ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని నయవంచన!
గ్రూప్-1తో పాటు వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని పలువురు నిరుద్యోగులను మోసంచేసిన ముఠాలో ఒకరిని హనుమకొండ సుబేదారి పోలీసులు అరెస్టుచేశారు.
సొమ్ము తీసుకుని మోసం చేసిన నిందితుడి అరెస్టు
వరంగల్క్రైం, న్యూస్టుడే: గ్రూప్-1తో పాటు వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని పలువురు నిరుద్యోగులను మోసంచేసిన ముఠాలో ఒకరిని హనుమకొండ సుబేదారి పోలీసులు అరెస్టుచేశారు. శుక్రవారం సుబేదారి ఠాణాలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఏసీపీ దేవేందర్రెడ్డి వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి.. వరంగల్ పిన్నావారి వీధికి చెెందిన కొత్త వీరేశం ప్రస్తుతం హైదరాబాద్లోని వెస్ట్ మారేడ్పల్లి అశ్వినీకాలనీలో నివాసం ఉంటున్నాడు. హనుమకొండ కనకదుర్గ కాలనీకి చెందిన విశ్రాంత అదనపు ఎస్పీ భాస్కర్రావు (కరోనా సమయంలో మృతి చెందారు) కుమారుడికి గ్రూప్-1 ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి 2020 నుంచి ఇప్పటివరకు వారి కుటుంబ సభ్యుల నుంచి రూ.2.50 కోట్ల నగదు తీసుకున్నాడు. ఇలాగే వీరేశం పలువురి నుంచి రూ.4.50 కోట్ల వరకు డబ్బు వసూలు చేశాడు. కానీ ఎవరికీ ఉద్యోగం ఇప్పించలేదు. డబ్బు వెనక్కి ఇవ్వలేదు. భాస్కర్రావు సతీమణి శ్రీదేవి న్యాయస్థానాన్ని ఆశ్రయించగా... కోర్టు ఆదేశాల మేరకు సుబేదారి పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుల కోసం గాలింపు చేపట్టారు. గురువారం హనుమకొండ అదాలత్ వద్ద వీరేశంను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం హైదరాబాద్లో వీరేశం ఉంటున్న ఇంట్లో గాలించగా.. సెల్ఫోన్, 200 గ్రాముల బరువున్న రెండు బంగారు బిస్కెట్లు, పది గ్రాముల బంగారు నాణెం, 45 గ్రాముల బంగారు గొలుసు, ఆరు ప్రామిసరీ నోట్లు, ఆరు చెక్కులు, రూ.71 వేల నగదు, పాస్పోర్టులు దొరికినట్లు ఏసీపీ తెలిపారు. వీటి విలువ సుమారు రూ.25 లక్షల వరకు ఉంటుందని చెప్పారు.
నమ్మించి.. ఇలా వంచించి..
కొత్త వీరేశంను వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన బోయినపల్లి రవీందర్రావు హైదరాబాద్కు చెందిన గూడూర్ పవన్కుమార్కు పరిచయం చేశారు. కరీంనగర్ జిల్లాలోని ఓ ప్రైవేటు వైద్య కళాశాలలో వైద్యుడిగా పని చేస్తున్న పవన్కుమార్ మామ వీరిని కళాశాల యజమానికి పరిచయం చేశారు. కళాశాల యజమానికి అప్పటి ప్రభుత్వ పెద్దల వద్ద మంచి పేరుండడంతో అతని ద్వారా ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ వీరేశం, గూడూర్ పవన్కుమార్ నిరుద్యోగులను నమ్మించసాగారు. వీరితోపాటు వీరేశం కుమారుడు గోపీనాథ్, పవన్కుమార్ భార్య పద్మజ కూడా మోసాల్లో భాగస్వాములయ్యారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలానికి చెందిన బుచ్చిబాబు, అలియాస్ బుచ్చయ్య ద్వారా కూడా నిరుద్యోగులను నమ్మించి డబ్బు తీసుకున్నారు. వీరేశం చెప్పిన వివరాల ప్రకారం.. గూడూర్ పవన్కుమార్, గోపీనాథ్, పద్మజ, రవీందర్రావు, ఖమ్మం పట్టణానికి చెందిన ఉట్కూరి శ్రీనివాస్రావు, ప్రకాశం జిల్లాకు చెందిన బుచ్చిబాబు, వీరేశం భార్య అరుంధతి, కుమార్తె పూజితలను పోలీసులు నిందితులుగా పేర్కొన్నారు. వీరిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. నిందితుడిని అరెస్టు చేయడంలో ప్రతిభ కనబర్చిన టాస్క్ఫోర్స్, సుబేదారి పోలీసులను వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్కిశోర్ ఝా అభినందించారు. విలేకరుల సమావేశంలో సుబేదారి ఇన్స్పెక్టర్ సత్యనారాయణరెడ్డి, ఎస్సై సాంబయ్య, కానిస్టేబుళ్లు సుమన్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శిర్డీ ఎక్స్ప్రెస్లో భారీ చోరీ
శిర్డీ ఎక్స్ప్రెస్లో గురువారం అర్ధరాత్రి దాటాక దొంగలు విరుచుకుపడ్డారు. ప్రయాణికుల విలువైన వస్తువులు దోచుకొని పారిపోయారు. శుక్రవారం తెల్లవారుజామున గుర్తించిన బాధితులు సికింద్రాబాద్ రైల్వేపోలీసులకు ఫిర్యాదు చేశారు. -
కొడవలితో కొడుకు ఛాతీని గాయపరిచిన తల్లిదండ్రులు
గుడుంబా మత్తులో మానవత్వం మరిచిన ఓ జంట కన్నకొడుకు ఛాతీని కొడవలితో కోసిన ఘటన మంచిర్యాల జిల్లా నెన్నెల మండల కేంద్రంలో గురువారం రాత్రి జరిగింది. -
ప్రతికూల వాతావరణంతో యువ సైనికుడి మృతి
సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలనే ఆ యువకుని తపన ఆదిలోనే ఆవిరైపోయింది. అనారోగ్యం బారినపడటంతో యువసైనికుడు గురువారం రాత్రి మృత్యువాత పడ్డారు. -
గురుకుల విద్యార్థి మృతి
జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ బాలుర గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థి అస్వస్థతకు గురై మృతి చెందాడు. అనంతరం మరో ఇద్దరు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. -
గంజాయి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడి.. సహకరించిన భార్య
న్యాయ విద్య చదువుకొని ఉన్నతంగా జీవించాల్సిన యువ దంపతులు గాడితప్పారు. గంజాయికి బానిసలై.. అడ్డదారులు తొక్కారు. సహచర విద్యార్థి అయిన యువతిని ఆ మత్తు ఊబిలోకి దించారు. -
విద్యార్థి ఉసురు తీసిన నాడు-నేడు పనులు
గత వైకాపా ప్రభుత్వ హయాంలో నాసిరకంగా చేపట్టిన నాడు-నేడు అదనపు తరగతి గదుల నిర్మాణ పనులు ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. లింటెల్, దానిపైన ఉన్న గోడ కూలి మీద పడటంతో ఓ విద్యార్థి మృతి చెందిన ఘటన నెల్లూరులో చోటుచేసుకుంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గంజాయి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడి.. సహకరించిన భార్య
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/07/24)
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
-
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
-
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
-
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?