కాళ్లపారాణి ఆరకముందే.. వధువు మృతి
అమ్మానాన్న చిన్నప్పుడే చనిపోవడంతో నాన్నమ్మ, తాతయ్య ఆమెను పెంచి పెద్దచేశారు. మనవరాలికి పెళ్లిచేసి ఓ అయ్య చేతిలో పెట్టామన్న వారి ఆనందం.. కొన్ని గంటల్లోనే ఆవిరైపోయింది.
మక్కువ, సాలూరు, న్యూస్టుడే: అమ్మానాన్న చిన్నప్పుడే చనిపోవడంతో నాన్నమ్మ, తాతయ్య ఆమెను పెంచి పెద్దచేశారు. మనవరాలికి పెళ్లిచేసి ఓ అయ్య చేతిలో పెట్టామన్న వారి ఆనందం.. కొన్ని గంటల్లోనే ఆవిరైపోయింది. వివాహమైన 12 గంటల్లోనే ఆ వధువు మృతిచెందింది. పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలంలో జరిగిన ఈ విషాద ఘటన పలువురిని కలచి వేసింది. వివరాలివి.. పార్వతీపురం పట్టణం కొత్తవలసకు చెందిన వెత్సా అఖిల (20)కు తల్లిదండ్రులు లేరు. నాన్నమ్మ, తాతయ్య అయిన.. ఊళ్ల పుణ్యవతి, చిన సత్యనారాయణ వద్ద పెరిగింది. ఆమెకు మక్కువ మండలం దబ్బగెడ్డకు చెందిన యువకుడితో శుక్రవారం రాత్రి పది గంటలకు వివాహం జరిగింది. అనంతరం నీరసంగా ఉందని అఖిల నిద్రపోయింది. ఉదయం లేచి అల్పాహారం తీసుకున్న కొంతసేపటికి ఆమెకు వాంతులయ్యాయి. దీంతో కొద్దిసేపు నిద్రపోగా.. ఎంతకీ లేవకపోవడంతో అపస్మారక స్థితికి చేరుకున్నట్లు గుర్తించిన కుటుంబసభ్యులు మక్కువ పీహెచ్సీకి తీసుకెళ్లారు. ప్రథమచికిత్స అనంతరం సాలూరు ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతిచెందినట్లు వైద్యులు మహేశ్, లోక్నాయక్ నిర్ధారించారు. పోస్టుమార్టం నివేదిక వచ్చేవరకూ మృతికి కారణాలు చెప్పలేమని వైద్యులు తెలిపారు. వివాహం జరిగిన గంటల వ్యవధిలో వధువు ప్రాణాలు కోల్పోవడంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు ఎస్సై నరసింహమూర్తి తెలిపారు. అఖిలకు పక్షవాతం సమస్య ఉందని.. నిద్రలో ఫిట్స్ వచ్చాయేమోనని నాన్నమ్మ, తాతయ్య చెబుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొడవలితో కొడుకు ఛాతీని గాయపరిచిన తల్లిదండ్రులు
గుడుంబా మత్తులో మానవత్వం మరిచిన ఓ జంట కన్నకొడుకు ఛాతీని కొడవలితో కోసిన ఘటన మంచిర్యాల జిల్లా నెన్నెల మండల కేంద్రంలో గురువారం రాత్రి జరిగింది. -
కొల్లగొడుతున్న సైబర్ ముఠాలు
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి వ్యాపారి(40) వాట్సప్కు స్టాక్మార్కెట్ మెలకువలు నేర్పిస్తామంటూ మెసేజ్ వచ్చింది. ఆయన ఆసక్తి చూపడంతో ‘ఓక్ట్రీ క్యాపిటల్ గ్రూప్’ పేరిట ఉన్న వాట్సప్ గ్రూప్లో చేర్చారు. నిర్వాహకుల మాటలు నమ్మి వారు సూచించిన బ్యాంకు ఖాతాలోకి వ్యాపారి నగదు బదిలీ చేస్తూ వచ్చారు. -
శిర్డీ ఎక్స్ప్రెస్లో భారీ చోరీ
శిర్డీ ఎక్స్ప్రెస్లో గురువారం అర్ధరాత్రి దాటాక దొంగలు విరుచుకుపడ్డారు. ప్రయాణికుల విలువైన వస్తువులు దోచుకొని పారిపోయారు. శుక్రవారం తెల్లవారుజామున గుర్తించిన బాధితులు సికింద్రాబాద్ రైల్వేపోలీసులకు ఫిర్యాదు చేశారు. -
ప్రతికూల వాతావరణంతో యువ సైనికుడి మృతి
సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలనే ఆ యువకుని తపన ఆదిలోనే ఆవిరైపోయింది. అనారోగ్యం బారినపడటంతో యువసైనికుడు గురువారం రాత్రి మృత్యువాత పడ్డారు. -
గురుకుల విద్యార్థి మృతి
జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ బాలుర గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థి అస్వస్థతకు గురై మృతి చెందాడు. అనంతరం మరో ఇద్దరు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. -
గంజాయి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడి.. సహకరించిన భార్య
న్యాయ విద్య చదువుకొని ఉన్నతంగా జీవించాల్సిన యువ దంపతులు గాడితప్పారు. గంజాయికి బానిసలై.. అడ్డదారులు తొక్కారు. సహచర విద్యార్థి అయిన యువతిని ఆ మత్తు ఊబిలోకి దించారు. -
విద్యార్థి ఉసురు తీసిన నాడు-నేడు పనులు
గత వైకాపా ప్రభుత్వ హయాంలో నాసిరకంగా చేపట్టిన నాడు-నేడు అదనపు తరగతి గదుల నిర్మాణ పనులు ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. లింటెల్, దానిపైన ఉన్న గోడ కూలి మీద పడటంతో ఓ విద్యార్థి మృతి చెందిన ఘటన నెల్లూరులో చోటుచేసుకుంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం