భుజంగరావు, తిరుపతన్నల కంప్యూటర్లు, ల్యాప్టాప్ల విశ్లేషణ
ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టై పోలీసు కస్టడీలో ఉన్న భుజంగరావు, తిరుపతన్నల కంప్యూటర్లు, ల్యాప్టాప్లను విశ్లేషించడంపై దర్యాప్తు బృందం దృష్టి సారించింది.
వాటిలోని డేటా రిట్రీవ్కు ప్రయత్నం
ఫోన్ ట్యాపింగ్ నిరూపణలో సాంకేతిక ఆధారాలే కీలకం
ఈనాడు, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టై పోలీసు కస్టడీలో ఉన్న భుజంగరావు, తిరుపతన్నల కంప్యూటర్లు, ల్యాప్టాప్లను విశ్లేషించడంపై దర్యాప్తు బృందం దృష్టి సారించింది. ఇంటెలిజెన్స్లో పని చేసిన భుజంగరావు, హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ వింగ్లో పనిచేసిన తిరుపతన్నకు సంబంధించిన ఎలక్ట్రానిక్ ఉపకరణాలను పోలీసు అధికారులు ఇప్పటికే జప్తు చేశారు. వాటితోపాటు వారి సెల్ఫోన్లలోని డేటాను విశ్లేషించే పనిని వేగవంతం చేస్తున్నారు. ట్యాపింగ్ అంశాన్ని నిరూపించేందుకు సాంకేతిక ఆధారాల సేకరణ అవశ్యంగా మారడంతో ప్రత్యేక శ్రద్ధవహిస్తున్నారు. ఆయా ఉపకరణాల్లోని డేటాను చాలావరకు ముందే తొలగించి ఉండటంతో ఫోరెన్సిక్ ల్యాబ్లో రిట్రీవ్(తిరిగి పొందడం) చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. వీటిలోని డేటా లభిస్తేనే కేసు దర్యాప్తు ముందుకెళ్లే వీలుంటుందని భావిస్తున్నారు.
ఎందుకు చేశారు.. ఎవరు చేయమన్నారు..?
మరోవైపు బంజారాహిల్స్ ఠాణాలో భుజంగరావు, తిరుపతన్నల విచారణను రెండో రోజు శనివారం కొనసాగించారు. ప్రధానంగా రాజకీయ నేతలు, వ్యాపారుల ఫోన్ల ట్యాపింగ్ బాధ్యతను ప్రణీత్రావుకు అప్పగించాలని సూచించిందెవరు..? ట్యాపింగ్ ద్వారా సేకరించిన సమాచారాన్ని ఎవరికి చేరవేశారు..? అనే వాటిపై విచారణ సాగినట్లు తెలిసింది. టాస్క్ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్రావుతోపాటు మరో విశ్రాంత ఐపీఎస్ అధికారి సూచనలతోనే తాము ఈ పనికి పాల్పడ్డామని వారిద్దరూ చెప్పినట్లు సమాచారం. అయితే ఇందుకు సంబంధించిన సాంకేతిక ఆధారాల్ని సేకరించడం ద్వారా ఈ అక్రమాన్ని నిగ్గు తేల్చే పనిలో దర్యాప్తు బృందం నిమగ్నమైంది. మరోవైపు 48 గంటలకుపైగా జ్యుడిషియల్ రిమాండులో ఉన్న కారణంగా వీరిద్దరి సస్పెన్షన్ అనివార్యమే అయినా ఇంకా అధికారికంగా ఉత్తర్వులు వెలువడలేదు.
రాధాకిషన్రావు కస్టడీకి ప్రయత్నాలు
ప్రస్తుతం జ్యుడిషియల్ రిమాండులో ఉన్న రాధాకిషన్రావును కస్టడీకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. హైదరాబాద్ టాస్క్ఫోర్స్లో ఉంటూ పోలీసు వాహనాల్లో ఓ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులకు డబ్బు తరలింపుతోపాటు ప్రైవేటు వ్యక్తులపై నిఘా ఉంచడం లాంటి అక్రమాలకు పాల్పడినట్లు ప్రాథమికంగా గుర్తించిన దర్యాప్తు బృందం మరిన్ని వివరాలు సేకరించడంపై దృష్టి సారించింది. సోమవారం ఆయన్ను కస్టడీకి కోరుతూ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు సమాచారం. టాస్క్ఫోర్స్లో పనిచేసిన పలువురు క్షేత్రస్థాయి పోలీసులను విచారించినప్పుడు అంతా రాధాకిషన్రావు ఆదేశాల మేరకే చేశామని చెప్పినట్లు తేలడంతోనూ ఆయన్ను మరోసారి విచారించాలని నిర్ణయించారు. ప్రణీత్రావుపై కేసు నమోదు కాగానే రాధాకిషన్రావు విదేశాలకు వెళ్లినట్లు తెలియడంతో దర్యాప్తును తప్పించుకునేందుకు ప్రయత్నించారనే ప్రచారం జరిగింది. అయితే బహ్రెయిన్లో ఓ శుభకార్యం నిమిత్తంవెళ్లి వచ్చినట్లుగా దర్యాప్తు బృందానికి ఆయన సమాచారమిచ్చినట్లు తెలిసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొల్లగొడుతున్న సైబర్ ముఠాలు
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి వ్యాపారి(40) వాట్సప్కు స్టాక్మార్కెట్ మెలకువలు నేర్పిస్తామంటూ మెసేజ్ వచ్చింది. ఆయన ఆసక్తి చూపడంతో ‘ఓక్ట్రీ క్యాపిటల్ గ్రూప్’ పేరిట ఉన్న వాట్సప్ గ్రూప్లో చేర్చారు. నిర్వాహకుల మాటలు నమ్మి వారు సూచించిన బ్యాంకు ఖాతాలోకి వ్యాపారి నగదు బదిలీ చేస్తూ వచ్చారు. -
శిర్డీ ఎక్స్ప్రెస్లో భారీ చోరీ
శిర్డీ ఎక్స్ప్రెస్లో గురువారం అర్ధరాత్రి దాటాక దొంగలు విరుచుకుపడ్డారు. ప్రయాణికుల విలువైన వస్తువులు దోచుకొని పారిపోయారు. శుక్రవారం తెల్లవారుజామున గుర్తించిన బాధితులు సికింద్రాబాద్ రైల్వేపోలీసులకు ఫిర్యాదు చేశారు. -
కొడవలితో కొడుకు ఛాతీని గాయపరిచిన తల్లిదండ్రులు
గుడుంబా మత్తులో మానవత్వం మరిచిన ఓ జంట కన్నకొడుకు ఛాతీని కొడవలితో కోసిన ఘటన మంచిర్యాల జిల్లా నెన్నెల మండల కేంద్రంలో గురువారం రాత్రి జరిగింది. -
ప్రతికూల వాతావరణంతో యువ సైనికుడి మృతి
సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలనే ఆ యువకుని తపన ఆదిలోనే ఆవిరైపోయింది. అనారోగ్యం బారినపడటంతో యువసైనికుడు గురువారం రాత్రి మృత్యువాత పడ్డారు. -
గురుకుల విద్యార్థి మృతి
జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ బాలుర గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థి అస్వస్థతకు గురై మృతి చెందాడు. అనంతరం మరో ఇద్దరు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. -
గంజాయి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడి.. సహకరించిన భార్య
న్యాయ విద్య చదువుకొని ఉన్నతంగా జీవించాల్సిన యువ దంపతులు గాడితప్పారు. గంజాయికి బానిసలై.. అడ్డదారులు తొక్కారు. సహచర విద్యార్థి అయిన యువతిని ఆ మత్తు ఊబిలోకి దించారు. -
విద్యార్థి ఉసురు తీసిన నాడు-నేడు పనులు
గత వైకాపా ప్రభుత్వ హయాంలో నాసిరకంగా చేపట్టిన నాడు-నేడు అదనపు తరగతి గదుల నిర్మాణ పనులు ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. లింటెల్, దానిపైన ఉన్న గోడ కూలి మీద పడటంతో ఓ విద్యార్థి మృతి చెందిన ఘటన నెల్లూరులో చోటుచేసుకుంది.