మత్తు ఇంజక్షన్ ఇచ్చి విశ్రాంత ఉద్యోగి హత్య.. బంగారు నగలు దోచుకున్న వైద్యుడు
ఓ విశ్రాంత ఉద్యోగికి ఇంజక్షన్ ఇచ్చి వైద్యుడు హతమార్చాడు. ఆ పై ఇంట్లో చొరబడి నగలు, నగదు దోచుకున్నాడు. కొద్ది రోజుల కిందట ఏలూరు శివారు చొదిమెళ్లలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఏలూరు నేరవార్తలు, న్యూస్టుడే: ఓ విశ్రాంత ఉద్యోగికి ఇంజక్షన్ ఇచ్చి వైద్యుడు హతమార్చాడు. ఆ పై ఇంట్లో చొరబడి నగలు, నగదు దోచుకున్నాడు. కొద్ది రోజుల కిందట ఏలూరు శివారు చొదిమెళ్లలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం... బత్తిన మల్లేశ్వరరావు (63) తపాలాశాఖలో ఉద్యోగవిరమణ పొందారు. అదే గ్రామానికి చెందిన కొవ్వూరి భానుసుందర్ ఎంబీబీఎస్ చదివి నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యుడిగా పనిచేస్తున్నాడు. మల్లేశ్వరరావుతో సన్నిహితంగా ఉండేవాడు. గతంలో ఏలూరు త్రీటౌన్ పరిధిలో కొంతమందికి వైద్యం చేసే నెపంతో మత్తు ఇంజక్షన్లు ఇచ్చి వాళ్లు మత్తులోకి వెళ్లాక వారి వద్దనున్న డబ్బు దోచుకునేవాడు. వారు కొన్ని రోజులు అస్వస్థతకు గురై కోలుకునేవారు. ఈ తరహా కేసులు అతనిపై ఏలూరు త్రీటౌన్, వన్టౌన్ పోలీసుస్టేషన్లలో నమోదయ్యాయి. మల్లేశ్వరరావునూ ఇదే తరహాలో చేయాలని భానుసుందర్ గత డిసెంబరు 24న ఆయన ఇంటికి వెళ్లాడు. ఆయన ఒక్కడే ఉండటంతో ఇంజక్షన్ చేశాడు. మల్లేశ్వరరావు మత్తులోకి జారగానే వైద్యుడు ఇంట్లోకి వెళ్లి బంగారు నగలు, కొంత నగదు అపహరించుకుపోయాడు. మల్లేశ్వరరావు కోలుకోలేక చనిపోవటంతో కుటుంబసభ్యులు తొలుత సహజమరణంగా భావించారు. ఆ తరువాత వైద్యుడు భానుసుందర్ ప్రవర్తనపై అనుమానం కలిగి నిలదీయగా అప్పటినుంచి పరారీలో ఉన్నాడు. మృతుడి కుమారుడు సోమశేఖర్ ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తల్లిని, భార్యాబిడ్డలను హతమార్చి.. ఉరేసుకుని మరణించిన వైద్యుడు
ఆర్థిక సమస్యలు ఓ కుటుంబాన్ని బలి తీసుకున్నాయి. అప్పుల కారణంగా మానసికంగా కుంగిపోయిన ఓ వైద్యుడు భార్య, ఇద్దరు పిల్లలను, కన్నతల్లిని కడతేర్చి తానూ ఉరివేసుకుని తనువు చాలించారు. -
ఎదురుకాల్పుల్లో 10 మంది మావోయిస్టుల మృతి
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని అబూఝ్మడ్ అటవీ ప్రాంతం మరోసారి తుపాకుల మోతతో దద్దరిల్లింది. నారాయణ్పుర్, కాంకేర్ జిల్లాల సరిహద్దు ప్రాంతంలో భద్రతాబలగాలు, మావోయిస్టుల మధ్య మంగళవారం జరిగిన ఎదురుకాల్పుల్లో 10 మంది మావోయిస్టులు మృతి చెందారు. -
టమాటా పెట్టెల చాటున తెలంగాణ మద్యం రవాణా
తెలంగాణ నుంచి భారీ మొత్తంలో మద్యం అక్రమ రవాణా చేస్తున్న నిందితులను స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో(సెబ్) పోలీసులు అరెస్టు చేశారు. -
మహారాష్ట్రలో ఆర్టీసీ బస్సు, ట్రక్కు ఢీ
మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు ఓ ట్రక్కును ఢీకొంది. ఈ ప్రమాదంలో ఓ బాలుడు సహా నలుగురు దుర్మరణం పాలయ్యారు. -
సివిల్స్ మూడో ర్యాంకర్ అనన్యరెడ్డి పేరుతో నకిలీ ఖాతాలు
తన పేరిట సామాజిక మాధ్యమాల్లో నకిలీ ఖాతాలు సృష్టించి డబ్బు వసూలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని సివిల్స్ మూడో ర్యాంకర్ అనన్యరెడ్డి సైబరాబాద్ సైబర్క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ప్రపంచం ఇలా ఎందుకు ఉండలేకపోతోంది..!: ఆనంద్ మహీంద్రా
-
మరో ‘బాహుబలి’ వచ్చేస్తోంది.. క్రేజీ అప్డేట్ ఇచ్చిన రాజమౌళి
-
నిజమే.. ఆర్థిక సవాళ్లు ఎదుర్కొంటున్నాం : చైనా
-
ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్.. గెలాక్సీ ఎస్23పై ₹20వేలు డిస్కౌంట్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (01/05/24)
-
సత్తా చాటిన ‘పొలిమేర 2’, ‘ఉస్తాద్’.. ఉత్తమ నటుడిగా నవీన్ చంద్ర