బాలిక ప్రాణం తీసిన బర్త్‌డే కేక్‌!

ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేసిన కేక్‌ విషపూరితం కావడంతో పదేళ్ల బాలిక మృత్యువాతపడింది. మార్చి 24న పంజాబ్‌లోని పటియాలాలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Published : 01 Apr 2024 05:22 IST

పటియాలా: ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేసిన కేక్‌ విషపూరితం కావడంతో పదేళ్ల బాలిక మృత్యువాతపడింది. మార్చి 24న పంజాబ్‌లోని పటియాలాలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు బేకరీ యజమానిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. పటియాలా చిన్నారి మాన్వికి మార్చి 24న పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. ఓ బేకరీ నుంచి ఆన్‌లైన్‌లో కేక్‌ ఆర్డర్‌ చేశారు. సాయంత్రం 7 గంటలకు కేక్‌ కట్‌ చేసి.. కుటుంబ సభ్యులంతా తిన్నారు. రాత్రి 10 గంటలకల్లా అందరూ అస్వస్థతకు గురయ్యారు. గొంతు తడారిపోతోందంటూ మాన్వి మంచినీళ్లు తాగి నిద్రలోకి జారుకుంది. ఉదయానికి ఆమె ఆరోగ్యం విషమించడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఎంత ప్రయత్నించినా చిన్నారి ప్రాణాలు కాపాడలేకపోయారు. కేకు విషపూరితం కావడం వల్లే బాలిక ప్రాణాలు కోల్పోయిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. స్థానిక పోలీస్‌  స్టేషన్‌లో బేకరీ యజమానిపై ఫిర్యాదు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని