గిరిజనుల మధ్య భూ వివాదం.. అడ్డుకోబోయిన పోలీసులపై దాడి
అటవీ భూముల వివాదంపై ఏర్పడిన ఘర్షణను ఆపాలని ప్రయత్నించిన పోలీసులపై గిరిజనులు తీవ్రంగా దాడి చేశారు. ఓ వర్గం కర్రలతో వెంబడించి మరీ దాడికి పాల్పడటంతో ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం చంద్రాయపాలెం అటవీ ప్రాంతం ఉద్రిక్తంగా మారింది.
సీఐ సహా ఐదుగురు సిబ్బందికి గాయాలు
చంద్రాయపాలెం అటవీ ప్రాంతంలో ఉద్రిక్తత
సత్తుపల్లి, న్యూస్టుడే: అటవీ భూముల వివాదంపై ఏర్పడిన ఘర్షణను ఆపాలని ప్రయత్నించిన పోలీసులపై గిరిజనులు తీవ్రంగా దాడి చేశారు. ఓ వర్గం కర్రలతో వెంబడించి మరీ దాడికి పాల్పడటంతో ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం చంద్రాయపాలెం అటవీ ప్రాంతం ఉద్రిక్తంగా మారింది. చంద్రాయపాలెం శివారులోని 9 హెక్టార్లలోని అటవీ భూమికి సంబంధించి కొన్నేళ్లుగా రెండు గిరిజన వర్గాల మధ్య వివాదం జరుగుతోంది. ఈ క్రమంలో ఆదివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో చంద్రాయపాలెం వర్గం.. బుగ్గపాడు, నాగుపల్లి, మొండివర్రె తదితర గ్రామాలకు చెందిన మరో వర్గానికి మధ్య వాగ్వాదం జరుగుతుండగా సాంబశివరావు అనే వ్యక్తి డయల్ 100కు ఫోన్ చేశారు. దీంతో సీఐ టి.కిరణ్తోపాటు పోలీసు సిబ్బంది నరేశ్, నరసింహారావు, ఇమ్రాన్, సత్యనారాయణలు ఘటనా స్థలానికి వెళ్లారు.
గొడవకు పాల్పడుతున్న రెండో వర్గానికి నాయకత్వం వహిస్తున్న కూరం మహేందర్ను సీఐ అదుపులోకి తీసుకునేందుకు యత్నించగా పలువురు గిరిజనులు అడ్డుకున్నారు. అనంతరం సీఐ, సిబ్బందిపై కర్రలు, వెదురుబద్దలతో దాడికి తెగబడ్డారు. సీఐని వెంబడించి ఆయన చొక్కాను చించివేసి కొట్టారు. ఎట్టకేలకు వారి నుంచి తప్పించుకొని ఐదుగురూ బయటపడ్డారు. విషయం తెలుసుకొని పోలీసు ఉన్నతాధికారులు కల్లూరు ఏసీపీ రఘు ఆధ్వర్యంలో సత్తుపల్లి, వైరా సబ్ డివిజన్లోని పోలీసులు, ఖమ్మం ఏఆర్, టాస్క్ఫోర్స్ సిబ్బందిని రంగంలోకి దింపారు. దాడికి పాల్పడిన అనుమానిత గిరిజనులను బుగ్గపాడులో సాయంత్రం అదుపులోకి తీసుకుని ఠాణాకు తరలించారు. మొత్తం 19 మంది మహిళలపై కేసు నమోదు చేసి రిమాండుకు పంపామని, పరారీలో ఉన్న మరికొంత మంది నిందితులను పట్టుకునేందుకు గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. కాగా 1986లో సదరు భూములకు సంబంధించి ప్రభుత్వం తమకు పట్టాలిచ్చిందని చంద్రాయపాలెం గిరిజనులు అంటుండగా.. 1976-77లోనే తమకు పట్టాలిచ్చారని మరో వర్గం చెబుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొల్లగొడుతున్న సైబర్ ముఠాలు
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి వ్యాపారి(40) వాట్సప్కు స్టాక్మార్కెట్ మెలకువలు నేర్పిస్తామంటూ మెసేజ్ వచ్చింది. ఆయన ఆసక్తి చూపడంతో ‘ఓక్ట్రీ క్యాపిటల్ గ్రూప్’ పేరిట ఉన్న వాట్సప్ గ్రూప్లో చేర్చారు. నిర్వాహకుల మాటలు నమ్మి వారు సూచించిన బ్యాంకు ఖాతాలోకి వ్యాపారి నగదు బదిలీ చేస్తూ వచ్చారు. -
శిర్డీ ఎక్స్ప్రెస్లో భారీ చోరీ
శిర్డీ ఎక్స్ప్రెస్లో గురువారం అర్ధరాత్రి దాటాక దొంగలు విరుచుకుపడ్డారు. ప్రయాణికుల విలువైన వస్తువులు దోచుకొని పారిపోయారు. శుక్రవారం తెల్లవారుజామున గుర్తించిన బాధితులు సికింద్రాబాద్ రైల్వేపోలీసులకు ఫిర్యాదు చేశారు. -
కొడవలితో కొడుకు ఛాతీని గాయపరిచిన తల్లిదండ్రులు
గుడుంబా మత్తులో మానవత్వం మరిచిన ఓ జంట కన్నకొడుకు ఛాతీని కొడవలితో కోసిన ఘటన మంచిర్యాల జిల్లా నెన్నెల మండల కేంద్రంలో గురువారం రాత్రి జరిగింది. -
ప్రతికూల వాతావరణంతో యువ సైనికుడి మృతి
సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలనే ఆ యువకుని తపన ఆదిలోనే ఆవిరైపోయింది. అనారోగ్యం బారినపడటంతో యువసైనికుడు గురువారం రాత్రి మృత్యువాత పడ్డారు. -
గురుకుల విద్యార్థి మృతి
జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ బాలుర గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థి అస్వస్థతకు గురై మృతి చెందాడు. అనంతరం మరో ఇద్దరు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. -
గంజాయి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడి.. సహకరించిన భార్య
న్యాయ విద్య చదువుకొని ఉన్నతంగా జీవించాల్సిన యువ దంపతులు గాడితప్పారు. గంజాయికి బానిసలై.. అడ్డదారులు తొక్కారు. సహచర విద్యార్థి అయిన యువతిని ఆ మత్తు ఊబిలోకి దించారు. -
విద్యార్థి ఉసురు తీసిన నాడు-నేడు పనులు
గత వైకాపా ప్రభుత్వ హయాంలో నాసిరకంగా చేపట్టిన నాడు-నేడు అదనపు తరగతి గదుల నిర్మాణ పనులు ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. లింటెల్, దానిపైన ఉన్న గోడ కూలి మీద పడటంతో ఓ విద్యార్థి మృతి చెందిన ఘటన నెల్లూరులో చోటుచేసుకుంది.