మత్తు ఇంజక్షన్ ఇచ్చి విశ్రాంత ఉద్యోగి హత్య.. బంగారు నగలు దోచుకున్న వైద్యుడు
ఓ విశ్రాంత ఉద్యోగికి ఇంజక్షన్ ఇచ్చి వైద్యుడు హతమార్చాడు. ఆ పై ఇంట్లో చొరబడి నగలు, నగదు దోచుకున్నాడు. కొద్ది రోజుల కిందట ఏలూరు శివారు చొదిమెళ్లలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఏలూరు నేరవార్తలు, న్యూస్టుడే: ఓ విశ్రాంత ఉద్యోగికి ఇంజక్షన్ ఇచ్చి వైద్యుడు హతమార్చాడు. ఆ పై ఇంట్లో చొరబడి నగలు, నగదు దోచుకున్నాడు. కొద్ది రోజుల కిందట ఏలూరు శివారు చొదిమెళ్లలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం... బత్తిన మల్లేశ్వరరావు (63) తపాలాశాఖలో ఉద్యోగవిరమణ పొందారు. అదే గ్రామానికి చెందిన కొవ్వూరి భానుసుందర్ ఎంబీబీఎస్ చదివి నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యుడిగా పనిచేస్తున్నాడు. మల్లేశ్వరరావుతో సన్నిహితంగా ఉండేవాడు. గతంలో ఏలూరు త్రీటౌన్ పరిధిలో కొంతమందికి వైద్యం చేసే నెపంతో మత్తు ఇంజక్షన్లు ఇచ్చి వాళ్లు మత్తులోకి వెళ్లాక వారి వద్దనున్న డబ్బు దోచుకునేవాడు. వారు కొన్ని రోజులు అస్వస్థతకు గురై కోలుకునేవారు. ఈ తరహా కేసులు అతనిపై ఏలూరు త్రీటౌన్, వన్టౌన్ పోలీసుస్టేషన్లలో నమోదయ్యాయి. మల్లేశ్వరరావునూ ఇదే తరహాలో చేయాలని భానుసుందర్ గత డిసెంబరు 24న ఆయన ఇంటికి వెళ్లాడు. ఆయన ఒక్కడే ఉండటంతో ఇంజక్షన్ చేశాడు. మల్లేశ్వరరావు మత్తులోకి జారగానే వైద్యుడు ఇంట్లోకి వెళ్లి బంగారు నగలు, కొంత నగదు అపహరించుకుపోయాడు. మల్లేశ్వరరావు కోలుకోలేక చనిపోవటంతో కుటుంబసభ్యులు తొలుత సహజమరణంగా భావించారు. ఆ తరువాత వైద్యుడు భానుసుందర్ ప్రవర్తనపై అనుమానం కలిగి నిలదీయగా అప్పటినుంచి పరారీలో ఉన్నాడు. మృతుడి కుమారుడు సోమశేఖర్ ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొల్లగొడుతున్న సైబర్ ముఠాలు
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి వ్యాపారి(40) వాట్సప్కు స్టాక్మార్కెట్ మెలకువలు నేర్పిస్తామంటూ మెసేజ్ వచ్చింది. ఆయన ఆసక్తి చూపడంతో ‘ఓక్ట్రీ క్యాపిటల్ గ్రూప్’ పేరిట ఉన్న వాట్సప్ గ్రూప్లో చేర్చారు. నిర్వాహకుల మాటలు నమ్మి వారు సూచించిన బ్యాంకు ఖాతాలోకి వ్యాపారి నగదు బదిలీ చేస్తూ వచ్చారు. -
శిర్డీ ఎక్స్ప్రెస్లో భారీ చోరీ
శిర్డీ ఎక్స్ప్రెస్లో గురువారం అర్ధరాత్రి దాటాక దొంగలు విరుచుకుపడ్డారు. ప్రయాణికుల విలువైన వస్తువులు దోచుకొని పారిపోయారు. శుక్రవారం తెల్లవారుజామున గుర్తించిన బాధితులు సికింద్రాబాద్ రైల్వేపోలీసులకు ఫిర్యాదు చేశారు. -
కొడవలితో కొడుకు ఛాతీని గాయపరిచిన తల్లిదండ్రులు
గుడుంబా మత్తులో మానవత్వం మరిచిన ఓ జంట కన్నకొడుకు ఛాతీని కొడవలితో కోసిన ఘటన మంచిర్యాల జిల్లా నెన్నెల మండల కేంద్రంలో గురువారం రాత్రి జరిగింది. -
ప్రతికూల వాతావరణంతో యువ సైనికుడి మృతి
సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలనే ఆ యువకుని తపన ఆదిలోనే ఆవిరైపోయింది. అనారోగ్యం బారినపడటంతో యువసైనికుడు గురువారం రాత్రి మృత్యువాత పడ్డారు. -
గురుకుల విద్యార్థి మృతి
జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ బాలుర గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థి అస్వస్థతకు గురై మృతి చెందాడు. అనంతరం మరో ఇద్దరు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. -
గంజాయి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడి.. సహకరించిన భార్య
న్యాయ విద్య చదువుకొని ఉన్నతంగా జీవించాల్సిన యువ దంపతులు గాడితప్పారు. గంజాయికి బానిసలై.. అడ్డదారులు తొక్కారు. సహచర విద్యార్థి అయిన యువతిని ఆ మత్తు ఊబిలోకి దించారు. -
విద్యార్థి ఉసురు తీసిన నాడు-నేడు పనులు
గత వైకాపా ప్రభుత్వ హయాంలో నాసిరకంగా చేపట్టిన నాడు-నేడు అదనపు తరగతి గదుల నిర్మాణ పనులు ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. లింటెల్, దానిపైన ఉన్న గోడ కూలి మీద పడటంతో ఓ విద్యార్థి మృతి చెందిన ఘటన నెల్లూరులో చోటుచేసుకుంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే