ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని నయవంచన!
గ్రూప్-1తో పాటు వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని పలువురు నిరుద్యోగులను మోసంచేసిన ముఠాలో ఒకరిని హనుమకొండ సుబేదారి పోలీసులు అరెస్టుచేశారు.
సొమ్ము తీసుకుని మోసం చేసిన నిందితుడి అరెస్టు
వరంగల్క్రైం, న్యూస్టుడే: గ్రూప్-1తో పాటు వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని పలువురు నిరుద్యోగులను మోసంచేసిన ముఠాలో ఒకరిని హనుమకొండ సుబేదారి పోలీసులు అరెస్టుచేశారు. శుక్రవారం సుబేదారి ఠాణాలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఏసీపీ దేవేందర్రెడ్డి వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి.. వరంగల్ పిన్నావారి వీధికి చెెందిన కొత్త వీరేశం ప్రస్తుతం హైదరాబాద్లోని వెస్ట్ మారేడ్పల్లి అశ్వినీకాలనీలో నివాసం ఉంటున్నాడు. హనుమకొండ కనకదుర్గ కాలనీకి చెందిన విశ్రాంత అదనపు ఎస్పీ భాస్కర్రావు (కరోనా సమయంలో మృతి చెందారు) కుమారుడికి గ్రూప్-1 ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి 2020 నుంచి ఇప్పటివరకు వారి కుటుంబ సభ్యుల నుంచి రూ.2.50 కోట్ల నగదు తీసుకున్నాడు. ఇలాగే వీరేశం పలువురి నుంచి రూ.4.50 కోట్ల వరకు డబ్బు వసూలు చేశాడు. కానీ ఎవరికీ ఉద్యోగం ఇప్పించలేదు. డబ్బు వెనక్కి ఇవ్వలేదు. భాస్కర్రావు సతీమణి శ్రీదేవి న్యాయస్థానాన్ని ఆశ్రయించగా... కోర్టు ఆదేశాల మేరకు సుబేదారి పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుల కోసం గాలింపు చేపట్టారు. గురువారం హనుమకొండ అదాలత్ వద్ద వీరేశంను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం హైదరాబాద్లో వీరేశం ఉంటున్న ఇంట్లో గాలించగా.. సెల్ఫోన్, 200 గ్రాముల బరువున్న రెండు బంగారు బిస్కెట్లు, పది గ్రాముల బంగారు నాణెం, 45 గ్రాముల బంగారు గొలుసు, ఆరు ప్రామిసరీ నోట్లు, ఆరు చెక్కులు, రూ.71 వేల నగదు, పాస్పోర్టులు దొరికినట్లు ఏసీపీ తెలిపారు. వీటి విలువ సుమారు రూ.25 లక్షల వరకు ఉంటుందని చెప్పారు.
నమ్మించి.. ఇలా వంచించి..
కొత్త వీరేశంను వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన బోయినపల్లి రవీందర్రావు హైదరాబాద్కు చెందిన గూడూర్ పవన్కుమార్కు పరిచయం చేశారు. కరీంనగర్ జిల్లాలోని ఓ ప్రైవేటు వైద్య కళాశాలలో వైద్యుడిగా పని చేస్తున్న పవన్కుమార్ మామ వీరిని కళాశాల యజమానికి పరిచయం చేశారు. కళాశాల యజమానికి అప్పటి ప్రభుత్వ పెద్దల వద్ద మంచి పేరుండడంతో అతని ద్వారా ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ వీరేశం, గూడూర్ పవన్కుమార్ నిరుద్యోగులను నమ్మించసాగారు. వీరితోపాటు వీరేశం కుమారుడు గోపీనాథ్, పవన్కుమార్ భార్య పద్మజ కూడా మోసాల్లో భాగస్వాములయ్యారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలానికి చెందిన బుచ్చిబాబు, అలియాస్ బుచ్చయ్య ద్వారా కూడా నిరుద్యోగులను నమ్మించి డబ్బు తీసుకున్నారు. వీరేశం చెప్పిన వివరాల ప్రకారం.. గూడూర్ పవన్కుమార్, గోపీనాథ్, పద్మజ, రవీందర్రావు, ఖమ్మం పట్టణానికి చెందిన ఉట్కూరి శ్రీనివాస్రావు, ప్రకాశం జిల్లాకు చెందిన బుచ్చిబాబు, వీరేశం భార్య అరుంధతి, కుమార్తె పూజితలను పోలీసులు నిందితులుగా పేర్కొన్నారు. వీరిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. నిందితుడిని అరెస్టు చేయడంలో ప్రతిభ కనబర్చిన టాస్క్ఫోర్స్, సుబేదారి పోలీసులను వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్కిశోర్ ఝా అభినందించారు. విలేకరుల సమావేశంలో సుబేదారి ఇన్స్పెక్టర్ సత్యనారాయణరెడ్డి, ఎస్సై సాంబయ్య, కానిస్టేబుళ్లు సుమన్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
8 నెలలు మోసగించారు.. రూ.7 కోట్లు కొట్టేశారు
తనకొక స్వామీజీ తెలుసని.. విదేశాల్లో ఉన్న శిష్యులు ఆయనకు విరాళాలు పంపిస్తారని.. పన్నుల కోసం ముందుగా పెట్టుబడి పెడితే 30శాతం వాటా పొందవచ్చని నమ్మించి ఓ ఘరానా ముఠా ఏకంగా రూ.7.18కోట్లు కాజేసింది. -
అత్యాచారం చేసి.. కాల్చిన ఇనుప రాడ్డుతో ముఖంపై పేరు రాసి..
ఉత్తర్ప్రదేశ్లోని లఖీంపుర్ ఖేరీలో దారుణం చోటుచేసుకుంది. ఓ 17 ఏళ్ల బాలికను మూడు రోజుల పాటు బంధించి అత్యాచారం చేసిన ఘటన తాజాగా వెలుగుచూసింది. -
కృష్ణా జిల్లాలో రూ.80లక్షల మద్యం పట్టివేత
ఎన్నికల్లో పంపిణీ చేసేందుకు కృష్ణా జిల్లా గన్నవరం మండలం మెట్లపల్లిలో హనుమాన్జంక్షన్ సర్కిల్ పరిధిలోని ఆత్కూరు స్టేషన్ శివారులో నిల్వ ఉంచిన 58,080 క్వార్టర్ల మద్యం సీసాలను పోలీసులు పట్టుకున్నారు. -
వైకాపా నాయకుడి పశువుల పాకలో భారీగా మద్యం సీసాలు లభ్యం
వైకాపా నాయకుడి పశువుల పాకలో భారీగా గోవా మద్యం సీసాలు పట్టుబడిన సంఘటన ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం యర్రగుడిపాడులో ఆదివారం చోటుచేసుకుంది. -
మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసు.. బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ అరెస్ట్
మహదేవ్ బెట్టింగ్ యాప్ కుంభకోణం కేసులో బాలీవుడ్ నటుడు, ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ సాహిల్ ఖాన్ను ముంబయి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
పాక్ పడవ నుంచి రూ.600 కోట్ల విలువైన మాదకద్రవ్యాల స్వాధీనం
గుజరాత్ తీరానికి సమీపంలో పాకిస్థాన్కు చెందిన పడవ నుంచి 86 కేజీల బరువున్న 78 పొట్లాల మాదకద్రవ్యాలను భారతీయ కోస్టుగార్డు స్వాధీనం చేసుకున్నట్లు తీర రక్షక దళ సంస్థ ఆదివారం తెలిపింది. -
జమ్మూకశ్మీర్లో కాల్పులు.. గ్రామ రక్షక భటుడి మృతి
జమ్మూకశ్మీర్లోని ఉధంపుర్ జిల్లాలో మారుమూల గ్రామమైన పనారాలో కాల్పులు కలకలం సృష్టించాయి. -
12 మంది కల్తీ విత్తన విక్రేతలపై క్రిమినల్ కేసులు
రైతులకు కల్తీ విత్తనాలు విక్రయించిన 12మందిని గుర్తించి క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు వ్యవసాయ శాఖ తెలిపింది. -
ట్రేడ్ లైసెన్సుల పేరిట వ్యాపారులకు బురిడీ
మీ వ్యాపార ట్రేడ్ లైసెన్సులు రెన్యువల్ చేసుకోవాలంటూ పలు హోటళ్లు, రెస్టారెంట్లు, ఆసుపత్రి నిర్వాహకుల నుంచి డబ్బులు వసూలు చేసిన అంతర్రాష్ట్ర సైబర్ మోసగాడిని గద్వాల పోలీసులు అరెస్టు చేసి రిమాండుకు పంపారు.