నకిలీ వైద్యులు.. అనుమతుల్లేని క్లినిక్లు!
వారు అసలు వైద్యులే కాదు.. ఎంబీబీఎస్ పట్టానే ఉండదు.. అయినా వైద్యుల పేరుతో చలామణి అవుతున్నారు. ఏకంగా క్లినిక్లు తెరిచి అన్ని రకాల రోగాలకు చికిత్సలు చేస్తున్నారు.
పలు ప్రాంతాల్లో డీసీఏ కేసుల నమోదు
ఈనాడు, హైదరాబాద్: వారు అసలు వైద్యులే కాదు.. ఎంబీబీఎస్ పట్టానే ఉండదు.. అయినా వైద్యుల పేరుతో చలామణి అవుతున్నారు. ఏకంగా క్లినిక్లు తెరిచి అన్ని రకాల రోగాలకు చికిత్సలు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఇలాంటి నకిలీ వైద్యులను తాజాగా ఔషధ నియంత్రణ శాఖ (డీసీఏ) గుర్తించింది. సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేసినట్లు శుక్రవారం మీడియాకు డీసీఏ వివరాలు వెల్లడించింది. ఖమ్మం జిల్లా పొలంపల్లి గ్రామంలో ఇసల రాజు, సంగారెడ్డి జిల్లాలో కొండాపూర్కు చెందిన మింతు బాల, నిజామాబాద్ మంచిప్ప గ్రామానికి చెందిన శ్యాంగౌడ్, వనపర్తి జిల్లా పెబ్బేరుకు చెందిన వి.శ్రీకాంత్ కొంతకాలంగా క్లినిక్లు తెరిచి రోగులకు సేవలు అందిస్తున్నారు. ఫీజులు వసూలు చేస్తున్నారు. వీరందరికీ ఎలాంటి అర్హత లేకున్నా రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్స్గా చలామణి అవుతున్నారు. మందులను సైతం విక్రయిస్తున్నారు. అవసరం లేకున్నా పెయిన్ కిల్లర్లు, యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్లు రోగులకు అంటగడుతున్నారు. కొందరు హోల్సేల్ డీలర్లు నిబంధనలకు విరుద్ధంగా ఈ నకిలీ వైద్యులకు మందులను సరఫరా చేస్తున్నట్లు డీసీఏ గుర్తించింది. దాదాపు రూ.3.18 లక్షల విలువైన మందులను సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. చట్టపరంగా వీరందరిపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోనున్నట్లు డీసీఏ డైరెక్టర్ జనరల్ వి.బి.కమలాసన్రెడ్డి వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొలువుల ఆశ చూపి కంబోడియాకు..
ఏజెంట్లు ఇచ్చే కమీషన్లకు ఆశపడి..ఉద్యోగాల పేరుతో యువకులను మభ్యపెట్టి కంబోడియాకు తరలిస్తున్న ముఠా గుట్టును రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు రట్టు చేశారు. ఆ ముఠా సభ్యుడు కంచర్ల సాయి ప్రసాద్ను అరెస్టు చేశారు. -
ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ నాయకుడి హత్య
ఛత్తీస్గఢ్లోని దంతెవాడ జిల్లాలో కాంగ్రెస్ జిల్లా నాయకుడు జోగ పొడియం(48)ను మావోయిస్టులు శుక్రవారం అర్ధరాత్రి ఆయన ఇంట్లోనే దారుణంగా హత్య చేశారు. పొటాలి సీఆర్పీఎఫ్ బేస్ క్యాంపు సమీపంలో మావోయిస్టులు ఈ ఘటనకు పాల్పడ్డారు. -
ఆకస్మిక తనిఖీల్లో భారీ సొత్తు స్వాధీనం
మల్టీజోన్-1 పరిధిలోని 16 జిల్లాల్లో చేపట్టిన ఆకస్మిక తనిఖీల్లో పోలీసులు భారీ సొత్తు స్వాధీనం చేసుకున్నారు. -
డ్రగ్స్ తయారీ మాఫియా గుట్టురట్టు
గుజరాత్, రాజస్థాన్లలో మాదక ద్రవ్యాల తయారీ ముఠా గుట్టు రట్టయింది. రహస్యంగా నడుపుతున్న డ్రగ్స్ ల్యాబ్లపై మాదక ద్రవ్యాల నిరోధక విభాగం (ఎన్సీబీ), గుజరాత్కు చెందిన ఉగ్రవాద నిరోధక దళం(ఏటీఎస్) దాడులు నిర్వహించి 13 మందిని అరెస్టు చేశాయి. -
ఝార్ఖండ్లో స్కూల్ బస్సు బోల్తా.. 15 మంది చిన్నారులకు గాయాలు
ఝార్ఖండ్లోని రాంచీలో చిన్నారులతో పాఠశాలకు వెళుతున్న ఓ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 15 మంది విద్యార్థులు గాయపడ్డారు. వీరందరినీ ఆసుపత్రికి తరలించారు.
తాజా వార్తలు (Latest News)
-
నా ముఖం కాదు.. మార్కులు చూడండి: ట్రోలర్లకు యూపీ టాపర్ దీటైన జవాబు
-
ఆర్చరీ వరల్డ్ కప్లో భారత్ అద్భుతం.. ఒలింపిక్ ఛాంపియన్ను ఓడించి స్వర్ణం కైవసం
-
అర్ధరాత్రి వైకాపా ఎమ్మెల్యే సోదరుడి హల్చల్.. తెదేపా సానుభూతిపరులపై దాడి
-
మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసు.. బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ అరెస్ట్
-
ఆదుకుంటానన్నావ్.. పీల్చి పిప్పి చేశావ్!!
-
బుమ్రా బౌలింగ్ ఫుటేజీలను విపరీతంగా చూశా: జేక్ ఫ్రేజర్