరాకరించింది. ఈ నెల 12న అరెస్ట్ చేశారని, ఇప్పటికే 14 రోజుల గడిచిన నేపథ్యంలో పోలీస్ కస్టడీకి ఇవ్వొద్దంటూ ప్రణీత్రావు తరఫు న్యాయవాదులు వాదించారు. దీంతో పోలీసుల పిటిషన్ను న్యాయస్థానం కొట్టేసింది.
అజ్ఞాతంలోకి బేగంబజార్ వ్యాపారులు
రాధాకిషన్రావు, గట్టుమల్లును పోలీసులు విచారిస్తున్న క్రమంలోనే బేగంబజార్లో కొందరు వ్యాపారులు అజ్ఞాతంలోకి వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. టాస్క్ఫోర్స్ పోలీసులు తరచూ బేగంబజార్ ప్రాంతంలో సోదాలు నిర్వహించేవారు. ఆ ప్రాంతంలో గంజాయి, హవాలా దందాల్లో ప్రమేయమున్న వ్యాపార సంస్థలపై దాడులు చేసేవారు. ఈ నేపథ్యంలో కొందరు వ్యాపారులతో ఒకరిద్దరు టాస్క్ఫోర్స్ పోలీస్ అధికారులకు సాన్నిహిత్యం ఏర్పడిందనే ప్రచారముంది. ఆ క్రమంలో వారితో ఆర్థిక లావాదేవీల బంధం కొనసాగించారనే ఆరోపణలున్నాయి. రాధాకిషన్రావు, గట్టుమల్లులను విచారిస్తున్న విషయం బయటికి పొక్కగానే వ్యాపారులు అజ్ఞాతంలోకి వెళ్లిఉంటారనే ప్రచారం విస్తృతంగా సాగుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొల్లగొడుతున్న సైబర్ ముఠాలు
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి వ్యాపారి(40) వాట్సప్కు స్టాక్మార్కెట్ మెలకువలు నేర్పిస్తామంటూ మెసేజ్ వచ్చింది. ఆయన ఆసక్తి చూపడంతో ‘ఓక్ట్రీ క్యాపిటల్ గ్రూప్’ పేరిట ఉన్న వాట్సప్ గ్రూప్లో చేర్చారు. నిర్వాహకుల మాటలు నమ్మి వారు సూచించిన బ్యాంకు ఖాతాలోకి వ్యాపారి నగదు బదిలీ చేస్తూ వచ్చారు. -
శిర్డీ ఎక్స్ప్రెస్లో భారీ చోరీ
శిర్డీ ఎక్స్ప్రెస్లో గురువారం అర్ధరాత్రి దాటాక దొంగలు విరుచుకుపడ్డారు. ప్రయాణికుల విలువైన వస్తువులు దోచుకొని పారిపోయారు. శుక్రవారం తెల్లవారుజామున గుర్తించిన బాధితులు సికింద్రాబాద్ రైల్వేపోలీసులకు ఫిర్యాదు చేశారు. -
కొడవలితో కొడుకు ఛాతీని గాయపరిచిన తల్లిదండ్రులు
గుడుంబా మత్తులో మానవత్వం మరిచిన ఓ జంట కన్నకొడుకు ఛాతీని కొడవలితో కోసిన ఘటన మంచిర్యాల జిల్లా నెన్నెల మండల కేంద్రంలో గురువారం రాత్రి జరిగింది. -
ప్రతికూల వాతావరణంతో యువ సైనికుడి మృతి
సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలనే ఆ యువకుని తపన ఆదిలోనే ఆవిరైపోయింది. అనారోగ్యం బారినపడటంతో యువసైనికుడు గురువారం రాత్రి మృత్యువాత పడ్డారు. -
గురుకుల విద్యార్థి మృతి
జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ బాలుర గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థి అస్వస్థతకు గురై మృతి చెందాడు. అనంతరం మరో ఇద్దరు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. -
గంజాయి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడి.. సహకరించిన భార్య
న్యాయ విద్య చదువుకొని ఉన్నతంగా జీవించాల్సిన యువ దంపతులు గాడితప్పారు. గంజాయికి బానిసలై.. అడ్డదారులు తొక్కారు. సహచర విద్యార్థి అయిన యువతిని ఆ మత్తు ఊబిలోకి దించారు. -
విద్యార్థి ఉసురు తీసిన నాడు-నేడు పనులు
గత వైకాపా ప్రభుత్వ హయాంలో నాసిరకంగా చేపట్టిన నాడు-నేడు అదనపు తరగతి గదుల నిర్మాణ పనులు ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. లింటెల్, దానిపైన ఉన్న గోడ కూలి మీద పడటంతో ఓ విద్యార్థి మృతి చెందిన ఘటన నెల్లూరులో చోటుచేసుకుంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్